తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : అర్జీల పరిష్కారంలో నిర్లక్ష్యం వహిస్తే సహించేదిలేదు. ప్రభుత్వ యంత్రాంగాన్ని ప్రజలకు చేరువచేసేందుకే ''ముఖాముఖి' కార్యక్రమం ప్రజా వినదులు సమస్యల పరిష్కారానికి స్పెషల్ డ్రైవ్ చేపడతాం. అర్హులైన ప్రతి ఒక్కరికీ సంక్షేమ ఫలాలు అందుతాయి. కొత్తగూడెం శాసనసభ సభ్యులు కూనంనేని సాంబశివరావు. ప్రజలతో ఎమ్మెల్యే ముఖాముఖి కార్యక్రమానికి అపూర్వ స్పందన. ప్రజా సమస్యల సత్వర పరిస్కారంకోసమే 'ముఖాముఖి' కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని, సమస్యలను నేరుగా తెలుసుకోవడంతోపాటు అధికార యంత్రాంగాన్ని, స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులను ప్రజలకు చేరువ చేసేందుకు ఈ కార్యక్రమం దోహదపడుతుందని కొత్తగూడెం శాసనసభ సభ్యులు కూనంనేని సాంబశివరావు అన్నారు. 'మనకోసం..మన ఎమ్మెల్యే' కార్యక్రమంలో భాగంగా గురువారం పాల్వంచ మున్సిపల్ కార్యాలయం సమావేశ మందిరంలో 'ప్రజలతో ముఖాముఖీ' కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ప్రజలనుంచి అనూహ్య స్పందన లభించింది. వివిధ శాఖల అధికారులు, వివిధ ప్రాంతాలలోని లబ్ధిదారులు, ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొని తమ సమస్యలను ఎమ్మెల్యేకు వివరించారు. అక్కడే ఉన్న అధికారులను వాటిని తక్షణమే పరిష్కరించాలని ఎమ్మెల్యే సూచించారు. పలురకాల వినతులు స్వీకరించి పరిష్కారానికి హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... అధికారులను ప్రజలచెంతకు చేర్చెడుకే తాము ''ముఖాముఖి' కార్యక్రమం చేపట్టామని తెలిపారు. దీని ద్వారా ప్రజాసమస్యలు నేరుగా తెలుసుకునే అవకాశం ఉంటుందని అన్నారు. ప్రజల నుంచి వచ్చిన వినతులపై అధికారులు ప్రత్యేక శ్రద్ధ వహించి, వాటి పరిష్కారానికి చిత్తశుద్ధితో కృషి చేయాలని ఆదేశించారు. అర్జీల పరిష్కారంలో నిర్లక్ష్యం వహిస్తే సహించేదిలేదని అధికారులను హెచ్చరించారు. మౌలిక వసతుల కల్పనతోనే బస్తీలు, గ్రామాలు సమగ్ర అభివృద్ధి చెందుతాయని, ఆ దిశగా నియోజకవర్గ వ్యాప్తంగా మౌలిక సదుపాయాల కొరత లేకుండా చూసేందుకు నిరంతరం పర్యవేక్షిస్తామని భరోసా ఇచ్చారు. అర్హులైన ప్రతి ఒక్కరికీ సంక్షేమ ఫలాలు అందుతాయని, ప్రభుత్వ పథకాలు క్షేత్రస్థాయిలో నిజమైన లబ్ధిదారులకు చేరినప్పుడే ఆశించిన ఆశయాలు నెరవేరుతాయని వివరించారు. ప్రజా సమస్యల శాశ్వత పరిష్కారానికి అధికారులు, ప్రజాప్రతినిధులు సమన్వయంతో పనిచేయాలని ఆయన పిలుపునిచ్చారు. ప్రజా దర్బార్ తరహాలో నిర్వహించే ఇలాంటి కార్యక్రమాలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. కార్యక్రమంలో సిపిఐ జిల్లా కార్యదర్శి ఎస్ కె సాబీర్ పాషా, కొత్తగూడెం కార్పొరేషన్ మేయర్ మూడ్ గణేష్, సీపీఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ముత్యాల విశ్వనాథం, డిప్యూటీ మేయర్ లలిత కుమారి, సీపీఐ జిల్లా కార్యవర్గ సభ్యులు అడుసుమిల్లి సాయిబాబా వీసంశెట్టి పూర్ణచంద్రరావు ఉప్పుశెట్టి రాహుల్, తహసిల్దార్ దారా ప్రసాద్, ఇంచార్జీ కమిషనర్ విజయానంద్ ఎలక్ట్రికల్ Ade అబ్దుల్ రెహమాన్, టౌన్ ఎస్సై తోట నాగరాజు, అబ్కారీ సీఐ ప్రసాద్, ఎంపిడిఓ, ఫారెస్ట్ ఆఫీసర్, కార్పొరేటర్లు వీసంశెట్టి విశ్వేశ్వరరావు గుర్రం వెంకటేశ్వర్లు నామ కీర్తి గొర్లె అన్నపూర్ణ, చెరుకు భాగ్యలక్ష్మి, దున్నపోతుల మణి, వీ భవిత, దంతబోయిన నరేష్, నాయకులు వీ పద్మజ, డి సుధాకర్, అన్నారపు వెంకటేశ్వర్లు, నిమ్మల రాంబాబు, శెనగారపు శ్రీనివాసరావు, SA రెహమాన్, ys గిరి, గౌస్ పాషా, మస్తాన్, అహ్మద్ జానీ, కరీం, గొర్లె నరేష్, నామ పండు, ఆలపాటి ప్రసాద్, అల్లి వెంకటేశ్వర్లు వివిధ శాఖల డి ఈ లు ఏఈలు, అధికారులు తదితరులు పాల్గొన్నారు.
Admin
తెలుగు వెలుగు టీవీ