తెలుగు వెలుగు టీవీ - వార్తలు / భద్రాచలం : గవర్నర్ శివప్రతాప్ శుక్లా, మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, ఎమ్మెల్యే తెల్లం వెంకటరావు లతో కలిసి పాల్గొన్న టీపీసీసీ జనరల్ సెక్రటరీ నాగా సీతారాములు. దక్షిణ అయోధ్య భద్రాచలంలో శ్రీ సీతారామచంద్ర స్వామి పట్టాభిషేక మహోత్సవం శనివారం ఘనంగా జరిగింది. అర్చకులు సమస్త నదీ జలాలతో కోదండ రామునికి అభిషేకం, ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం శ్రీ స్వామి వారికి రాష్ట్ర గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా పట్టు వస్త్రాలను సమర్పించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, ఎమ్మెల్యే వెంకట్రావు, టీపీసీసీ జనరల్ సెక్రటరీ నాగాసీతారాములు మరియు ముఖ్య నాయకులు, అధికారులు పాల్గొన్నారు.
Admin
తెలుగు వెలుగు టీవీ