తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొనిజర్ల : లూయిస్ బ్రెయిలీ 217 వ జయంతోత్సవ వేడుకలను జిల్లా సంక్షేమ శాఖ వారి కార్యాలయ మీటింగ్ హాల్ నందు ఘనంగా నిర్వహించారు. బ్రెయిలీ పుట్టినరోజు వేడుకలకు ముఖ్య అతిథిగా జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి తుకారం రాథోడ్ మరియు జిల్లా సంక్షేమ శాఖ అధికారినీ జే.ఎం.స్వర్ణలతా లెనిన పాల్గొన్నారు. బ్రెయిలీ చిత్రపటానికి పూలమాలలు వేసి కేక్ కట్ చేసి జయంతోత్సవాన్ని ప్రారంభించారు. జిల్లా సంక్షేమ శాఖ అధికారిని మాట్లాడుతూ బ్రెయిలీ కనిపెట్టిన చుక్కల లిపి ద్వారా అందుల జీవితాలలో వెలుగులు నింపారని ఈ లిపి ద్వారా అందులు విద్యను అభ్యసించి ఉన్నత శిఖరాలు అదిరోహించారని లూయిస్ త్యాగాన్ని కీర్తించారు. దివ్యాంగులకు రాష్ట్ర ప్రభుత్వం అనేక సంక్షేమ పథకాలు చేపట్టిందని దివ్యాంగుల వివాహ ప్రోత్సాహం, పోస్టు మెట్రిక్ స్కాలర్ షిప్,ఈపాస్ ద్వారా సహాయ ఉపకరణాలు,ఓబిఎంఎంఎస్ ద్వారా ఆన్లైన్ దరఖాస్తులు చేసుకోవాలని చెప్పారు. డి ఎం హెచ్ ఓ అధికారి తుకారం రాథోడ్ మాట్లాడుతూ లూయిస్ బ్రెయిలీ స్ఫూర్తితో ఉన్నత శిఖరాలు అధిరోహించాలని, బ్రెయిలీ లిపి కనుగొనడం ద్వారా ఎంతో మంది జీవితాలలో వెలుగులు నింపారని కీర్తించారు. అంధులైన ఉద్యోగస్తులకు, అందుల కొరకు వివిధ రంగాల్లో సేవ చేస్తున్న వారికి సన్మానించి గోడ గడియారాలు బహుకరించారు. ఈ జయంతోత్సవాలకు బ్లైండ్ అసోసియేషన్ సభ్యులు ఎం.నరేందర్, రాజ్ కిరణ్, రమణయ్య, ఉపేంద్రమ్మ, అనుష, కిరణ్, వరప్రసాద్, నాగేశ్వరరావు, నరేష్, ప్రవీణ్ మరియు డిహెచ్ఈడబ్ల్యు సిబ్బంది పాల్గొన్నారు.
Admin
తెలుగు వెలుగు టీవీ