Sunday, 21 June 2026 02:27:02 PM
# నీట్ పరీక్ష కేంద్రాల వద్ద పటిష్టమైన భద్రతా ఏర్పాట్లు : ఎస్పీ రోహిత్ రాజు పరీక్షా కేంద్రాల పరిసర ప్రాంతాల్లో 163 BNSS అమలులో ఉంటుంది. # భారతీయ జనతా పార్టీ జిల్లా కార్యవర్గ సమావేశం. జిల్లా అధ్యక్షులు బైరెడ్డి ప్రభాకర్ రెడ్డి. # ప్రాధాన్యతా రంగాలకు రుణాల మంజూరును పెంచాలి: జిల్లా కలెక్టర్ అంకిత్. రూ.8,914 కోట్ల జిల్లా వార్షిక రుణ ప్రణాళిక ఆవిష్కరణ . # నీట్ పరీక్షకు పకడ్బందీ ఏర్పాట్లు – పరీక్షా కేంద్రాలను తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్ అంకిత్. # బూత్ స్థాయిలో సమగ్ర పర్యవేక్షణతో ప్రత్యేక సవరణ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలి – రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి సుదర్శన్ రెడ్డి # ఈ నెల 21 ఆదివారం నాడు జరగబోయే నీట్ 2026 పరీక్ష కేంద్రాల వివరాలను వెల్లడి. జిల్లా కలెక్టర్ అంకిత్. # భూధార్ సర్వే, భూభారతి దరఖాస్తుల పరిష్కారాన్ని వేగవంతం చేయాలి – రాష్ట్ర రెవెన్యూ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ డి.ఎస్. లోకేష్ కుమార్. # రైతులకు సకాలంలో యూరియా అందుబాటులో. జిల్లాలో యూరియా బుకింగ్‌లలో 72.66 శాతం పంపిణీ పూర్తి – జిల్లా వ్యవసాయ అధికారి బాబురావు. # భూసేకరణ, పరిహారం చెల్లింపుల పురోగతిపై అధికారులతో సమీక్ష నిర్వహించిన ఆర్&ఆర్, ఇరిగేషన్ భూసేకరణ కమిషనర్ కె. శివకుమార్ నాయుడు. # ఈనెల 23న కమ్మ సేవా సమితిలో సింగరేణి పరిరక్షణ సదస్సు.విజయవంతం చేయాలని పిలుపునిచ్చిన రాజిరెడ్డి. # లోతు వాగు రైల్వే ఓవర్ బ్రిడ్జి మరమత్తు పనులను పరిశీలించిన జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఐపీఎస్. # టాస్క్ఫోర్స్ మరియు అన్నపురెడ్డి పల్లి పోలీసులు చేపట్టిన వాహన తనిఖీల్లో భారీగా 44.30 లక్షలు విలువైన గంజాయి స్వాధీనం. # కిన్నెరసానిని ప్రపంచస్థాయి పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దుతాం. కొత్తగూడెం శాసనసభ సభ్యులు కూనంనేని సాంబశివరావు. # ప్రశాంత వాతావరణంలో టీజీ టెట్ పరీక్షలు. జిల్లా కలెక్టర్ అంకిత్ . # జూలూరుపాడు ప్రభుత్వ పాఠశాల నందు సామూహిక అక్షరాభ్యాసం # వైకుంఠ రధం రిపేర్ చేయించి ఉపయోగమునకు తీసుకురావాలి. మేనేజర్ కి వినతి పత్రం అందించిన సిపిఐ జిల్లా నాయకులు మునిగడప వెంకటేశ్వర్లు. # ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో మరమ్మత్తు పనులు త్వరితగతిన పూర్తి చేయాలి – జిల్లా కలెక్టర్ అంకిత్. # అర్హుల గుర్తింపులో పారదర్శకత పాటించాలి – జిల్లా కలెక్టర్ అంకిత్. # ప్రతి విద్యార్థికి నాణ్యమైన విద్య అందించే బాధ్యత ఎంఈఓలదే – జిల్లా కలెక్టర్ అంకిత్. # రాష్ట్రంలో బిజెపి జెండా ఎగిరేందుకు ప్రతి ఒక్కరు కృషి చేయాలి - విలేకరుల సమావేశంలో ఉదయ్ ప్రతాప్, బైరెడ్డి.

