తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : జూలూరుపాడు స్టేషన్ పరిధిలో వాహన తనిఖీలలో నాలుగు కోట్ల పదిహేను లక్షల రూపాయల విలువ చేసే నిషేదిత గంజాయిని స్వాదీనం చేసుకున్న జూలూరుపాడు పోలీసులు. మంగళవారం సాయంత్రం 6.10 గంటలకు విశ్వసనీయ సమాచారం మేరకు జులూరుపాడు. పోలీసులు మరియు సి సి ఎస్ పోలీసులు సంయుక్తంగా పోలీస్ స్టేషన్ పరిధిలోని పడమట నర్సాపురం గ్రామ పంచాయతి ఆఫీస్ వద్ద నిర్వహించిన వాహన తనిఖీలలో HR 55AH7375 అను నంబరు గల ఐచర్ వ్యాస్ ను ఆపి తనిఖీ చేయగా 830.540 (ఎనిమిది క్వింటాల ముప్పై కిలోల ఐదు వందల నలభై గ్రాములు) ప్రభుత్వ నిషేదిత గంజాయిని గుర్తించడం జరిగింది. సుమారుగా 4,15,27,000/- రూపాయల విలువ గల ఇట్టి గంజాయిని విలీసులు స్వాదీనం చేసుకోవడమైనది. ఐచర్ వ్యానులో ఉన్న ఇద్దరు వ్యక్తులను అదుపులోకి తీసుకొని విచారించగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అల్లూరి సీతారామరాజు జిల్లా మోతుగూడెం పోలీస్ స్టేషన్ పరిధిలో తులసిపాక గ్రామం నుండి అట్టి నిషేదిత గంజాయిని లోడ్ చేసుకొని భద్రాచలం, కొత్తగూడెం, ఖమ్మం, హైదరాబాద్ మీదుగా ఢిల్లీకి తరలిస్తున్నట్లు విదారణలో తేలింది. ఇట్టి నిషేధిత గంజాయిని అమ్మిన వ్యక్తులపైన, కొనుగోలు చేసిన వ్యక్తులు మరియు రవాణా చేస్తున్న వ్యక్తులందరిపై కేసు నమోదు చేసే అట్టి రవాణాకు ఉపయోగించిన ఐచర్ వాహనము ను మరియు రెండు మొబైల్ పోస్టేను కూడా సీజ్ చేయడం జరిగినది. ప్రభుత్వ నిషేధత గంజాయి అక్రమ రవాణాను జిల్లా పోలీసులు సమర్ధవంతంగా అడ్డుకోవడం జరుగుతుంది. 2024 సంవత్సరంలో 112 కేసులలో 8078 కేజీలు, 2025 సంవత్సరంలో ఇప్పటివరకు 3002 కిలోల నిషేదిత గంజాయిని స్వాధీనం చేసుకోవడం జరిగింది. పట్టుబడిన ఇద్దరు వ్యక్తులను జ్యుడిషియల్ రిమాండ్ నిమిత్తం కోర్జునకు తరలించడం జరిగినది. నిందిత గంజాయి అక్రమ రవాణాను సమర్ధవంతంగా అడ్డుకుని నిందితులను చాఖ చక్యంగా పట్టుకున్న జూలూరుపాడు సిఐ ఇంద్రన్ నారెడ్డి, ఎస్సై రవి, సిసిఎస్ ఇన్స్పెక్టర్ రమాకాంత్,ఎస్సైలు ప్రవీణ్, మరియు సిబ్బందిని ఎస్పీ రోహిత్ రాజు ఐపిఎస్ ప్రత్యేకంగా అభినందించారు. ఎస్పీ రోహిత్ రాజ్ మీడియా ద్వారా మాట్లాడుతూ నిషేధిత అక్రమ గంజాయి రవాణా ద్వారా సంపాదించిన ఆస్తులను సైతం ప్రభుత్వం జప్తు చేసుకుంటుందని మునుముందు మత్తు పదార్థాల రవాణా మరియు అమ్మకం కొనుగోలు జరిపినటువంటి వారిని సహించబోమని హెచ్చరించారు
Admin
తెలుగు వెలుగు టీవీ