తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : శ్రీనగర్ గ్రామపంచాయతీ పరిధిలో సుమారు కోటిన్నర రూపాయలు నిధులతో చేపట్టవలసిన అభివృద్ధి పనులకు గాను రేపు ఉదయం 9 గంటలకు శంకుస్థాపన కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరవుతున్న కొత్తగూడెం శాసనసభ్యులు కూనంనేని సాంబశివరావు పర్యటనను విజయవంతం చేయండి. అభివృద్ధి పనులకు శంకుస్థాపన జరిగే ప్రాంతాలను పరిశీలించి పత్రికా ప్రకటన విడుదల చేసిన శ్రీనగర్ కాలనీ మాజీ ఉపసర్పంచ్ లగడపాటి రమేష్ చంద్. శ్రీనగర్ కాలనీలోని మొదటి రెండవ వీధిలోని రోడ్డు డ్రైనేజీలు శంకుస్థాపన ప్రారంభోత్సవంతో పాటు శ్రీనగర్ మూడవ వీధిలో భగీరథ పైప్లైన్ శంకుస్థాపన ఇందిరానగర్ కాలనీలోని ప్రధాన డ్రైన్ శంకుస్థాపన. శ్రీనగర్ కాలనీలోని ఇందిరానగర్ ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలకు వెళ్లే దారి సిసి రోడ్డు శంకుస్థాపన రేషన్ షాపు రోడ్డులోని సీసీ రోడ్డుకు శంకుస్థాపన సాయి నగర్ బోర్ పైప్లైన్ శంకుస్థాపన బతుకమ్మ ఘాట్ శంకుస్థాపన కార్యక్రమాలకు ప్రజలు మహిళలు హాజరై విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు మూల్పురి ప్రసాద్ మాజీ వార్డు సభ్యులు తేలిక పుల్లయ్య , ధరావత్ నాగేశ్వరరావు పంచాయతీ సెక్రటరీ వంశి కృష్ణ పాల్గొన్నారు.
Admin
తెలుగు వెలుగు టీవీ