Sunday, 19 April 2026 02:17:54 PM
# గిరిజన ప్రాంతాలకు వైద్య సేవల్లో నూతన దిశగా ప్రభుత్వం కీలక ముందడుగు. # భద్రాచలం ఏఎస్పీ విక్రాంత్ కుమార్ సింగ్ ఆధ్వర్యంలో.. జిల్లా పోలీస్ హెడ్ క్వార్టర్స్ నందు Prosecution Review Committee (PRC) సమావేశం నిర్వహించబడింది. # చండ్రుగొండలో మూతపడ్డ పెట్రోల్ బంకులు. # పాలిసెట్ ప్రవేశ పరీక్షకు ఉచిత శిక్షణా తరగతులు – రుద్రంపూర్ ప్రభుత్వ పాలిటెక్నిక్. # ప్రతి ఒక్కరూ ట్రాఫిక్ నియమాలను పాటిస్తూ రోడ్డు ప్రమాదాలను నియంత్రించడంలో బాధ్యతగా వ్యవహరించాలి : డిఎస్పీ ఆదినారాయణ. # 6 నెలలుగా డాక్టర్ లేని ప్రభుత్వ హోమియో వైద్యశాల. # ఆరోగ్య సూత్రాలు పాటించండి శ్రమదానం చేయండి ఆరోగ్యంగా ఉండండి. Dr తుకారాం రాథోడ్ DMHO # బాల్యవివాహాలను అంతం చేద్దాం - ఆడపిల్లలకు బంగారు భవిష్యత్తును అందిద్దాం. # మానవత్వం చాటుకున్న సుజాతనగర్ ఎస్సై రమాదేవి. # సిపిఐ శాఖ సెక్రటరీ కీసరి రాఘవలు"పార్థివ దేహం" నివాళులు ఆర్పించిన సిపిఐ జిల్లా సెక్రటరీ సాబీర్ పాషా. # చిన్న చిన్న నిర్లక్ష్యాలే పెద్ద ప్రమాదాలకు దారితీస్తాయి.ప్రతి ఒక్కరూ కచ్చితంగా రోడ్డు భద్రతా నియమాలను పాటించాలి: ఎస్పీ రోహిత్ రాజు. # అశ్వరావుపేటలో రెండు 33/11 కేవీ విద్యుత్ ఉపకేంద్రాలకు శంకుస్థాపన. రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క మల్లు. # ఘనంగా అంబేద్కర్ 135వ జయంతి వేడుకలు # సమ్మర్ గేమ్స్ కోచింగ్ క్యాంప్ ప్రారంభించిన ఎమ్మెల్యే జారె. # సింగరేణి హెడ్ ఆఫీస్ వద్ద ఘనంగా రాజ్యాంగ నిర్మాత జయంతి. అంబేద్కర్ చిత్రపటానికి పుష్పాంజలి ఘటించిన ప్రముఖులు. # అంగన్వాడీల అభివృద్దె మా లక్ష్యం.వైరా ఎమ్మెల్యే రాందాస్ నాయక్.అంగన్వాడీ టీచర్లకు స్మార్ట్ ఫోన్ల పంపిణీ.దివ్యాంగులకు సహాయ ఉపకరణాల పంపిణీ. వైరా ఎమ్మెల్యే # జీవితం విలువైనది భద్రత మన బాధ్యత. ర్యాలీ ని ఉద్దేశించి మాట్లాడుతున్న 16 వ డివిజన్ కార్పొరేటర్ మునగడప పద్మ. # అశ్వాపురం ప్రభుత్వ జూనియర్ కళాశాల విద్యార్థిని 973 మార్కులతో ఓంకారిణి టాప్. # ఉపముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క పర్యటన ఏర్పాట్లను పరిశీలించిన ఎమ్మెల్యే జారె. # సెన్సస్ పనులను నిర్ణీత గడువులోపు పూర్తి చేయాలి: జిల్లా కలెక్టర్ జిల్లా కలెక్టర్ అంకిత్.

సామాజిక సమానత్వానికి మార్గదర్శి మహాత్మ జ్యోతిరావు పూలే: జిల్లా కలెక్టర్ అంకిత్

Date : 11 April 2026 03:33 PM Views : 66

తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : సామాజిక సమానత్వం, విద్యా వ్యాప్తి కోసం జీవితాంతం కృషి చేసిన మహాత్మ జ్యోతిరావు పూలే దేశానికి మార్గదర్శకుడిగా నిలిచారని జిల్లా కలెక్టర్ అంకిత్ అన్నారు . శనివారం ఐడిఓసి కార్యాలయం సమావేశ మందిరంలో మహాత్మ జ్యోతిరావు పూలే 200వ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించబడ్డాయి. ఈ సందర్భంగా కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన జిల్లా కలెక్టర్ అంకిత్, మహాత్మ జ్యోతిరావు పూలే చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ, సమాజంలో సమానత్వం, న్యాయం నెలకొల్పడంలో జ్యోతిరావు పూలే చేసిన సేవలు చిరస్మరణీయమని అన్నారు. మహిళా విద్యకు ప్రాధాన్యతనిస్తూ, ముందుగా తన భార్యకు విద్య అందించి, మహిళల సాధికారతకు పునాది వేసిన మహనీయుడు పూలే అని ఆయన పేర్కొన్నారు. బడుగు, బలహీన వర్గాల అభ్యున్నతికి కృషి చేసి, వారికి సామాజిక న్యాయం అందించేందుకు కొత్త దారులు చూపిన గొప్ప సంస్కర్తగా ఆయన నిలిచారని తెలిపారు. జాతి, వర్ణ వివక్షలను వ్యతిరేకిస్తూ సమాన హక్కుల సమాజాన్ని నిర్మించాలన్న లక్ష్యంతో పనిచేసిన పూలే ఆలోచనలు ఈనాటికీ ఎంతో ప్రాసంగికమని అన్నారు. ప్రతి ఒక్కరూ ఆయన ఆశయాలను స్ఫూర్తిగా తీసుకుని సమాజ అభివృద్ధికి కృషి చేయాలని కలెక్టర్ పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ వేణుగోపాల్, స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ విద్యాచందన, బీసీ సంక్షేమ అధికారి విజయలక్ష్మి దినేష్ ఎ.డి. మైన్స్, ఉపేందర్ ఇ.డి ఎస్.సి. కార్పోరేషన్, జి. శ్రీనివాస్ జిల్లా ఆడిట్ అధికారి డ సుదీర్ కుమార్ పంచాయితీరాజ్ శాఖ,జిల్లా అధికారులు, బి సి సంఘ నాయకులు కొదుమూరు సత్యనారణ బొర్రా జయమ్మ గుమలాపురం సత్యనారణ జి. కృష్ణ గారు, ఇంద్రాల మురళి, వారాధి సత్యనారాయణ , బండి రాజుగౌడ్, కార్యాలయ సిబ్బంది తదితరులు కార్యాక్రమంలో పాల్గొన్నారు.

telugu velugu

Admin

తెలుగు వెలుగు టీవీ

మరిన్ని వార్తలు

Copyright © Telugu Velugu TV 2026. All right Reserved.



Developed By :