తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : పేదల కాలనీలో సిపిఐ శతజయంతి ఉత్సవాల మొదటి జెండాను ఆవిష్కరించిన సిపిఐ జిల్లా కార్యదర్శి ఎస్కే షాపిర్ పాషా భద్రాద్రి కొత్తగూడెం (అర్బన్): పీడిత , బాధిత అణగారిన వర్గాల అభ్యున్నతి కోసం కార్మికుడి, కర్షకుడి, పేద ప్రజల హక్కుల కోసం జన్మించి నూరేళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా పదో వార్డులోని పేద ప్రజల ఇందిరమ్మ కాలనీ లో మొట్టమొదటి శతజయంతి ఉత్సవాల జెండాను సిపిఐ జిల్లా రథసారథి ,కార్యదర్శి ఎస్.కె షబీర్ పాష ఆవిష్కరించారు .గురువారం స్థానిక పదో వార్డులోని ఇందిరమ్మ కాలనీలో ఏర్పాటుచేసిన సమావేశంలో షాబీర్ పాష మాట్లాడుతూ పీడిత, బాధిత అణగారిన వర్గాల అభ్యున్నతి కోసం కార్మికుల, కార్మిక ,పేద ప్రజల హక్కుల సాధన కోసం ఏర్పడింది సిపిఐ నని, సిపిఐ ఏర్పడి 100 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా శతజయంతి ఉత్సవాలు దేశవ్యాప్తంగా ఘనంగా జరుగుతున్నాయని ,ఈ శత జయంతి ఉత్సవాల్లో ప్రజలందరూ పాల్గొని భారత కమ్యూనిస్టు పార్టీ ఎదుగుదలకు ప్రతి ఒక్కరు కృషి చేయాలని ఆయన ప్రజలకు పిలుపునిచ్చారు. ప్రజల పక్షాన నిలబడి నిరంతరం ప్రజల కోసం పోరాడేది ఒక్క ఎర్ర జెండా మాత్రమే అన్నారు. అనేక పార్టీలు పుట్టుకొచ్చి కాలగర్భంలో కలిసిపోయాయని అది చరిత్ర చెబుతుందని అన్నారు . 1925లో కాన్పూర్లో పుట్టిన భారత కమ్యూనిస్టు పార్టీ నేటికీ 100 సంవత్సరాలు పూర్తి చేసుకుందనన్నారు అందుకే ఒక్క కమ్యూనిస్టు పార్టీ మాత్రమే సూర్య ,చంద్రాదులు ఉన్నంతవరకు ప్రజల కోసం జీవిస్తూ ఉంటుందని ఆయన అన్నారు.జెండా ఆవిష్కరణలో ఏఐటియుసి జిల్లా అధ్యక్షులు జిల్లా, కౌన్సిల్ సభ్యులు కంచర్ల జములయ్య, సిపిఐ జిల్లా కౌన్సిల్ సభ్యులు మాజీ మున్సిపల్ ఫోర్ లీడర్ మునిగడప వెంకటేశ్వర్లు, బ్రాంచ్ కార్యదర్శి పియ్యాల రంగారావు, ఏ ఐ ఎస్ ఎఫ్ జిల్లా అధ్యక్షులు ఎస్కే ఫై యుమ్ ,పదో వార్డు కౌన్సిలర్ పద్మ, నాయకులు ఉప్పతల శ్రీనివాస్, సబ్బని పాపారావు, గుంజ వెంకన్న ,శెట్టి రాజు, పల్లపు వెంకన్న ,మహిళలు మార్తమ్మ ,రాజేశ్వరి ,రమ్య తదితరులు పాల్గొన్నారు.
పదో వార్డులో వివిధ పార్టీల నుండి 40 కుటుంబాలు సిపిఐ లో చేరిక కొత్తగూడెం (అర్బన్) :వివిధ పార్టీల నుండి శెట్టి రాజు ,గుంజ వెంకన్న, ఉప్పుతల శ్రీను ఆధ్వర్యంలో నలభై కుటుంబాలు సిపిఐ జిల్లా కార్యదర్శి ఎస్.కె షబీర్ పాషా సమక్షంలో వారికి కండువాలు కప్పి సాదరంగా సిపిఐ లోకి ఆహ్వానించారు. అనంతరం మాట్లాడుతూ సిపిఐ పార్టీలో చేరిన ప్రతి కార్యకర్తను కంటికి రెప్పలా కాపాడుకుంటామని ,వారి కష్టసుఖాల్లో పార్టీ వారికి అండగా ఉంటుందని ఈ సందర్భంగా వారికి హామీ ఇచ్చారు. పార్టీలో చేరిన వారిలో శెట్టి రాజు, ఉప్పతల శ్రీను, గుంజ వెంకన్న, పల్లపు వెంకన్న, జట్పట్ రాజు ,శ్రీకాంత్, తిమోతి, ప్రసాద్ ,రాములు, సతీష్ ,వెంకటస్వామి, శివ, వంశి ,వెంకటేష్ ,సురేష్, నాగేశ్వరరావు, రాజశేఖర్, అజేందర్ ,అనిల్, తదితరులు ఉన్నారు. ఈ కార్యక్రమంలో సిపిఐ జిల్లా కౌన్సిక్ సభ్యులు కంచర్ల జమలయ్య, మున్సిపల్ మాజీ ఫ్లోర్ లీడర్ జిల్లా కౌన్సిల్ సభ్యులు మునిగడప వెంకటేశ్వర్లు, రామవరం బ్రాంచ్ కార్యదర్శి పెయ్యాల రంగారావు ,పదో వార్డ్ కౌన్సిలర్ మునిగడప పద్మ, ఏఐఎస్ఎఫ్ జిల్లా అధ్యక్షులు sk ఫైయుం, నాయకులు గుత్తి ల శ్రీనివాస్ సబ్బన్ పాపారావు, భానోత్ శ్రీను, మార్తమ్మ ,రాజేశ్వరి ,రమ్య, తదితరులు పాల్గొన్నారు.
Admin
తెలుగు వెలుగు టీవీ