Saturday, 18 April 2026 06:09:51 PM
# ఆరోగ్య సూత్రాలు పాటించండి శ్రమదానం చేయండి ఆరోగ్యంగా ఉండండి. Dr తుకారాం రాథోడ్ DMHO # బాల్యవివాహాలను అంతం చేద్దాం - ఆడపిల్లలకు బంగారు భవిష్యత్తును అందిద్దాం. # మానవత్వం చాటుకున్న సుజాతనగర్ ఎస్సై రమాదేవి. # సిపిఐ శాఖ సెక్రటరీ కీసరి రాఘవలు"పార్థివ దేహం" నివాళులు ఆర్పించిన సిపిఐ జిల్లా సెక్రటరీ సాబీర్ పాషా. # చిన్న చిన్న నిర్లక్ష్యాలే పెద్ద ప్రమాదాలకు దారితీస్తాయి.ప్రతి ఒక్కరూ కచ్చితంగా రోడ్డు భద్రతా నియమాలను పాటించాలి: ఎస్పీ రోహిత్ రాజు. # అశ్వరావుపేటలో రెండు 33/11 కేవీ విద్యుత్ ఉపకేంద్రాలకు శంకుస్థాపన. రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క మల్లు. # ఘనంగా అంబేద్కర్ 135వ జయంతి వేడుకలు # సమ్మర్ గేమ్స్ కోచింగ్ క్యాంప్ ప్రారంభించిన ఎమ్మెల్యే జారె. # సింగరేణి హెడ్ ఆఫీస్ వద్ద ఘనంగా రాజ్యాంగ నిర్మాత జయంతి. అంబేద్కర్ చిత్రపటానికి పుష్పాంజలి ఘటించిన ప్రముఖులు. # అంగన్వాడీల అభివృద్దె మా లక్ష్యం.వైరా ఎమ్మెల్యే రాందాస్ నాయక్.అంగన్వాడీ టీచర్లకు స్మార్ట్ ఫోన్ల పంపిణీ.దివ్యాంగులకు సహాయ ఉపకరణాల పంపిణీ. వైరా ఎమ్మెల్యే # జీవితం విలువైనది భద్రత మన బాధ్యత. ర్యాలీ ని ఉద్దేశించి మాట్లాడుతున్న 16 వ డివిజన్ కార్పొరేటర్ మునగడప పద్మ. # అశ్వాపురం ప్రభుత్వ జూనియర్ కళాశాల విద్యార్థిని 973 మార్కులతో ఓంకారిణి టాప్. # ఉపముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క పర్యటన ఏర్పాట్లను పరిశీలించిన ఎమ్మెల్యే జారె. # సెన్సస్ పనులను నిర్ణీత గడువులోపు పూర్తి చేయాలి: జిల్లా కలెక్టర్ జిల్లా కలెక్టర్ అంకిత్. # ఐదు గ్రామపంచాయతీల కోసం సమరభేరి - సోమవారం భద్రాచలంలో భారీ సభ - హాజరుకానున్న రేణుకా చౌదరి. # అంగన్వాడి కేంద్రాల అభివృద్ధికి ప్రభుత్వం కట్టుబడి ఉంది. మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి. # 'ఆరోగ్య వారోత్సవాల సందర్భంగా జిల్లా డ్రగ్స్ కంట్రోల్ అడ్మినిస్ట్రేషన్ ఆధ్వర్యంలో అలవాటుగా మారే మందుల దుర్వినియోగంపై సమగ్ర అవగాహన సదస్సు . # అణగారిన వర్గాలకు అక్షరజ్యోతి ఫూలే. జ్యోతిరావు ఫూలే జీవితం ఎందరికో ఆదర్శం. జేబీపీ స్టేట్ వర్కింగ్ ప్రెసిడెంట్ యెర్రా కామేష్. # యువత మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలి : జిల్లా వైద్యశాఖ అధికారి డా. తుకారాం రాథోడ్. # సాదా బైనమా దరఖాస్తుల పరిష్కారానికి వేగవంతమైన చర్యలు తీసుకోవాలి: జిల్లా కలెక్టర్ అంకిత్ .

