తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : పట్టణంలో ఇటీవల మృతిచెందిన అర్థో డాక్టర్ విజేందర్ రావు,నిస్వార్థ కార్మిక,రాజకీయ నాయకులు గుడివాడ రామ లక్ష్మణులు పేర్లు బస్తీలకు పెట్టాలని బహుజన్ సమాజ్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అడ్వకేట్ యెర్రా కామేష్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.శుక్రవారం పార్టీ కార్యాలయంలో జరిగిన ముఖ్య కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడుతూ దేశంలోనే రెండవ అత్యంత పేరు గాంచిన చండీఘర్ యూనివర్సిటీలో ఎంఎస్ ఆర్థో పట్టా పొంది కొత్తగూడెం సింగరేణి ప్రధాన ఆసుపత్రి నందు విశేష సేవలు అందించి,ప్రవేట్ ఆసుపత్రి ద్వారా ఎంతోమందికి మెరుగైన వైద్యం అందించాడమే కాకుండా రోటరీ క్లబ్ ద్వారా దివ్యాంగులకు కుత్రిమ అవయవాలు ఉచితంగా,కుట్టుమిషన్ల్,చదువుకునే విద్యర్థులకు బల్లలు,కుర్చీలు ఉచితంగా అందించడమే కాకుండా రామచంద్ర కాలేజ్ కి అదనపు కోర్సులు తీసుకురావడంలో విశేష కృషి చేశారని,అదేవిధంగా గుడివాడ రామ లక్ష్మణులు సింగరేణి కార్మికుడిగా,కార్మిక సంఘ నాయకుడిగా,రాజకీయ నాయకుడిగా,ముఖ్యమంత్రితో వ్యక్తిగతంగా మాట్లాడే చనువు ఉన్న ఏరోజు కూడా తన స్వప్రయోజనాల కోసం పని చేయకుండా 13 సంవత్సరాలు కాంగ్రెస్ పట్టణ అధ్యక్షుడుగా నిజాయితీ గల నాయకుడిగా ఎంఎల్ఏ గా అవకాశం వచ్చినా కులం మూలంగా ఎంఎల్ఏ గా పోటీచేసే అవకాశం కోల్పోయిన పార్టీ కోసం నిబద్ధతతో కష్టపడిన వ్యకి అని కొనియాడారు.భవిష్యత్తు తరాల వారికి వీరు చేసిన కృషి,సేవా తెలియజేయాల్సిన భాధ్యత నేటి పాలకులకు ఉందని ఇటువంటి మహోన్నతుల చరిత్ర కనుమరుగు కాకుండా ఉండాలంటే పట్టణంలోని సన్యాసి బస్తీకి...గుడివాడ రామ లక్ష్మణులు వారి బస్తీ అని,విజేందర్ గారి ఇంటి పరిసరాల్లో డా.విజేందర్ రావు గారి బస్తీలని ఏర్పాటు చేయాలని అదేవిదంగా పోస్ట్ ఆఫీస్ అంబేద్కర్ సెంటర్ లో వీరి విగ్రహాలను అన్ని రాజకీయ,కుల సంఘాలను,స్వచ్ఛంద సంస్థలను కలుపుకొని వీరి విగ్రహాలను ఏర్పాటు చేస్తామని తెలిపారు. ఈకార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శి మాలోత్ వీరు నాయక్,బహుజన కార్మిక విభాగం జిల్లా అధ్యక్షుడు సాయి,దాసరి జైసింగ్,నౌతన్,మురళి తదితరులు పాల్గొన్నారు
Admin
తెలుగు వెలుగు టీవీ