తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : రేపటినుండి ప్రారంభమయ్యే పదవ తరగతి పబ్లిక్ పరీక్షలను దృష్టిలో ఉంచుకుని జిల్లాలో అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు జిల్లా కలెక్టర్ అంకిత్ తెలిపారు. పరీక్షలు ప్రశాంతమైన వాతావరణంలో సజావుగా నిర్వహించేందుకు సంబంధిత శాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాలని ఆయన సూచించారు.పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులందరికీ కలెక్టర్ శుభాకాంక్షలు తెలియజేస్తూ, ఎలాంటి ఆందోళనకు గురికాకుండా ధైర్యంగా పరీక్షలను రాయాలని కోరారు. విద్యార్థులు పరీక్షా కేంద్రాలకు నిర్ణీత సమయానికి ముందుగానే చేరుకుని, నిబంధనలు పాటిస్తూ పరీక్షలు రాయాలని సూచించారు.పరీక్షా కేంద్రాల వద్ద అవసరమైన మౌలిక సదుపాయాలు, తాగునీరు, విద్యుత్ తదితర సౌకర్యాలను కల్పించినట్లు తెలిపారు. పరీక్షలు ఎటువంటి అంతరాయం లేకుండా సజావుగా నిర్వహించేందుకు అన్ని శాఖలు అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్ ఆదేశించారు.
Admin
తెలుగు వెలుగు టీవీ