Sunday, 19 April 2026 03:23:40 PM
# గిరిజన ప్రాంతాలకు వైద్య సేవల్లో నూతన దిశగా ప్రభుత్వం కీలక ముందడుగు. # భద్రాచలం ఏఎస్పీ విక్రాంత్ కుమార్ సింగ్ ఆధ్వర్యంలో.. జిల్లా పోలీస్ హెడ్ క్వార్టర్స్ నందు Prosecution Review Committee (PRC) సమావేశం నిర్వహించబడింది. # చండ్రుగొండలో మూతపడ్డ పెట్రోల్ బంకులు. # పాలిసెట్ ప్రవేశ పరీక్షకు ఉచిత శిక్షణా తరగతులు – రుద్రంపూర్ ప్రభుత్వ పాలిటెక్నిక్. # ప్రతి ఒక్కరూ ట్రాఫిక్ నియమాలను పాటిస్తూ రోడ్డు ప్రమాదాలను నియంత్రించడంలో బాధ్యతగా వ్యవహరించాలి : డిఎస్పీ ఆదినారాయణ. # 6 నెలలుగా డాక్టర్ లేని ప్రభుత్వ హోమియో వైద్యశాల. # ఆరోగ్య సూత్రాలు పాటించండి శ్రమదానం చేయండి ఆరోగ్యంగా ఉండండి. Dr తుకారాం రాథోడ్ DMHO # బాల్యవివాహాలను అంతం చేద్దాం - ఆడపిల్లలకు బంగారు భవిష్యత్తును అందిద్దాం. # మానవత్వం చాటుకున్న సుజాతనగర్ ఎస్సై రమాదేవి. # సిపిఐ శాఖ సెక్రటరీ కీసరి రాఘవలు"పార్థివ దేహం" నివాళులు ఆర్పించిన సిపిఐ జిల్లా సెక్రటరీ సాబీర్ పాషా. # చిన్న చిన్న నిర్లక్ష్యాలే పెద్ద ప్రమాదాలకు దారితీస్తాయి.ప్రతి ఒక్కరూ కచ్చితంగా రోడ్డు భద్రతా నియమాలను పాటించాలి: ఎస్పీ రోహిత్ రాజు. # అశ్వరావుపేటలో రెండు 33/11 కేవీ విద్యుత్ ఉపకేంద్రాలకు శంకుస్థాపన. రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క మల్లు. # ఘనంగా అంబేద్కర్ 135వ జయంతి వేడుకలు # సమ్మర్ గేమ్స్ కోచింగ్ క్యాంప్ ప్రారంభించిన ఎమ్మెల్యే జారె. # సింగరేణి హెడ్ ఆఫీస్ వద్ద ఘనంగా రాజ్యాంగ నిర్మాత జయంతి. అంబేద్కర్ చిత్రపటానికి పుష్పాంజలి ఘటించిన ప్రముఖులు. # అంగన్వాడీల అభివృద్దె మా లక్ష్యం.వైరా ఎమ్మెల్యే రాందాస్ నాయక్.అంగన్వాడీ టీచర్లకు స్మార్ట్ ఫోన్ల పంపిణీ.దివ్యాంగులకు సహాయ ఉపకరణాల పంపిణీ. వైరా ఎమ్మెల్యే # జీవితం విలువైనది భద్రత మన బాధ్యత. ర్యాలీ ని ఉద్దేశించి మాట్లాడుతున్న 16 వ డివిజన్ కార్పొరేటర్ మునగడప పద్మ. # అశ్వాపురం ప్రభుత్వ జూనియర్ కళాశాల విద్యార్థిని 973 మార్కులతో ఓంకారిణి టాప్. # ఉపముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క పర్యటన ఏర్పాట్లను పరిశీలించిన ఎమ్మెల్యే జారె. # సెన్సస్ పనులను నిర్ణీత గడువులోపు పూర్తి చేయాలి: జిల్లా కలెక్టర్ జిల్లా కలెక్టర్ అంకిత్.

మున్సిపల్ ఎన్నికల విధుల్లో ఉన్న సిబ్బందికి పోస్టల్ బ్యాలెట్ సదుపాయం. జిల్లా కలెక్టర్ జితేష్ వి. పాటిల్.

