Wednesday, 27 May 2026 12:10:25 AM
# సిపిఐ జిల్లా కార్యాలయంలో ఘనంగా గిరిప్రసాద్ 29వ వర్ధంతి. # జర్నలిస్టుల హక్కుల రక్షణకు, సమస్యల పరిష్కారానికి నిరంతరం పోరాడాలి. సిపిఐ రాష్ట్ర కార్యదర్శి, కొత్తగూడెం శాసనసభ్యులు కూనంనేని సాంబశివరావు. # ప్రజావాణికి అధికారులు సకాలంలో హాజరు కావాలి : జిల్లా కలెక్టర్ అంకిత్. # రేషన్ డీలర్ల జిల్లా స్థాయి సమావేశంలో ముఖ్య అతిధిగా పాల్గొన్న ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు. # ఎండ తీవ్రత ప్రాంతాల్లో రోడ్లపై నీళ్లు చల్లాలి. సింగరేణి యాజమాన్యం నిర్లక్ష్య వైఖరి ఎండ తీవ్రత కారణం. 16వ డివిజన్ కార్పొరేటర్ మునిగడప పద్మ డిమాండ్. # దళితుల అభ్యున్నతికి విశేష కృషి చేసిన మహనీయుడు భాగ్యరెడ్డి వర్మ : జిల్లా కలెక్టర్ అంకిత్. # జనగణన హౌస్ లిస్టింగ్‌లో ఖచ్చితత్వానికి ప్రాధాన్యం ఇవ్వాలి - డైరెక్టర్ ఆఫ్ సెన్సస్ భారతి హోలీకేర్. # కాంట్రాక్ట్ కార్మికులకు పెండింగ్ సర్క్యులర్స్ ను విడుదల చేయాలి. ఏఐటీయూసీ కొత్తగూడెం రీజియన్ కార్యదర్శి యర్రగాని కృష్ణయ్య. # ఉద్యోగులు సమయపాలన పాటించాలి. ఐడీఓసీ కార్యాలయంలోని వివిధ శాఖలను ఆకస్మికంగా తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్ అంకిత్. # చండ్రుగొండ మండల కేంద్రం బస్ స్టేషన్ లో ని మరమ్మతు ల పనులను పరిశీలించిన అశ్వరావుపేట నియోజకవర్గ శాసనసభ్యులు జారే ఆదినారాయణ # 23వ డివిజన్లో ముఖ్య కార్యకర్తల సమావేశం. టీపీసీసీ జనరల్ సెక్రటరీ నాగా సీతారాములు పిలుపు. # ప్రజా ఆరోగ్యం పరిరక్షణకు ప్రతి ఒక్కరూ నడుం బిగించాలి. సిపిఐ జిల్లా కార్యదర్శి ఎస్ కె సాబీర్ పాషా. # ఓటర్ల జాబితా సమగ్ర సవరణకు పార్టీ శ్రేణులు సహకరించాలి. సిపిఐ జిల్లా కార్యదర్శి ఎస్ కె సాబీర్ పాషా. # ఉపాధి హామీ నిధులతో చేపట్టిన పనులను వేగవంతం చేయాలి. ఉపాధి హామీ కూలీల సంఖ్యను పెంచాలి : జిల్లా కలెక్టర్ అంకిత్. # రైతులకు ఇబ్బందులు లేకుండా మొక్కజొన్న కొనుగోళ్లు చేపడుతున్నాం - జిల్లా కలెక్టర్ అంకిత్. # కాంగ్రెస్ పార్టీ 21 వ డివిజన్ ముఖ్య కార్యకర్తల సమావేశం. తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి నాగా సీతారాములు పిలుపు. # జిల్లా పోలీస్ హెడ్ క్వార్టర్స్ నందు గల పోలీస్ ఫైరింగ్ రేంజ్ నందు జిల్లాలోని పోలీసు అధికారులు,సిబ్బందికి యాన్యువల్ ఫైరింగ్ ప్రాక్టీస్. # ప్రాణాపాయ స్థితిలో 8 ఏళ్ల బాలుడు. దాతల సహాయం కోసం తల్లిదండ్రుల వేడుకోలు. # చండ్రుగొండ మండలం, దామెరచర్లలో ఆగ్రహించిన అన్నదాత. # ఫిట్ అండ్ యాక్టివ్ తెలంగాణ 2K రన్‌లో ఉత్సాహంగా పాల్గొన్న ఎమ్మెల్యే జారె.

రైతులకు ఇబ్బందులు లేకుండా మొక్కజొన్న కొనుగోళ్లు చేపడుతున్నాం - జిల్లా కలెక్టర్ అంకిత్.

Date : 19 May 2026 08:16 PM Views : 69

తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా మొక్కజొన్న కొనుగోలు ప్రక్రియను వేగవంతంగా చేపడుతున్నామని జిల్లా కలెక్టర్ అంకిత్ ఒక ప్రకటనలో తెలిపారు. కొనుగోలు కేంద్రాల్లో తూకం, హమాలీ, రవాణా తదితర ఏర్పాట్లు సక్రమంగా నిర్వహిస్తూ రైతులకు అవసరమైన అన్ని సౌకర్యాలు కల్పిస్తున్నామని అన్నారు . జిల్లా వ్యాప్తంగా ఏర్పాటు చేసిన ప్యాక్స్ కొనుగోలు కేంద్రాల ద్వారా ఇప్పటివరకు మొత్తం 3,76,288 క్వింటాళ్ల మొక్కజొన్న కొనుగోలు చేసినట్లు తెలిపారు. అందులో 2,19,729.5 క్వింటాళ్ల మొక్కజొన్నను గోదాములకు తరలించినట్లు వెల్లడించారు. ప్రస్తుతం కొనుగోలు కేంద్రాలలో 1,56,558.5 క్వింటాళ్ల మొక్కజొన్న నిల్వ ఉన్నట్లు తెలిపారు . మంగళవారం ఒక్కరోజులోనే 10,091.5 క్వింటాళ్ల మొక్కజొన్నను గోదాములకు తరలించినట్లు తెలిపారు. రవాణా కోసం 458 లారీలు, 131 ట్రాక్టర్లు వినియోగిస్తున్నామని పేర్కొన్నారు. అదనంగా మరో 1,50,000 క్వింటాళ్ల మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలకు వచ్చే అవకాశం ఉన్నందున అవసరమైన ఏర్పాట్లు చేస్తున్నామని తెలిపారు.యెల్లందు, టేకులపల్లి, లక్ష్మీదేవిపల్లి, సుజాతనగర్, పాల్వంచ, జూలూరుపాడు, గుండాల, అల్లపల్లి మండలాల్లో కొనుగోలు కేంద్రాలు కొనసాగుతున్నాయని తెలిపారు. కొనుగోలు కేంద్రాల్లో నిల్వ ఉన్న మొక్కజొన్నను త్వరితగతిన గోదాములకు తరలిస్తూ కొనుగోలు ప్రక్రియను నిరంతరాయంగా నిర్వహిస్తున్నామని అన్నారు . రైతుల ఖాతాల్లో చెల్లింపులు వేగంగా జమ అయ్యేలా చర్యలు తీసుకుంటున్నామని జిల్లా కలెక్టర్ అంకిత్ ఆ ప్రకటనలో తెలిపారు.

telugu velugu

Admin

తెలుగు వెలుగు టీవీ

మరిన్ని వార్తలు

Copyright © Telugu Velugu TV 2026. All right Reserved.



Developed By :