కొత్తగూడెం ఏరియా టీబీజీకేఎస్ సమావేశంలో మాట్లాడిన కాపు కృష్ణ

Date : 17 September 2025 08:55 PM Views : 512

తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : గత సంవత్సరం లాగానే లెక్కలు, తారుమారు చేస్తూ అంకల గారడితో లాభాలను తక్కువ చూపెట్టే ప్రయత్నం. తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘం నాయకులు కొత్తగూడెం ఏరియా రామవరం టీబీజీకేఎస్ ఆఫీసులో జరిగిన కార్యకర్తల సమావేశంలో మాట్లాడిన తెలంగాణ సంఘం ముఖ్య ప్రధాన కార్యదర్శి కాపుకృష్ణ మాట్లాడుతూ గత సంవత్సరం లాగానే లెక్కలు తారుమారు చేస్తూ అంకల గారడితో లాభాలను 4701కోట్లలో 33% ఇస్తామని ప్రకటన చేస్తూ2289 కోట్లను పక్కనపెట్టి 2412కోట్లను మాత్రమే పచ్చడం జరిగింది. 2412 కోట్లలో 33%పంచాగా 67%మరల సింగరేణి సంస్థ డెవలప్ మెంట్ కొరకే పక్కన పెట్టారు. ఈ లెక్కన చుస్తే 16.9%మాత్రమే పంచారు. గత 12సంవత్సరాలనుండి టీబీజీకేఎస్ రికేజీనైజ్ యూనియన్ ఉన్నప్పుడు 16%నుండి 32%వరకు నికర లాభం లో పంచడం జరిగింది. కానీ ఇప్పుడు తక్కువ చూపెట్టే ప్రయత్నం చేస్తున్నారు. యాజమాన్యం. ప్రభుత్వ పెద్దలు చెప్పినట్లుగా యాజమాన్యం నడుచుకోవడం జరుగుతుందన్నారు. అందుకనే గత సంవత్సరం యొక్క ఆడిట్ షీట్ను ఇప్పటివరకు విడుదల చేయలేదని తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘం(టిబిజికెఎస్ ) నాయకులు ఆరోపించారు. ఈ సంఘం సమావేశం లో మాట్లాడుతూ, 2024-25 ఆర్థిక సంవత్సరం ముగిసి ఆరు నెలలు కావస్తున్న సింగరేణి యాజమాన్యం ఇప్పటివరకు ఆర్థిక సంవత్సరానికి వచ్చిన వాస్తవ లాభాలను తెలియపరచకపోవడం దుర్మార్గమని, గతoలో బోర్డ్ ఆఫ్ డైరెక్టర్ మీటింగ్ జరిగినప్పటికీ వాస్తవ లాభాలను తెలియపరచక పోవడం పలు అనుమానాలతో పాటు భారీ ఎత్తున కుట్ర జరుగుతుందని భావించవచ్చన్నారు. వాస్తవానికి ప్రభుత్వ రంగ సంస్థలు పబ్లిక్ సెక్టార్లు క్రిందకు వచ్చే పరిశ్రమలు,ప్రభుత్వ నిబంధనలు ప్రకారం ఆర్థిక సంవత్సరంలో ప్రతి మూడు నెలలకు ఒకసారి ఆ పరిశ్రమ ఉత్పత్తి, ఉత్పాదకత ల లాభ నష్టాలను తెలియపరచాల్సి ఉంటుందని, కానీ సింగరేణిలో విచిత్రం ఏమిటంటే ఆరు నెలలు గడిచిన వాస్తవాలను ప్రకటించకపోవడం వింత ప్రక్రియగా మిగిలిపోయిందన్నారు. ఈ ఆర్థిక సంవత్సరానికి వచ్చిన నికర లాభాలను ప్రకటించకుండానే సిఎస్ఆర్ డిఎంఎఫ్టి, నిధులను యాజమాన్యంరాష్ట్ర ప్రభుత్వానికి అనుకూలంగా నిబంధనలు పక్కన పెట్టి ప్రకటిస్తున్నదన్నారు. రెండు రోజులు క్రితంతెలంగాణ రాష్ట్రంలో 33 జిల్లాల గాను *146.70 కోట్ల రూపాయలను సింగరేణి యాజమాన్యం, రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిందని, అంతేకాకుండాసిఎస్ఆర్ నిధుల కింద సింగరేణికి సంబంధంలేని సివిల్ ప్రిపేర్ అభ్యర్థులకు, స్కిల్ డెవలప్మెంట్ శిక్షణకు కోట్లాది రూపాయలను నిబంధనలు విరుద్ధంగా ప్రకటించడం జరిగినదని, ఈ గణాంకాలను పరిశీలిస్తే ఈ ఆర్థిక సంవత్సరానికి (2024-25) సుమారుగాఅక్షరాల 6400 కోట్ల రూపాయలు లాభాలు వచ్చినట్టుగా తెలుస్తుంది కావున యాజమాన్యం వెంటనే ఈ వాస్తవ లాభాలు 6400 కోట్ల రూపాయలను ప్రకటించి నికర లాభాల నుంచి ఎటువంటి కటింగ్ లేకుండా 35 శాతం లాభాల వాటను వెంటనే ప్రకటించి సత్వరమేఉద్యోగులకు అందజేయాలని అలాగే దసరా సెలవు అక్టోబర్ రెండో తారీకు నుంఛి మూడో తారీకు కు మార్చాలని ప్రతి నెల మెడికల్ బోర్డు నిర్వహించాలని తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘం రాష్ట్రం యొక్క ప్రధాన కార్యదర్శి కాపుకృష్ణ డిమాండ్ చేశారు. లేనియెడల త్వరలోనే ఈనెల 22న హైదరాబాద్ నగరంలోని సింగరేణి భవన్ ను ముట్టడిస్తామని అప్పటికి ప్రకటన చేయకపోతే గౌరవ న్యాయ స్థానాలను ఆశ్రయించైనా సరే కార్మికులకున్యాయం జరిగే వరకు పోరాడుతామన్నారు,ఈ కార్యక్రమంలో రాష్ట్ర ముఖ్య ప్రధాన కార్యదర్శి కాపుకృష్ణ కొత్తగూడెంఏరియా ఉపాధ్యక్షులు గడప రాజయ్య,, నాయకులు వసి కర్ల కిరణ్, మురళి, బోరింగ్ శంకర్, ఈశ్వర్,అరుణ్ అశోక్, కుమార్, వెంకటేష్, సూరజ్, సూర్యనారాయణ, శ్రీనివాస్, అనుదీప్, రాజేష్, శ్రీకాంత్ ఇబ్రహీం, తదితరులు పాల్గొన్నారు.

telugu velugu

Admin

తెలుగు వెలుగు టీవీ

మరిన్ని వార్తలు

Copyright © Telugu Velugu TV 2026. All right Reserved.



Developed By :