Date : 06 February 2026 06:50 PM Views : 101

తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : 07, 08 తేదీల్లో ఫెసిలిటేషన్ సెంటర్లలో ఓటు హక్కు వినియోగం : జిల్లా కలెక్టర్ జితేష్ వి. పాటిల్. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో అశ్వారావుపేట, ఇల్లందు మరియు కొత్తగూడెం మున్సిపాలిటీల పరిధిలో నిర్వహించనున్న మున్సిపల్ ఎన్నికల సందర్భంగా, ఎన్నికల విధుల్లో నియమితులైన అధికారులు, ఉద్యోగులు, పోలింగ్ సిబ్బంది మరియు సహాయక సిబ్బందికి పోస్టల్ బ్యాలెట్ ద్వారా ఓటు హక్కు వినియోగించుకునే సదుపాయం కల్పిస్తున్నట్లు జిల్లా ఎన్నికల అధికారి మరియు జిల్లా కలెక్టర్ జితేష్ వి. పాటిల్ తెలిపారు. ఎన్నికల విధుల్లో ఉండటం వలన పోలింగ్ రోజున తమ స్వంత పోలింగ్ స్టేషన్‌లో ఓటు వేయలేని సిబ్బంది ప్రజాస్వామ్య హక్కును కోల్పోకుండా ఉండేందుకు, Conduct of Elections Rules, 1961 లోని రూల్ 27A, రూల్ 28 మరియు Representation of the People Act, 1951 లోని సెక్షన్ 60 ప్రకారం ఈ పోస్టల్ బ్యాలెట్ సదుపాయం కల్పిస్తున్నట్లు ఆయన వివరించారు.ఈ మేరకు అశ్వారావుపేట, ఇల్లందు మరియు కొత్తగూడెం మున్సిపాలిటీలలో పోస్టల్ బ్యాలెట్ ఫెసిలిటేషన్ సెంటర్లు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. కొత్తగూడెం మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో ఓటు హక్కు కలిగిన ఎన్నికల సిబ్బంది కొత్తగూడెం మరియు పాల్వంచ మున్సిపాలిటీ కార్యాలయాలలో, ఇల్లందు మున్సిపాలిటీ పరిధిలోని ఓటర్లు ఇల్లందు మున్సిపాలిటీ కార్యాలయంలో, అశ్వారావుపేట మున్సిపాలిటీ పరిధిలో ఓటు హక్కు కలిగిన వారు అశ్వారావుపేట మున్సిపాలిటీ కార్యాలయంలో ఈ నెల 07 మరియు 08 తేదీల్లో ఉదయం 10.00 గంటల నుండి సాయంత్రం 5.00 గంటల వరకు పోస్టల్ బ్యాలెట్ ద్వారా ఓటు హక్కును వినియోగించుకోవచ్చని జిల్లా కలెక్టర్ స్పష్టం చేశారు. మున్సిపల్ ఎన్నికల విధుల్లో నియమితులైన అన్ని శ్రేణుల అధికారులు, ఉద్యోగులు, పోలింగ్ సిబ్బంది, ఎన్నికల నిఘా బృందాలు, డ్రైవర్లు, భద్రతా సిబ్బంది తదితరులు ఈ సదుపాయాన్ని వినియోగించుకోవచ్చని తెలిపారు. ఇందుకోసం ఎన్నికల విధుల ఉత్తర్వు ప్రతిలిపి, ఉద్యోగ గుర్తింపు కార్డు, ఓటర్ గుర్తింపు కార్డు (EPIC) మరియు ఒక పాస్‌పోర్ట్ సైజు ఫోటో తప్పనిసరిగా వెంట తీసుకురావాలని సూచించారు.ఫెసిలిటేషన్ సెంటర్లలో అవసరమైన పత్రాల ధృవీకరణ అనంతరం పోస్టల్ బ్యాలెట్ పేపర్ జారీ చేయబడుతుందని, నిర్ణీత విధానంలో గోప్యంగా ఓటు వినియోగించి, సీల్ చేసిన ఎన్వలప్‌ను రిటర్నింగ్ అధికారి సమక్షంలో ఏర్పాటు చేసిన సీల్ చేయబడిన పోస్టల్ డ్రాప్ బాక్స్‌లో వేయవలసి ఉంటుందని తెలిపారు. ఈ మొత్తం ప్రక్రియ పూర్తిగా గోప్యతతో, ఎన్నికల నిబంధనల ప్రకారం నిర్వహించబడుతుందని జిల్లా కలెక్టర్ తెలిపారు.ఎన్నికల విధుల్లో ఉన్న ప్రతి అధికారి మరియు సిబ్బంది తమ ప్రజాస్వామ్య హక్కును తప్పనిసరిగా వినియోగించుకోవాలని, ఇందుకు పోస్టల్ బ్యాలెట్ సదుపాయం ప్రత్యేకంగా ఏర్పాటు చేయబడినదని జిల్లా ఎన్నికల అధికారి విజ్ఞప్తి చేశారు. నిర్ణీత తేదీల్లో అందరూ వ్యక్తిగతంగా హాజరై తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని కోరారు.

telugu velugu

Admin

తెలుగు వెలుగు టీవీ

మరిన్ని వార్తలు

Copyright © Telugu Velugu TV 2026. All right Reserved.



Developed By :