Sunday, 19 April 2026 01:56:18 PM
# గిరిజన ప్రాంతాలకు వైద్య సేవల్లో నూతన దిశగా ప్రభుత్వం కీలక ముందడుగు. # భద్రాచలం ఏఎస్పీ విక్రాంత్ కుమార్ సింగ్ ఆధ్వర్యంలో.. జిల్లా పోలీస్ హెడ్ క్వార్టర్స్ నందు Prosecution Review Committee (PRC) సమావేశం నిర్వహించబడింది. # చండ్రుగొండలో మూతపడ్డ పెట్రోల్ బంకులు. # పాలిసెట్ ప్రవేశ పరీక్షకు ఉచిత శిక్షణా తరగతులు – రుద్రంపూర్ ప్రభుత్వ పాలిటెక్నిక్. # ప్రతి ఒక్కరూ ట్రాఫిక్ నియమాలను పాటిస్తూ రోడ్డు ప్రమాదాలను నియంత్రించడంలో బాధ్యతగా వ్యవహరించాలి : డిఎస్పీ ఆదినారాయణ. # 6 నెలలుగా డాక్టర్ లేని ప్రభుత్వ హోమియో వైద్యశాల. # ఆరోగ్య సూత్రాలు పాటించండి శ్రమదానం చేయండి ఆరోగ్యంగా ఉండండి. Dr తుకారాం రాథోడ్ DMHO # బాల్యవివాహాలను అంతం చేద్దాం - ఆడపిల్లలకు బంగారు భవిష్యత్తును అందిద్దాం. # మానవత్వం చాటుకున్న సుజాతనగర్ ఎస్సై రమాదేవి. # సిపిఐ శాఖ సెక్రటరీ కీసరి రాఘవలు"పార్థివ దేహం" నివాళులు ఆర్పించిన సిపిఐ జిల్లా సెక్రటరీ సాబీర్ పాషా. # చిన్న చిన్న నిర్లక్ష్యాలే పెద్ద ప్రమాదాలకు దారితీస్తాయి.ప్రతి ఒక్కరూ కచ్చితంగా రోడ్డు భద్రతా నియమాలను పాటించాలి: ఎస్పీ రోహిత్ రాజు. # అశ్వరావుపేటలో రెండు 33/11 కేవీ విద్యుత్ ఉపకేంద్రాలకు శంకుస్థాపన. రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క మల్లు. # ఘనంగా అంబేద్కర్ 135వ జయంతి వేడుకలు # సమ్మర్ గేమ్స్ కోచింగ్ క్యాంప్ ప్రారంభించిన ఎమ్మెల్యే జారె. # సింగరేణి హెడ్ ఆఫీస్ వద్ద ఘనంగా రాజ్యాంగ నిర్మాత జయంతి. అంబేద్కర్ చిత్రపటానికి పుష్పాంజలి ఘటించిన ప్రముఖులు. # అంగన్వాడీల అభివృద్దె మా లక్ష్యం.వైరా ఎమ్మెల్యే రాందాస్ నాయక్.అంగన్వాడీ టీచర్లకు స్మార్ట్ ఫోన్ల పంపిణీ.దివ్యాంగులకు సహాయ ఉపకరణాల పంపిణీ. వైరా ఎమ్మెల్యే # జీవితం విలువైనది భద్రత మన బాధ్యత. ర్యాలీ ని ఉద్దేశించి మాట్లాడుతున్న 16 వ డివిజన్ కార్పొరేటర్ మునగడప పద్మ. # అశ్వాపురం ప్రభుత్వ జూనియర్ కళాశాల విద్యార్థిని 973 మార్కులతో ఓంకారిణి టాప్. # ఉపముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క పర్యటన ఏర్పాట్లను పరిశీలించిన ఎమ్మెల్యే జారె. # సెన్సస్ పనులను నిర్ణీత గడువులోపు పూర్తి చేయాలి: జిల్లా కలెక్టర్ జిల్లా కలెక్టర్ అంకిత్.

ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణంలో నాణ్యత ప్రమాణాలు పాటించాలి..*ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణంలో మేస్త్రీలదే కీలక పాత్ర..

Date : 03 March 2025 06:51 PM Views : 1026

తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : కొత్తగూడెం ప్రగతి మైదానంలో జరిగిన కార్యక్రమంలో ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణంలో నాణ్యత ప్రమాణాలు పాటించాలని, ఇండ్ల నిర్మాణంలో మేస్త్రీలదే కీలక పాత్ర అని జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ అన్నారు. సోమవారం నేషనల్ నేషనల్ అకాడమీ ఆఫ్ కన్స్ట్రక్షన్స్ ( న్యాక్ ) వారి ఆధ్వర్యంలో నిర్వహించిన ఇందిరమ్మ ఇండ్ల మేస్త్రీల శిక్షణా కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ..ఇళ్ల నిర్మాణంలో నాణ్యత, గట్టితనం ఉండేలా, వ్యయాన్ని తగ్గించేలా, ఇంటి నిర్మాణ సామగ్రి వృథా కాకుండా సద్వినియోగం చేసుకోవడం వంటి అంశాలపై మేస్త్రీలకు శిక్షణ ఇస్తున్నారని అన్నారు.పేదలకు తక్కువ ఖర్చుతో పటిష్ఠంగా, పూర్తి భద్రతతో ఇండ్లు ఎలా నిర్మించాలని అన్నారు. ప్రభుత్వ మార్గదర్శకాల ప్రకారం ప్రతి ఇంటిని 400 చదరపు అడుగుల లోపు నిర్మించాలని సూచించారు.ప్రభుత్వం అందజేసే రూ.5లక్షలతో క్వాలిటీతో ఇంటి నిర్మాణం పూర్తి చేయాలని ఆయన ఆదేశించారు. ఈ ఇందిరమ్మ ఇండ్ల పథకం లో భాగంగా నాలుగు దశల్లో నిధులు మంజూరు చేయడం జరుగుతుందని ఆయన తెలిపారు. మొదటి విడతగా బేస్మెంట్ పూర్తి అయిన తర్వాత లక్ష రూపాయలు, రెండవ విడతగా గోడల నిర్మాణం పూర్తి అయిన తర్వాత లక్ష 25 వేల రూపాయలు, మూడవ విడత స్లాబ్ పూర్తయిన తర్వాత లక్ష 75 వేల రూపాయలు మరియు నాల్గవ విడతగా ఇంటి నిర్మాణం పూర్తి అయిన తరువాత లక్ష రూపాయలు మంజూరు చేయడం జరుగుతుందని కలెక్టర్ తెలిపారు.పేదలకు నిర్మించే ఇండ్లను నాణ్యంగా మరియు దృఢంగా నిర్మించాలన్నారు. ఆరు రోజుల శిక్షణా కార్యక్రమంలో భాగంగా మేస్త్రీలకు టీ షర్ట్ లు, హెల్మెట్, బ్యాగు పంపిణీ చేశారు. శిక్షణ కార్యక్రమంలో 30 మంది మేస్త్రీల కు శిక్షణ ఇవ్వనున్నారు. ఈ కార్యక్రమంలో హౌసింగ్ పిడి శంకర్, మెప్మా పి డి రాజేష్, మ్యాక్ అధికారిని హెప్సిబా , ఇన్స్పెక్టర్ కరుణాకర్ మరియు సంబంధిత అధికారులు పాల్గొన్నారు.

telugu velugu

Admin

తెలుగు వెలుగు టీవీ

మరిన్ని వార్తలు

Copyright © Telugu Velugu TV 2026. All right Reserved.



Developed By :