తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొనిజర్ల : కొత్తగూడెం ఏరియాలోని రుద్రంపూర్ ఎంవిటీసీ నందు ప్రతి సంవత్సరకు ఒక్కరి నిర్వహించే స్ట్రక్చర్ ట్రైనింగ్ ఫర్ ఫ్రంట్ లైన్ సూపర్వైజర్స్ కార్యక్రమమును కొత్తగూడెం ఏరియా జనరల్ మేనేజర్ ఎం.షాలేం రాజు సోమవారం ప్రారంభించడం జరిగినది. ఈ సందర్భంగా జిఎం మాట్లాడుతూ ఈ ట్రైనింగ్ కార్యక్రమము తేదీ.18.08.2025 నుండి 30.08.2025 (12 రోజులు) వరకు జరుగునని ఫ్రంట్ లైన్ సూపర్వైజర్స్ ఈ అవకాశమును సద్వినియోగం చేసుకొని సున్న ఆక్సిడెంట్ (ఎటువంటి ఆక్సిడెంట్ లేకుండా) కొత్తగూడెం ఏరియాకు నిర్దేశించిన ఉత్పత్తిని రక్షణతో బొగ్గు ఉత్పత్తి చేసి, రవాణాకు సహకరించవలసిందిగా ఆదేశించడం జరిగింది. ఈ ఆర్థిక సంవత్సరంలో కొత్తగూడెం ఏరియాకు నిర్దేశించిన బొగ్గు ఉత్పత్తిలో 103% శాతంతో బొగ్గు ఉత్పత్తిని సాధించడం జరిగిందని అందుకు ప్రధాన పాత్రను పోషిస్తూ, సహకరించిన ఫ్రంట్ లైన్ సూపర్వైజర్ (మైనింగ్, మెకానికల్, ఎలక్ట్రికల్) వారికి ప్రత్యేక అభినందనలు తెలియజేస్తూ ఇదే స్పూర్తితో మిగిలిన నెలలలో కొత్తగూడెం ఏరియా కు నిర్దేశించిన ఉత్పత్తిని రక్షణతో పూర్తి చేయాలని ఆదేశించడం జరిగింది. మరి ముఖ్యంగా ఫ్రంట్ లైన్ సూపర్వైజర్స్ కు SOP (సేఫ్టీ ఆపరేటింగ్ ప్రొసీజర్)/ COP (కోడ్ ఒఫ్ ప్రాక్టీస్) లను తప్పక పాటించాలని వారి దగ్గర పనిచేసే ప్రతి ఉద్యోగికి తెలియజేస్తూ, SOP/COP (రక్షణ సూత్రాలను) తప్పక పాటించేలా చర్యలు తీసుకుంటూ ఎటువంటి ఆక్సిడెంట్ జరుగకుండా రక్షణతో కూడిన బొగ్గు ఉత్పత్తి మరియు రవాణాకు సహకరించవలసిందిగా హాజరైన సూపర్వైజర్స్ ఆదేశిస్తూ, మీ దగ్గర పనిచేసే ప్రతి ఉద్యోగికి ఈ విషయాన్నితెలిసేలా, తెలియజేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో కొత్తగూడెం ఏరియా జిఎం తో పాటు ఎస్.ఓ. టు జి.యం జీ.వి. కోటిరెడ్డి, కొత్తగూడెం ఏరియా ఏఐటియూసి వైస్ ప్రెసిడెంట్ కే. రాములు, ఐఎన్టియూసి వైస్ ప్రెసిడెంట్ ఎం.డి. రజాక్, డిజిఎం (పర్సనల్) జి.వి.మోహన్ రావు, ఇంచార్జీ ఏరియా ఇంజెనీర్ ఐ.వి.ఎస్.బి లక్ష్మణ మూర్తి, ఎం.వి.టి.సి మేనేజర్ జి.లక్ష్మణ్ ఎం.వి.టి.సి స్టాప్ మరియు శిక్షణకు వచ్చిన సూపర్వైజర్లు పాల్గొన్నారు
Admin
తెలుగు వెలుగు టీవీ