తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : జూలూరుపాడు మండలంలో బోజాతండా పంచాయతీ పరిషత్ ప్రాంతాల్లో వెనుక తండా పాపకొల్లు రైతుల పంట పొలాలు సుమారుగా 100 నుండి 150 ఎకరాలు నిన్న వచ్చినా అకాల వర్షానికి అపార నష్టం వాటిల్లింది చేతికి వచ్చిన పత్తి పంట వరద ముంచేసింది.పత్తి పంట చేతికి వచ్చే సమయానికి రైతులు సుమారుగా ఎకరానికి పత్తి కి 50 నుండి 60,000 పెట్టుబడి పెట్టి పంట చేతికొచ్చే సమయానికి వర్షానికి కొట్టక పోయి రైతుల్ని తీవ్రంగా నష్టపరిచింది ఈ పంటలను గ్రామ రైతులతో కలిసి సిపిఎం పార్టీ మండల కార్యదర్శి యాసా నరేష్ పరిశీలించి నష్టపోయిన రైతుల్ని ఆదుకోవాలని తక్షణమే అధికారులు పంట నష్టాన్ని అంచనా వేయాలని ప్రభుత్వం నష్టపరిహారం అందించాలని ఆయన డిమాండ్ చేశారు ఈ సందర్భంగా రైతులు మాట్లాడుతూ గతంలో ఎప్పుడు 30 సంవత్సరాల కాలం నుండి ఇంతవరకు ఈ వరదలు ఎప్పుడు రాలేదని ఈ వర్షం రైతుల జీవితాల్లో విషాదాన్ని మిగిల్చిందని అయినా అన్నారు పెట్టిన పెట్టుబడి చేతికొచ్చే సమయానికి వర్షం వచ్చి మొత్తం పంటను కొట్టుకుపోయిందని అలాగే చేలలోనే ఉన్నటువంటి తైవాన్ పంపులు మందు కట్టలు మోటర్లు పైపులు కొట్టుకుపోయాయని ఈ వరదకు రైతుల బరి గుడ్లు రెండు చనిపోయాయని ఆయన అన్నారు కావున నియోజకవర్గ ఎమ్మెల్యే కొట్టుకుపోయిన పంటలను పరిశీలించాలని ప్రభుత్వం నుండి రైతులకు నష్టపరిహారం అందించేలా కృషి చేయాలని ఆయన డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో రైతులు ధర్మసత్ రాంబాబు ధర్మ మాలోత్ స్వామి జాటోత్ బాలు ధర్మసత్ వెంకట్రావు పంటలు కొట్టుకుపోయిన రైతులు పాల్గొన్నారు
Admin
తెలుగు వెలుగు టీవీ