Monday, 20 April 2026 01:37:35 PM
# అశ్వారావుపేట నియోజకవర్గ మాజీ MLA,BRS పార్టీ ఇంచార్జ్ మెచ్చా నాగేశ్వరరావు నేడు అశ్వారావుపేట మండలంలో విస్తృతంగా పర్యటించారు. # వైద్య ఖర్చులకు లక్ష రూపాయల ఎల్ఓసి మంజూరు చేసిన ఎమ్మెల్యే జారె. # మహా కుంభాభిషేకానికి రావాల్సిందిగా మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డిని ఆహ్వానించిన ఎమ్మెల్యే జారె. # గిరిజన ప్రాంతాలకు వైద్య సేవల్లో నూతన దిశగా ప్రభుత్వం కీలక ముందడుగు. # భద్రాచలం ఏఎస్పీ విక్రాంత్ కుమార్ సింగ్ ఆధ్వర్యంలో.. జిల్లా పోలీస్ హెడ్ క్వార్టర్స్ నందు Prosecution Review Committee (PRC) సమావేశం నిర్వహించబడింది. # చండ్రుగొండలో మూతపడ్డ పెట్రోల్ బంకులు. # పాలిసెట్ ప్రవేశ పరీక్షకు ఉచిత శిక్షణా తరగతులు – రుద్రంపూర్ ప్రభుత్వ పాలిటెక్నిక్. # ప్రతి ఒక్కరూ ట్రాఫిక్ నియమాలను పాటిస్తూ రోడ్డు ప్రమాదాలను నియంత్రించడంలో బాధ్యతగా వ్యవహరించాలి : డిఎస్పీ ఆదినారాయణ. # 6 నెలలుగా డాక్టర్ లేని ప్రభుత్వ హోమియో వైద్యశాల. # ఆరోగ్య సూత్రాలు పాటించండి శ్రమదానం చేయండి ఆరోగ్యంగా ఉండండి. Dr తుకారాం రాథోడ్ DMHO # బాల్యవివాహాలను అంతం చేద్దాం - ఆడపిల్లలకు బంగారు భవిష్యత్తును అందిద్దాం. # మానవత్వం చాటుకున్న సుజాతనగర్ ఎస్సై రమాదేవి. # సిపిఐ శాఖ సెక్రటరీ కీసరి రాఘవలు"పార్థివ దేహం" నివాళులు ఆర్పించిన సిపిఐ జిల్లా సెక్రటరీ సాబీర్ పాషా. # చిన్న చిన్న నిర్లక్ష్యాలే పెద్ద ప్రమాదాలకు దారితీస్తాయి.ప్రతి ఒక్కరూ కచ్చితంగా రోడ్డు భద్రతా నియమాలను పాటించాలి: ఎస్పీ రోహిత్ రాజు. # అశ్వరావుపేటలో రెండు 33/11 కేవీ విద్యుత్ ఉపకేంద్రాలకు శంకుస్థాపన. రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క మల్లు. # ఘనంగా అంబేద్కర్ 135వ జయంతి వేడుకలు # సమ్మర్ గేమ్స్ కోచింగ్ క్యాంప్ ప్రారంభించిన ఎమ్మెల్యే జారె. # సింగరేణి హెడ్ ఆఫీస్ వద్ద ఘనంగా రాజ్యాంగ నిర్మాత జయంతి. అంబేద్కర్ చిత్రపటానికి పుష్పాంజలి ఘటించిన ప్రముఖులు. # అంగన్వాడీల అభివృద్దె మా లక్ష్యం.వైరా ఎమ్మెల్యే రాందాస్ నాయక్.అంగన్వాడీ టీచర్లకు స్మార్ట్ ఫోన్ల పంపిణీ.దివ్యాంగులకు సహాయ ఉపకరణాల పంపిణీ. వైరా ఎమ్మెల్యే # జీవితం విలువైనది భద్రత మన బాధ్యత. ర్యాలీ ని ఉద్దేశించి మాట్లాడుతున్న 16 వ డివిజన్ కార్పొరేటర్ మునగడప పద్మ.

