తెలుగు వెలుగు టీవీ - వార్తలు / జూలూరుపాడు : భద్రాద్రి కొత్తగూడెం నవంబర్ 25 తెలుగు వెలుగు )ఇందిరమ్మ కమిటీలు రాజకీయ జోక్యం లేకుండా గ్రామాల్లో అర్హులైన పేదలకు ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేయాలి మరియు ఇళ్ల స్థలాలు లేని వారికి ఇళ్ల స్థలాలు ఇవ్వాలని సిపిఐ ఎంఎల్ మాస్ లైన్ ప్రజాపంధ డిమాండ్ చేస్తుంది.సిపిఐ ఎంఎల్ మాస్ లైన్ ప్రజాప్రందా డు మండల కమిటీ ఆధ్వర్యంలో స్థానిక ఎంపీడీవో కార్యాలయం ముందు ధర్నా నిర్వహించటం జరిగింది. అనంతరం ఎంపీడీవో సూపర్డెంట్ రవి కి సమస్యలతో కూడిన వినతి పత్రాన్ని ఇవ్వటం జరిగింది పేదలను గుర్తించి ఇళ్ల స్థలాలు లేని వారిని ఇల స్థలాలు ఇవ్వాలని తాసిల్దార్ శ్రీనివాసరావు కు వినతి పత్రం ఇవ్వడం జరిగింది.ధర్నా కార్యక్రమాన్ని ఉద్దేశించి సిపిఐ ఎంఎల్ మాస్ కొత్తగూడెం.డివిజన్ కార్యదర్శిజాటోత్. కృష్ణ. పార్టీ మండల కార్యదర్శి బానోతు ధర్మలు మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల ముందు ఎన్నికల ముందు పేదలకు ఇచ్చిన హామీ ఇందిరమ్మ ఇల్లు ప్రతి ఒక్కరికి ఇస్తామని గ్యారెంటీ ఇచ్చిన వాటిలో ఈ పథకం ఒకటని ఈ పథకాన్ని గ్రామస్థాయిలో ఇందిరమ్మ కమిటీ పేర్లతో ఈ పథకంఅగోతిపాలు అయిందని వారు అన్నారు ఈ పథకం పారదర్శకంగా పేదలను గుర్తించడంలో రాజకీయ జోక్యంతో ఉందని ఇది సరైనది కాదని వారు గుర్తు చేశారు గ్రామస్థాయిలో సభలు ఏర్పాటు చేసి పేదలను గుర్తించి ప్రజా పాలన రసీదు ప్రతి ఒక్క పేదలకు ఇచ్చారనివారు గుర్తు చేశారు స్థానిక అధికారులకు స్థానిక ఎమ్మెల్యే అనేక దపాలుగా దరఖాస్తులు విన్నవించిన ఆ దరఖాస్తు ఫలితము లేకపోవటం దేనివల్ల పేదలు కాంగ్రెస్ పాలనపై ఇసుకు చెందుతున్నారని వారు అన్నారు రాష్ట్ర ప్రభుత్వం చెప్పే మాటలకు ఆచరణ చానా వ్యత్యాసంగా ఉందని వారు అన్నారు ఈ విషయాలు అట్లాగే కొనసాగితే రాబోయే రోజుల్లో జరిగే ఎన్నికల్లో తగిన గుణపాఠం ఎదుర్కోక తప్పదని వారు తెలియజేశారు ఇప్పటికైనా ప్రజా పాలన రసీదు ఆధారంగా అర్హులైన పేదలను గుర్తించి ఇందిరమ్మ కమిటీల జోక్యం లేకుండా పేదలకు ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేయాలని వారు ప్రభుత్వానికి డిమాండ్ చేశారు లేని ఎడల మండలంలో పేదలను సమీకరించి రాజకీయాల కతీతంగా పెద్ద ఎత్తున పోరాటం చేస్తామని ప్రభుత్వానికి హెచ్చరించారు ఈ కార్యక్రమంలో పార్టీ మండల నాయకులు పారుపల్లి బాబురావు జి బాలకోటి గంకల వెంకటమ్మ పద్మావతి కల్తీ శేఖర్ శివకుమార్ రంజిత్ కుమార్ కృష్ణవేణి అనసూయ బుజ్జి తదితరులు పాల్గొన్నారు
Admin
తెలుగు వెలుగు టీవీ