తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : భద్రాద్రి కొత్తగూడెం అక్టోబర్ 7 తెలుగు వెలుగు ) జూలూరుపాడు మండల వెంగన్నపాలెం గ్రామానికి చెందిన ఏసిపి విష్ణుమూర్తి గుండెపోటుతో ఆదివారం రాత్రి హైదరాబాదులో మరణించారు. ఈరోజు వారి పార్థివ దేహాన్ని స్వగ్రామం వెంగన్నపాలెం నందు విష్ణుమూర్తి పార్థివదేహానికి భద్రాద్రి కొత్తగూడెం జిల్లా సూపర్డెంట్ ఆఫ్ పోలీస్ రోహిత్ రాజ్ నివాళులర్పించారు. వారితోపాటు ఇంటిలిజెన్సీ ఏ ఎస్ పి రామోజీ రమేష్, ఇంటిలిజెన్సీ డి.ఎస్.పి వెంకన్న బాబు, భద్రాద్రి కొత్తగూడెం డీఎస్పి అబ్దుల్ రెహమాన్, ఉమ్మడి ఖమ్మం జిల్లా పదవి విరమణ పొందిన పోలీస్ సంఘం అధ్యక్షుడు సూరిశెట్టి శ్రీనివాసరావు, ఇంటిలిజెన్సీ సీఐ శ్రీనివాసరావు, ఇంటెలిజెన్సీ ఎస్ఐ హరి సింగ్ జూలూరుపాడు సర్కిల్ ఇన్స్పెక్టర్ శ్రీలక్ష్మి, సబ్ ఇన్స్పెక్టర్ బాధావత్ రవి పలువురు ఉన్నతాధికారులు నివాళులర్పించారు. తదుపరి ప్రభుత్వ లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించారు
Admin
తెలుగు వెలుగు టీవీ