Monday, 20 April 2026 01:31:31 PM
# అశ్వారావుపేట నియోజకవర్గ మాజీ MLA,BRS పార్టీ ఇంచార్జ్ మెచ్చా నాగేశ్వరరావు నేడు అశ్వారావుపేట మండలంలో విస్తృతంగా పర్యటించారు. # వైద్య ఖర్చులకు లక్ష రూపాయల ఎల్ఓసి మంజూరు చేసిన ఎమ్మెల్యే జారె. # మహా కుంభాభిషేకానికి రావాల్సిందిగా మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డిని ఆహ్వానించిన ఎమ్మెల్యే జారె. # గిరిజన ప్రాంతాలకు వైద్య సేవల్లో నూతన దిశగా ప్రభుత్వం కీలక ముందడుగు. # భద్రాచలం ఏఎస్పీ విక్రాంత్ కుమార్ సింగ్ ఆధ్వర్యంలో.. జిల్లా పోలీస్ హెడ్ క్వార్టర్స్ నందు Prosecution Review Committee (PRC) సమావేశం నిర్వహించబడింది. # చండ్రుగొండలో మూతపడ్డ పెట్రోల్ బంకులు. # పాలిసెట్ ప్రవేశ పరీక్షకు ఉచిత శిక్షణా తరగతులు – రుద్రంపూర్ ప్రభుత్వ పాలిటెక్నిక్. # ప్రతి ఒక్కరూ ట్రాఫిక్ నియమాలను పాటిస్తూ రోడ్డు ప్రమాదాలను నియంత్రించడంలో బాధ్యతగా వ్యవహరించాలి : డిఎస్పీ ఆదినారాయణ. # 6 నెలలుగా డాక్టర్ లేని ప్రభుత్వ హోమియో వైద్యశాల. # ఆరోగ్య సూత్రాలు పాటించండి శ్రమదానం చేయండి ఆరోగ్యంగా ఉండండి. Dr తుకారాం రాథోడ్ DMHO # బాల్యవివాహాలను అంతం చేద్దాం - ఆడపిల్లలకు బంగారు భవిష్యత్తును అందిద్దాం. # మానవత్వం చాటుకున్న సుజాతనగర్ ఎస్సై రమాదేవి. # సిపిఐ శాఖ సెక్రటరీ కీసరి రాఘవలు"పార్థివ దేహం" నివాళులు ఆర్పించిన సిపిఐ జిల్లా సెక్రటరీ సాబీర్ పాషా. # చిన్న చిన్న నిర్లక్ష్యాలే పెద్ద ప్రమాదాలకు దారితీస్తాయి.ప్రతి ఒక్కరూ కచ్చితంగా రోడ్డు భద్రతా నియమాలను పాటించాలి: ఎస్పీ రోహిత్ రాజు. # అశ్వరావుపేటలో రెండు 33/11 కేవీ విద్యుత్ ఉపకేంద్రాలకు శంకుస్థాపన. రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క మల్లు. # ఘనంగా అంబేద్కర్ 135వ జయంతి వేడుకలు # సమ్మర్ గేమ్స్ కోచింగ్ క్యాంప్ ప్రారంభించిన ఎమ్మెల్యే జారె. # సింగరేణి హెడ్ ఆఫీస్ వద్ద ఘనంగా రాజ్యాంగ నిర్మాత జయంతి. అంబేద్కర్ చిత్రపటానికి పుష్పాంజలి ఘటించిన ప్రముఖులు. # అంగన్వాడీల అభివృద్దె మా లక్ష్యం.వైరా ఎమ్మెల్యే రాందాస్ నాయక్.అంగన్వాడీ టీచర్లకు స్మార్ట్ ఫోన్ల పంపిణీ.దివ్యాంగులకు సహాయ ఉపకరణాల పంపిణీ. వైరా ఎమ్మెల్యే # జీవితం విలువైనది భద్రత మన బాధ్యత. ర్యాలీ ని ఉద్దేశించి మాట్లాడుతున్న 16 వ డివిజన్ కార్పొరేటర్ మునగడప పద్మ.

జూలూరుపాడు ఉప మార్కెట్ నందు దళారీల దందా

Date : 30 October 2024 07:36 PM Views : 860

తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : భద్రాద్రి కొత్తగూడెం అక్టోబర్ 30 (తెలుగు వెలుగు) జూలూరుపాడు పత్తి మార్కెట్లో ప్రభుత్వం ప్రకటించిన మద్దతు ధర కంటే తక్కువ ధరకు కొనుగోలు చేస్తున్నారంటూ పత్తి రైతుల ఆవేదన. సీసీఐ కేంద్రం ద్వారా పత్తి కొనుగోలు జరపాలని, క్వింటాల్ పత్తికి 10వేల రూపాయల మద్దతు ధర ఇవ్వాలని డిమాండ్. జూలూరుపాడు పత్తి మార్కెట్ కు వస్తే సరైన ధరలు లేక దళారీల చేతిలో దగా పడుతున్నామనితరుగు పేరుతో, పత్తి నాణ్యత లేదంటూ రకరకాల సాకులు చెబుతూ ధరలు తగ్గిస్తున్నారంటూ రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.గత వారం రోజులుగా జూలూరుపాడు పత్తి మార్కెట్ కు రోజుకు సుమారు 5 వేల క్వింటాళ్లకు పైగా పత్తి వస్తున్నది. పండుగ రోజులు కావడంతో రైతులు తమ అవసరాలకు పత్తిని విక్రయిస్తున్న నేపథ్యంలో రైతుల బలహీనతను ఆసరాగా చేసుకొని దళారులు సిండికేట్ అయి తక్కువ ధరకే పత్తి కొనుగోలు చేస్తున్నారు.మరోవైపు పత్తితీతలు ముమ్మరం కావడంతో, రైతులు తమ కుటుంబ అవసరాలకు కోసం తెల్లబంగారాన్ని విక్రయించేందుకు మార్కెట్ కి తీసుకొస్తున్నారు. మార్కెట్లో జెండా పాట క్వింటాకు 6600 రూపాయలు కాగా, ఆ తర్వాత క్వింటా 5,800 నుంచి 5,200 రూపాయల ధరకే కొనుగోలు చేస్తున్నారని రైతులు ఆవేదన వ్యక్తంచేస్తున్నారు.క్వింటా పత్తి తీయడానికి కూలీలకు 1500, మార్కెట్ కు తరలించేందుకు రవాణాకు వెయ్యి రూపాయలు అవుతుంటే,ఇక్కడ సరైన మద్దతు ధర లేకపోవడం వల్ల తాము తీవ్రంగానష్టపోతున్నామని, మార్కెట్కు తెచ్చిన పత్తిని తిరిగి తీసుకువెళ్లలేక, దళారీలు అడిగిన రేటుకే అమ్మాల్సిన పరిస్థితి వస్తుందని, కూలీలకు, దళారుల కోసమే తాము వ్యవసాయం చేస్తున్నట్లుగా ఉందని,రైతుకు మిగిలేది ఏమీ లేదంటూ ఆవేదన వ్యక్తం చేశారు.తక్షణమే ప్రభుత్వం స్పందించి సీసీఐ కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయాలని, క్వింటాలుకు పదివేల రూపాయలు మద్దతు ధర కల్పించాలని డిమాండ్ చేస్తున్నారు..

telugu velugu

Admin

తెలుగు వెలుగు టీవీ

మరిన్ని వార్తలు

Copyright © Telugu Velugu TV 2026. All right Reserved.



Developed By :