విద్యార్థి దశ నుండే విత్తనాల సేకరణ ద్వారా పర్యావరణం పై అవగాహన పెరుగుతుంది . జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్

Date : 15 September 2025 05:31 PM Views : 465

తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : విద్యార్థి దశ నుండే విత్తనాల సేకరణ కార్యక్రమం ద్వారా పర్యావరణంపై అవగాహన పెరుగుతుందని జిల్లా కలెక్టర్ జితేష్ వి. పాటిల్ అన్నారు.అశ్వాపురం మండలం నెల్లిపాక బంజర గ్రామంలోని మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల (ఎంపీపీ ఎస్) విద్యార్థులు పర్యావరణ పరిరక్షణకై చేపట్టిన సీడ్ బ్యాంక్ కార్యక్రమంలో జిల్లా స్థాయిలో మొదటి బహుమతిని సాధించడం గర్వకారణం అని జిల్లా కలెక్టర్ జితేష్ వి. పాటిల్ అన్నారు. సోమవారం పాఠశాలను సందర్శించిన కలెక్టర్, విద్యార్థులు సేకరించిన విత్తనాలను పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ – విత్తనాల సేకరణ అనేది కేవలం ఒక పోటీ మాత్రమే కాదు, పర్యావరణ పరిరక్షణకు పునాది అని, విత్తనాలను సంరక్షించడం ద్వారా భవిష్యత్ తరాలకు పచ్చని వారసత్వం అందించగలుగుతాం అని అన్నారు. ప్రతి విత్తనం ఒక జీవనాధారం, అది ఔషధ విలువలు, ఆహార భద్రత, జీవవైవిధ్యాన్ని కాపాడుతుంది అని అన్నారు. జిల్లా వ్యాప్తంగా సీడ్ కలెక్షన్‌లో భాగంగా అత్యధికంగా 362 రకాల విత్తనాలు, 440 కిలోల విత్తనాలను సేకరించినందుకు విద్యార్థులను ప్రత్యేకంగా అభినందించారు. విద్యార్థుల కృషితో పాటు ఉపాధ్యాయులు, పాఠశాల సిబ్బంది చూపిన నిబద్ధత ప్రశంసనీయమని ఆయన తెలిపారు. ఈ సందర్శన సందర్భంగా కలెక్టర్ పాఠశాలలోనే ఒక నర్సరీని ఏర్పాటు చేసి, వివిధ రకాల మొక్కల పెంపకాన్ని చేపట్టాలని సూచించారు. అదేవిధంగా పాఠశాల ప్రాంగణంలో సీడ్ గిఫ్ట్ బాక్స్‌ను ఏర్పాటు చేసి, సమాజంలో విత్తనాల మార్పిడి, పంపిణీకి అందుబాటులో ఉంచాలని సూచించారు. జిల్లా స్థాయి సీడ్ బ్యాంక్ పోటీల్లో విజయం సాధించిన ఈ పాఠశాలకు ఇవ్వబోయే రూ.50,000/- నగదు బహుమతితో పాటు, అదనంగా జిల్లా స్థాయి నిధులు కేటాయించి విద్యార్థులను మరింతగా ప్రోత్సహిస్తామని కలెక్టర్ హామీ ఇచ్చారు. సీడ్ బ్యాంక్ కార్యక్రమం ద్వారా పర్యావరణ పరిరక్షణ, జీవవైవిధ్యం కాపాడటం, భవిష్యత్ తరాలకు పచ్చని వారసత్వం అందించడం లక్ష్యమని కలెక్టర్ స్పష్టం చేశారు. ఈ పరిశీలనలో కలెక్టర్ వెంట స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ విద్యా చందన, ఎంఈఓ వీరాస్వామి, ప్రధానోపాధ్యాయురాలు విమల మరియు పాఠశాల సిబ్బంది, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.

telugu velugu

Admin

తెలుగు వెలుగు టీవీ

మరిన్ని వార్తలు

Copyright © Telugu Velugu TV 2026. All right Reserved.



Developed By :