తెలుగు వెలుగు టీవీ - వార్తలు / జూలూరుపాడు : జూలూరుపాడు మండలం సాయిరాం తండా కు చెందిన రత్నకుమార్, పార్వతి దంపతులు కొత్తగూడెంలో ఉంటూ షాపింగ్ మాల్ లో పనిచేస్తున్నారు. షాపింగ్ మాల్ లో పరిచయమైన వ్యక్తి ద్వారా సింగరేణి జాబ్ ఇప్పిస్తామంటూ వీరి దగ్గర నుండి 16 లక్షల రూపాయలను తీసుకున్న ఓ ప్రబుద్ధుడు కనపడకుండా పోయాడు. కొంతకాలంగా పరిచయం చేసిన వ్యక్తి కూడా కనబడలేదు మోసపోయామని గ్రహించిన దంపతులు సోమవారం రోజున గడ్డి మందు తాగి ఆత్మహత్య కి పాల్పడ్డారు. తెలుసుకున్న బంధువులు మిత్రులు కొత్తగూడెంలోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చేర్పించగా అక్కడినుండి ఖమ్మం తర్వాత హైదరాబాద్ తీసుకెళ్లినప్పటికీ ప్రాణాలు దక్కలేదు. ఈ సంఘటనతో సాయిరాం తండాలో విషాదం అలుముకుంది
Admin
తెలుగు వెలుగు టీవీ