తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : సింగరేణిలో వెహికల్ ట్రాకింగ్ సిస్టం పనిలో విధులు నిర్వహిస్తున్న కాంట్రాక్టు సర్వీస్ ఇంజనీర్స్ కు పెండింగ్ లో ఉన్న వేతనాలను తక్షణమే చెల్లించాలని, వారికి ఉపాధి కల్పించాలని సింగరేణి కాంట్రాక్ట్ వర్కర్స్ యూనియన్-AITUC ఆధ్వర్యంలో సింగరేణి అధికారులకు వినతి పత్రం సమర్పించారు.గురువారం నాడు కొత్తగూడెం సింగరేణి హెడ్ ఆఫీస్ లో జిఎం పర్సనల్ శ్రీమతి కె కవిత నాయుడు గారికి సింగరేణి కాంట్రాక్ట్ వర్కర్స్ యూనియన్-AITUC ఆధ్వర్యంలో కొత్తగూడెం రీజియన్ కార్యదర్శి యర్రగాని కృష్ణయ్య, ఉపాధ్యక్షులు కే డబ్ల్యూ కిష్టాఫర్* లు మరియు కాంట్రాక్టు సర్వీస్ ఇంజనీర్స్ కలసి వినతి పత్రం సమర్పించారు.ఈ సందర్భంగా ఏఐటీయూసీ నాయకులు మాట్లాడుతూ సింగరేణిలో గత 7,8 సంవత్సరాల నుండి విధులు నిర్వహిస్తున్న కాంట్రాక్ట్ సర్వీస్ ఇంజనీర్ కు గత కాంట్రాక్టర్ 7 నెలల నుండి వేతనాలు చెల్లించలేదని విమర్శించారు.వేతనాలు రాక తీవ్ర ఆర్థిక ఇబ్బందులు పడుతున్న సర్వీస్ ఇంజనీర్స్ కు తక్షణమే వేతనాలను చెల్లించాలని,గత రెండు నెలల నుండి పని లేక ఇబ్బందులు పడుతున్న వారికి తక్షణమే మరల టెండర్స్ ను పిలిచి ఉపాధి కల్పించాలని డిమాండ్ చేశారు.వీరందరూ స్కిల్డ్ వర్కర్స్ అయినందున వేతనాలు కూడా స్కిల్డ్ వేతనాలు చెల్లించాలని డిమాండ్ చేశారు.ఈ కార్యక్రమంలో అవినాష్, ప్రశాంత్,బుచ్చిబాబు,చంద్రశేఖర్,ప్రవీణ్,రాధా కిరణ్ తదితరులు పాల్గొన్నారు
Admin
తెలుగు వెలుగు టీవీ