హెడ్ క్వార్టర్స్ నందు పోలీసు వాహనాలను తనిఖీ చేసిన జిల్లా ఎస్పీ రోహిత్ రాజు.

Date : 16 March 2026 06:44 PM Views : 205

తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : పోలీస్ వాహనాల డ్రైవర్లు తమ వాహనాలను ఎల్లప్పుడూ మంచి కండీషన్లో ఉంచుకోవాలి : ఎస్పీ రోహిత్ రాజు. ఈ రోజు జిల్లా ఎస్పీ రోహిత్ రాజు జిల్లాలోని అన్నీ పోలీస్ స్టేషన్లు మరియు ఇతర అధికారుల వాహనాలను తనిఖీ చేశారు.జిల్లా పోలీస్ హెడ్ క్వార్టర్స్ నందు పోలీస్ వాహనాల రవాణాధికారి ఆర్ఐ సుధాకర్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమంలో పోలీస్ వాహనాలను ఎస్పీ తనిఖీ చేశారు.దీనిలో భాగంగా జిల్లాలోని పోలీస్ డ్రైవర్స్ సమస్యలు,డ్యూటీలో భాగంగా వారి పనితీరును గురించి ఎస్పీ స్వయంగా అడిగి తెలుసుకున్నారు.ప్రతి వెహికల్ కండిషన్ను ఎస్పీ గారు ప్రత్యేకంగా పరిశీలించారు.పోలీస్ శాఖలో డ్రైవర్లుగా పనిచేసే వారు ఖచ్చితంగా రోడ్డు భద్రతా నియమాలను పాటించాలని సూచించారు.శాంతి భద్రతల పరిరక్షణలో భాగంగా పోలీస్ అధికారులు,సిబ్బంది ప్రజలకు అందుబాటులో ఉండడంలో పోలీసు వాహనాల డ్రైవర్ల పాత్ర చాలా కీలకమని అన్నారు.ప్రతీ డ్రైవర్ కు తమ వాహన పనితీరు గురించి పూర్తి అవగాహన కలిగి ఉండాలని సూచించారు.డ్రైవర్లు తమ విధుల పట్ల ఎల్లప్పుడూ అప్రమత్తంగా ఉండాలని తెలిపారు.వాహన తనిఖీల సమయాల్లో తగు జాగ్రత్తలను తీసుకోవాలని సూచించారు.అత్యవసర సమయాల్లో విధులు నిర్వర్తించేటప్పుడు ఎలాంటి ఆవాంచనీయ సంఘటనలు జరగకుండా జాగ్రత్తలు పాటించాలని సూచించారు.విధుల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహారిస్తే శాఖాపరమైన చర్యలు తప్పవని తెలిపారు.విధుల పరంగా ఏవైనా సమస్యలు ఉంటే వెంటనే ఉన్నతాధికారుల దృష్టికి తీసుకురావాలని సూచించారు.ఈ కార్యక్రమంలో ఏఆర్ డిఎస్పీ సత్యనారాయణ,ఎస్బి ఇన్స్పెక్టర్ శ్రీనివాస్,ఆర్ఐ ఎంటిఓ సుధాకర్ అడ్మిన్ ఆర్ఐ లాల్ బాబు,వెల్ఫేర్ ఆర్ఐ కృష్ణారావు మరియు ఇతర అధికారులు పాల్గొన్నారు

telugu velugu

Admin

తెలుగు వెలుగు టీవీ

మరిన్ని వార్తలు

Copyright © Telugu Velugu TV 2026. All right Reserved.



Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: