తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : కొత్తగూడెం :అశ్వరావుపేట 26,27 తేదీలలొ సిపిఐ జిల్లా మూడవ మహాసభలలో జిల్లా కార్యవర్గ సభ్యులుగా ఏకగ్రీవంగా ఎన్నికైన ఏఐవైఎఫ్ జిల్లా కార్యదర్శి ఫహీమ్ దాదాని 19వ డివిజన్ భగత్ సింగ్ శాఖ తరపు నుండి రసూల్ పాషా అధ్యక్షణ కార్యక్రమంలో ఘనంగా సన్మానించడం జరిగింది అనంతరం ఫహీమ్ మాట్లాడుతూ నాపై నమ్మకం విశ్వాసంతో అతి చిన్న వయసులో జిల్లా బాధ్యతలు అప్పగించిన సిపిఐ రాష్ట్ర కార్యదర్శి, కొత్తగూడెం ఎమ్మెల్యే శ్రీ కూనంనేని సాంబశివరావు, సిపిఐ జిల్లా కార్యదర్శి సాబీర్ పాషా కు హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలిపారు, భవిష్యత్తులో పార్టీ కార్యక్రమాలలొ మరింత చురుకుగా పాల్గొని విజయవంతం చేస్తానని, సిపిఐ పార్టీ నియమ నిబంధనలకు కట్టుబడి పార్టీ బలోపేతానికి కృషి చేస్తానని ఫహీమ్ అన్నారు ఈ కార్యక్రమంలో సిపిఐ సీనియర్ నాయకులు డబ్బేటి గురుమూర్తి,ఖయ్యుమ్, ఎండి హనీఫ్, యాకూబ్,షహీన్, కోరిమి సురేష్, జలీల్, యూసుఫ్,రసూల్, రఫీ, రణధీర్,జానీ, అజిత్,వంశీ,రహీం సంజయ్,సల్మాన్, సలీం,అజీమ్, విజయ్ కాంత్,హమ్మద్, తదితరులు పాల్గొన్నారు..
Admin
తెలుగు వెలుగు టీవీ