తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : రాజేందర్ సేవా సంస్థ అధ్యక్షుడిగా యెర్రా సర్వేష్ ను నియమిస్తూ సంస్థ వ్యవస్థాపకులు యెర్రా కామేష్ సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు.గత 21 సంవత్సరాలుగా రాజేందర్ సేవా సంస్థ ఆధ్వర్యంలో పలు క్రీడా పోటీలు,రక్తదానం, డాన్స్ పోటీలు, మహిళలకు ముగ్గుల పోటీలేకాకుండా కరోనాలాంటి విపత్కర పరిస్థితులలో ప్రజలకు నిత్యావసరాల పంపిణీ వంటి స్వచ్ఛంద సేవా కార్యక్రమాలు నిర్వహించినట్లు తెలిపారు.దివంగత రాజేందర్ చిన్న తమ్ముడైన సర్వేష్ కు ఈ భాధ్యతలను అప్పగించడం జరిగిందని,గతంలో మాదిరిగానే భవిష్యత్తులో కూడా ఈ సేవా సంస్థ కార్యక్రమాలు విస్తృతంగా చేపట్టడం జరుగుతుందని తెలిపారు.ఆర్.జె.ఎస్.ఎస్ అధ్యక్షుడిగా నియమితుడైన సర్వేష్ మాట్లాడుతూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు, ప్రభుత్వ రంగ సంస్థలు స్వచ్ఛంద సేవా సంస్థలకు సహకరించాలని కోరారు.తనపై నమ్మకంతో ఆర్.జె.ఎస్.ఎస్ అధ్యక్షుడిగా నియమించిన వ్యవస్థాపక అధ్యక్షులు యెర్రా కామేష్ కు కృతజ్ఞతలు తెలిపారు.
Admin
తెలుగు వెలుగు టీవీ