తెలుగు వెలుగు టీవీ - వార్తలు / జూలూరుపాడు : భద్రాద్రి కొత్తగూడెం ఫిబ్రవరి 3 తెలుగు వెలుగు)జూలూరుపాడులో జరిగిన మిడ్ డే మిల్స్ మండల మహాసభలో తెలంగాణ మధ్యాహ్న భోజన వర్కర్స్ యూనియన్ రాష్ట్ర కార్యదర్శి సత్తెనపల్లి విజయలక్ష్మి మాట్లాడుతూ మధ్యాహ్న భోజన కార్మికుల పట్ల కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సవతి తల్లి ప్రేమ కనబరుస్తున్నారని, రాష్ట్ర కార్యదర్శి సత్తెనపల్లి విజయలక్ష్మి విమర్శించారు, సోమవారం మండల మహాసభ గడల మంగమ్మ అధ్యక్షతన జరిగింది. ఈ సందర్భంగా మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ ఎన్నికల హామీల మేరకు మధ్యాహ్న భోజన కార్మికులకు నెలకు పదివేలు ఇవ్వాలని, రాష్ట్రవ్యాప్తంగా 54 వేల మధ్యాహ్న భోజన కార్మికుల కు నెలకు 3000 ఇచ్చి శ్రమ దోపిడి చేస్తున్నారని ఈఎస్ఐ, పిఎఫ్ రిటైర్మెంట్ బెనిఫిట్స్ లు కల్పించాలని వంట కార్మికులకు యూనిఫాంలో అందించాలని అన్ని పాఠశాలలకు వంట షెడ్లు నిర్మించి గ్యాస్ మీరు మౌలిక వసతులు కల్పించాలని వంట బిల్లులు కులాల వారీగా ఎస్సీ ఎస్టీ బీసీ జనరల్ పేర్లతో వేరువేరుగా బిల్లులు చెల్లించటం మంచిది కాదని తప్పు పట్టారు పెరిగిన ధరల కు అనుగుణంగా 30 రూపాయలు చెల్లించాలి డిమాండ్ చేశారు ఈ మహాసభలో పాల్వంచ మండల కార్యదర్శి ఎండూరు ప్రభావతి , సుజాతనగర్ మండల కార్యదర్శి వహీదా ముదిగొండ లక్ష్మి కొరివి ఇందిరా సత్యవతి, మంగమ్మ సుశీల, సత్యవతి తదితరులు పాల్గొన్నారు
Admin
తెలుగు వెలుగు టీవీ