తెలుగు వెలుగు టీవీ - వార్తలు / జూలూరుపాడు : భద్రాద్రి కొత్తగూడెం ఆగస్టు 23 (తెలుగు వెలుగు) జూలూరుపాడు మండలం కాకర్ల పంచాయతీ లో హరితహారం లో రోడ్లకు ఇరువైపులా నాటిన కోణో కార్పస్ చెట్లను తీసి వేస్తున్నారు. పంచాయతీ సెక్రెటరీ నాని బాబు మాట్లాడుతూ పర్యావరణాన్ని హాని కలిగించే కోనో కార్పస్ మొక్కలుగా వీటిని ఆగస్టు 31 లోగా తొలగించవలసిందిగా జిల్లా కలెక్టర్ నుండి ఆదేశాలు వచ్చాయని తీసివేసిన మొక్కల స్థానంలో సెప్టెంబర్ 15 లోగా వేరే మొక్కలు వేయాలని నిర్ణయించారు అనీ చెప్పారు.
మరియు గ్రామంలో మోటర్ మరమ్మత్తులు చేయించారు . కాగా గత పది రోజుల్లో మూడుసార్లు మోటారు రిపేరు వచ్చిందని పేర్కొన్నారు
Admin
తెలుగు వెలుగు టీవీ