తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : భద్రాద్రి కొత్తగూడెం అక్టోబర్ 30 (తెలుగు వెలుగు) జూలూరుపాడు పత్తి మార్కెట్లో ప్రభుత్వం ప్రకటించిన మద్దతు ధర కంటే తక్కువ ధరకు కొనుగోలు చేస్తున్నారంటూ పత్తి రైతుల ఆవేదన. సీసీఐ కేంద్రం ద్వారా పత్తి కొనుగోలు జరపాలని, క్వింటాల్ పత్తికి 10వేల రూపాయల మద్దతు ధర ఇవ్వాలని డిమాండ్. జూలూరుపాడు పత్తి మార్కెట్ కు వస్తే సరైన ధరలు లేక దళారీల చేతిలో దగా పడుతున్నామనితరుగు పేరుతో, పత్తి నాణ్యత లేదంటూ రకరకాల సాకులు చెబుతూ ధరలు తగ్గిస్తున్నారంటూ రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.గత వారం రోజులుగా జూలూరుపాడు పత్తి మార్కెట్ కు రోజుకు సుమారు 5 వేల క్వింటాళ్లకు పైగా పత్తి వస్తున్నది. పండుగ రోజులు కావడంతో రైతులు తమ అవసరాలకు పత్తిని విక్రయిస్తున్న నేపథ్యంలో రైతుల బలహీనతను ఆసరాగా చేసుకొని దళారులు సిండికేట్ అయి తక్కువ ధరకే పత్తి కొనుగోలు చేస్తున్నారు.మరోవైపు పత్తితీతలు ముమ్మరం కావడంతో, రైతులు తమ కుటుంబ అవసరాలకు కోసం తెల్లబంగారాన్ని విక్రయించేందుకు మార్కెట్ కి తీసుకొస్తున్నారు. మార్కెట్లో జెండా పాట క్వింటాకు 6600 రూపాయలు కాగా, ఆ తర్వాత క్వింటా 5,800 నుంచి 5,200 రూపాయల ధరకే కొనుగోలు చేస్తున్నారని రైతులు ఆవేదన వ్యక్తంచేస్తున్నారు.క్వింటా పత్తి తీయడానికి కూలీలకు 1500, మార్కెట్ కు తరలించేందుకు రవాణాకు వెయ్యి రూపాయలు అవుతుంటే,ఇక్కడ సరైన మద్దతు ధర లేకపోవడం వల్ల తాము తీవ్రంగానష్టపోతున్నామని, మార్కెట్కు తెచ్చిన పత్తిని తిరిగి తీసుకువెళ్లలేక, దళారీలు అడిగిన రేటుకే అమ్మాల్సిన పరిస్థితి వస్తుందని, కూలీలకు, దళారుల కోసమే తాము వ్యవసాయం చేస్తున్నట్లుగా ఉందని,రైతుకు మిగిలేది ఏమీ లేదంటూ ఆవేదన వ్యక్తం చేశారు.తక్షణమే ప్రభుత్వం స్పందించి సీసీఐ కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయాలని, క్వింటాలుకు పదివేల రూపాయలు మద్దతు ధర కల్పించాలని డిమాండ్ చేస్తున్నారు..
Admin
తెలుగు వెలుగు టీవీ