తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : కొత్తగూడెం మున్సిపల్ కార్పొరేషన్ గా ఏర్పడిన సందర్భంగా తొలి అడుగు కొత్తగూడెం పోస్ట్ ఆఫీస్ సెంటర్ నుంచి హేమచంద్రపురం మీదుగా ఇల్లందు వెళ్లనున్న బైపాస్ రోడ్డుని సెంట్రల్ లైటింగ్ తో ఫోర్ లైన్ రోడ్డుగా ప్రతిపాదిస్తూ కొత్తగూడెం నియోజకవర్గ శాసనసభ్యులు కూనంనేని సాంబశివరావు సింగరేణి ద్వారా సీఎస్ఆర్ ఫండ్స్ కేటాయించాలని విజ్ఞప్తి చేశారు. ఎంతోకాలంగా కొత్తగూడెం నుంచి హేమచంద్రపురం వెళ్లే మార్గం రోడ్లు అద్వానంగా మారి ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఈ నేపథ్యంలో గతంలో ఈ బైపాస్ రోడ్డుపై ప్రచూరితమైన ఎన్నో వార్తా కథనాలకు కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు స్పందిస్తూ నూతన రోడ్డు నిర్మాణానికి నిధులు కేటాయించాలని సింగరేణి సంస్థ సీఎండీ బలరాం నాయక్ కి లేఖను రాశారు. ఈ క్రమంలోనే ఇటీవల కొత్తగూడెం కార్పొరేషన్ గా అప్గ్రేడ్ అవడంతో అభివృద్ధి పనులను వేగవంతం చేసే దిశగా ఎమ్మెల్యే సాంబశివరావు పావులు కదుపుతున్నారు. ఇందులో భాగంగానే తొలిమెట్టు కొత్తగూడెం నుంచి హేమచంద్రపురం మీదుగా ఇల్లందు వెళ్లే బైపాస్ రోడ్డు వైపు పడింది. ఈ బైపాస్ రోడ్డుని సెంట్రల్ డివైడర్స్, లైటింగ్ తో ఫోర్ లైన్ రోడ్డుగా ప్రతిపాదిస్తూ సింగరేణి సంస్థ నుంచి 10 కోట్ల రూపాయలు సీఎస్ఆర్ నిధులు కేటాయించాలని విజ్ఞప్తి చేస్తూ ఎమ్మెల్యే సాంబశివరావు లేఖను రాశారు. త్వరలోనే ఈ బైపాస్ రోడ్డు అత్యద్భుతంగా రూపు దాల్చి నగరాన్ని సుందరంగా తీర్చిదిద్దుతుందని కొత్తగూడెం ప్రజలు ఆశిస్తున్నారు.
Admin
తెలుగు వెలుగు టీవీ