తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : తెలుగు విశ్వవిద్యాలయానికి పొట్టి శ్రీరాములు పేరు యదా విధంగా కొనసాగించాలని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఆర్యవైశ్య మహాసభ ఆధ్వర్యంలో సోమవారం నిరసన కార్యక్రమం నిర్వహించడమైనది అనంతరం కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు, జిల్లా కలెక్టర్ కార్యాలయంలో వినతి పత్రాన్ని అందజేయడం జరిగినది. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఆర్యవైశ్య మహాసభ అధ్యక్షులు ధారా రమేష్ మాట్లాడుతూ మనమంతా డిమాండ్ చేసినప్పటికీ రాష్ట్ర మంత్రివర్గ సమావేశంలో పేరు మార్పుకు ఆమోదం తెలపడాన్ని మన రాష్ట్రంలో గాక ఇతర రాష్ట్రాలలో ఉన్నా యావత్ ఆర్యవైశ్యులతో పాటు తెలుగు భాషాభిమానులు తీవ్రంగా ఖండిస్తున్నారని ఆయన పేర్కొన్నారు. పొట్టి శ్రీరాములు ఏ ప్రాంతాని కో ఏ రాష్ట్రానికి చెందిన వ్యక్తి కాదని దేశం గర్వించదగ్గ నాయకుడు భాష ప్రయుక్త రాష్ట్రాలకు ఏర్పాటుకు అర్జునుని హరిజనవ తేరినే లక్ష్యంగా స్వీకరించి హరిజనులకు దేవాలయాల ప్రవేశాలకై నిరాహార దీక్ష చేసి సమాజంలో వారి పట్ల ఉన్న వివక్షతను రూపుమాపిటకు తీవ్రంగా కృషి చేశారని ఆయన పేర్కొన్నారు అటువంటి మహనీయుడు జ్ఞాపకార్థం తెలుగు విశ్వవిద్యాలయానికి అటువంటి మహనీయుని పేరును తెలుగు విశ్వవిద్యాలయానికి కొనసాగించాలని ఆయన డిమాండ్ చేశారు సూరవరం ప్రతాపరెడ్డి సేవలు చిరస్మరణీయమని సందేహం లేదు అన్నారు నూతనంగా ఏర్పాటు చేసే ప్రాజెక్టులకు సూరవరం ప్రతాపరెడ్డి పేరు పెట్టి గౌరవించాలని అన్నారు. ఈ విషయాన్ని రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మరొకసారి పునర ఆలోచించాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో ఆర్యవైశ్య మహాసభ కార్యవర్గ సభ్యులు మరియు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా గౌరవ అధ్యక్షులు పెండ్యాల విజయ భాస్కర్ , జిల్లా ప్రధాన కార్యదర్శి ఎలుగూరి నగేష్ కుమార్, కోశాధికారి చీమకుర్తి తాతా శ్రీనివాస్, వర్కింగ్ ప్రెసిడెంట్ ధారా యుగంధర్ ఆర్గనైజింగ్ సెక్రెటరీ పెండ్యాల ప్రసాద్ రావు, కొత్తగూడెం పట్టణ అధ్యక్షులు ధారా నగేష్, సభ్యత్వ నమోదు కమిటీ చైర్మన్, జిల్లా మాజీ ప్రధాన కార్యదర్శి పల్లెర్ల చంద్రశేఖర్, దమ్మపేటమండల అధ్యక్షులు పసుమర్తి రామభద్రం, మండల అధ్యక్షులు ఉడత వెంకటేశ్వర్లు, చుంచుపల్లి మండల అధ్యక్షులు వారణాసి సురేష్, మణుగూరు మండల అధ్యక్షులు చిత్తలూరి రమేష్, లక్ష్మీదేవి పల్లి మండల అధ్యక్షుడు తెల్లాకుల డైమండ్ రావుజిల్లా, సమన్వయకర్త బిక్కుమల్ల సుధాకర్ ,ఉపాధ్యక్షులు: తమ్మిశెట్టి రమేష్, కడివెండి విశ్వనాథ్ గుప్తా, ధారా నరసింహారావు, నరేంద్రుల హేమంత్ ,కంచర్ల రామారావు, పసుమర్తి శ్రీనివాస్, తల్లాడ ఉపేందర్,గునిపాటి సుధాకర్, సహాయ కార్యదర్శి: దాచేపల్లి పిచ్చయ్య, వంకాయల అనంత సాయిప్రసాద్, దారా కిరణ్, కార్యవర్గ సభ్యులు సీమకుర్తి సురేష్, చిత్తలూరి జగన్, వెచ్చా శ్రీరాములు యువజన సంఘం ప్రధాన కార్యదర్శి తల్లాడ సాయికుమార్, కోశాధికారి కొదమూరు భాను ప్రకాష్, సాత్విక్, బసవయ్య, వారణాసి బాబు, గణేష్, కొదుమూరి సురేష్, నరేంద్రుల రిషి, తమ్మిశెట్టి విజయ్, వందనపు వీరభద్రం, డాక్టర్ జి వి రావు, ఓరుగంటి పండు, తదితరులు పాల్గొన్నారు
Admin
తెలుగు వెలుగు టీవీ