తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : సామాజిక సమానత్వం, విద్యా వ్యాప్తి కోసం జీవితాంతం కృషి చేసిన మహాత్మ జ్యోతిరావు పూలే దేశానికి మార్గదర్శకుడిగా నిలిచారని జిల్లా కలెక్టర్ అంకిత్ అన్నారు . శనివారం ఐడిఓసి కార్యాలయం సమావేశ మందిరంలో మహాత్మ జ్యోతిరావు పూలే 200వ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించబడ్డాయి. ఈ సందర్భంగా కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన జిల్లా కలెక్టర్ అంకిత్, మహాత్మ జ్యోతిరావు పూలే చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ, సమాజంలో సమానత్వం, న్యాయం నెలకొల్పడంలో జ్యోతిరావు పూలే చేసిన సేవలు చిరస్మరణీయమని అన్నారు. మహిళా విద్యకు ప్రాధాన్యతనిస్తూ, ముందుగా తన భార్యకు విద్య అందించి, మహిళల సాధికారతకు పునాది వేసిన మహనీయుడు పూలే అని ఆయన పేర్కొన్నారు. బడుగు, బలహీన వర్గాల అభ్యున్నతికి కృషి చేసి, వారికి సామాజిక న్యాయం అందించేందుకు కొత్త దారులు చూపిన గొప్ప సంస్కర్తగా ఆయన నిలిచారని తెలిపారు. జాతి, వర్ణ వివక్షలను వ్యతిరేకిస్తూ సమాన హక్కుల సమాజాన్ని నిర్మించాలన్న లక్ష్యంతో పనిచేసిన పూలే ఆలోచనలు ఈనాటికీ ఎంతో ప్రాసంగికమని అన్నారు. ప్రతి ఒక్కరూ ఆయన ఆశయాలను స్ఫూర్తిగా తీసుకుని సమాజ అభివృద్ధికి కృషి చేయాలని కలెక్టర్ పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ వేణుగోపాల్, స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ విద్యాచందన, బీసీ సంక్షేమ అధికారి విజయలక్ష్మి దినేష్ ఎ.డి. మైన్స్, ఉపేందర్ ఇ.డి ఎస్.సి. కార్పోరేషన్, జి. శ్రీనివాస్ జిల్లా ఆడిట్ అధికారి డ సుదీర్ కుమార్ పంచాయితీరాజ్ శాఖ,జిల్లా అధికారులు, బి సి సంఘ నాయకులు కొదుమూరు సత్యనారణ బొర్రా జయమ్మ గుమలాపురం సత్యనారణ జి. కృష్ణ గారు, ఇంద్రాల మురళి, వారాధి సత్యనారాయణ , బండి రాజుగౌడ్, కార్యాలయ సిబ్బంది తదితరులు కార్యాక్రమంలో పాల్గొన్నారు.
Admin
తెలుగు వెలుగు టీవీ