తెలుగు వెలుగు టీవీ - వార్తలు / జూలూరుపాడు : భద్రాద్రి కొత్తగూడెం మార్చ్ 14 తెలుగు వెలుగు ) : జూలూరుపాడు మండలం చండ్రుగుండ ప్రధాన సెంటర్ నందు జనసేన పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు అంబారన్ని అంటాయి. జనసేన పార్టీ మండల అధ్యక్షుడు ఉసికల రమేష్ జెండాను ఆవిష్కరించారు అనంతరం వారు మాట్లాడుతూ పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు కొణిదల పవన్ కళ్యాణ్ ఆదేశానుసారం పార్టీ 13వ ఆవిర్భావ దినోత్సవం ప్రతి జిల్లా, నియోజకవర్గ, మండలాల లో పార్టీ పతాక ఆవిష్కరణ కార్యక్రమంలో భాగంగా ఈరోజు జూలూరుపాడు ఈ కార్యక్రమం జరుపుకున్నామని,మా జనసేన పార్టీ సిద్ధాంతాలు కులాలను కలిపే ఆలోచన విధానం, మతాల ప్రస్తావన లేని రాజకీయం, భాషలను గౌరవించే సాంప్రదాయం, సంస్కృతులను కాపాడే సమాజం, ప్రాంతీయతను విస్మరించని జాతీయవాదం, పర్యావరణాన్ని పరిరక్షించే అభివృద్ధి ప్రస్థానం, అవినీతి రాజకీయాలపై అలుపెరుగని పోరాటం. ఈ సిద్ధాంతాలను ప్రజలలోకి తీసుకెళుతూ పార్టీని మరింత బలోపేతం చేస్తామని, సిద్ధాంతాలకు కట్టుబడి పార్టీ పెద్దలు ఆదేశానుసారం పార్టీ కార్యక్రమాలు నిర్వహిస్తూ జనసేనకులకు అండగా ఉంటానని ఈ కార్యక్రమానికి తమ వంతు బాధ్యతగా ముందుకు వచ్చి విజయవంతం చేసిన పార్టీ మండల నాయకులు చలమల విజయ్,పురేటి జోగారావు, తాటికొండ చలపతి, వడ్డే పవన్, గణప సాయి, రేపాల నవీన్,సారంగి మల్లికార్జున్, రేగుముడి పుల్లారావు, మద్దిబోయిన యల్లేశ్వరరావు, యాస రాకేష్, సాయి, తోట విజయ్ కుమార్, అప్పాల గిరిధర్, వడ్డే గురు ప్రసాద్, అయినవెల్లి శ్యాంసుందర్, మంద కమలాకర్, బాబురావు మరియు జన సైనికులు పవన్ కళ్యాణ్ అభిమానులకు కృతజ్ఞతలు తెలిపారు
Admin
తెలుగు వెలుగు టీవీ