తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : ద్విచక్ర వాహనదారులు ఎదురెదురుగా ఢీకొనడంతో చండ్రగొండకు చెందిన ఎండీ సాఖిద్ (38) తీవ్రంగా గాయపడి ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందిన ఘటన మంగళవారం రామవరం టూటౌన్ పోలీసు స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాలు.. చండ్రుగొండ నుంచి కొత్తగూడెంకు ఎండీ సాఖిద్ ద్విచక్ర వాహనం వస్తున్న క్రమంలో, మరో ద్విచక్ర వాహనాన్ని రుద్రంపూర్లోని జీఏం ఆఫీస్ కార్యాలయం సమీపంలోని మూలమలుపు వద్ద ఢీకొట్టగా, సృహ తప్పి పడిపోయారు. సీఐ ప్రతాప్ ఘటన స్థలం వద్దకు చేరుకుని క్షతగాత్రులను 108 వాహనంతో కొత్తగూడెంలోని జిల్లా ప్రధానాస్పత్రికి తరలించారు. అప్పటికే తీవ్రంగా గాయపడిన ఎండీ సాఖిద్ చికిత్స పొందుతూ మృతి చెందాడు. మరోక ద్విచక్ర వాహనంపై వెళ్లుతున్న బార్యభర్తలకు స్వల్ప గాయాలయ్యాయి. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ ప్రతాప్ తెలిపారు.
Admin
తెలుగు వెలుగు టీవీ