Sunday, 19 April 2026 03:28:54 PM
# గిరిజన ప్రాంతాలకు వైద్య సేవల్లో నూతన దిశగా ప్రభుత్వం కీలక ముందడుగు. # భద్రాచలం ఏఎస్పీ విక్రాంత్ కుమార్ సింగ్ ఆధ్వర్యంలో.. జిల్లా పోలీస్ హెడ్ క్వార్టర్స్ నందు Prosecution Review Committee (PRC) సమావేశం నిర్వహించబడింది. # చండ్రుగొండలో మూతపడ్డ పెట్రోల్ బంకులు. # పాలిసెట్ ప్రవేశ పరీక్షకు ఉచిత శిక్షణా తరగతులు – రుద్రంపూర్ ప్రభుత్వ పాలిటెక్నిక్. # ప్రతి ఒక్కరూ ట్రాఫిక్ నియమాలను పాటిస్తూ రోడ్డు ప్రమాదాలను నియంత్రించడంలో బాధ్యతగా వ్యవహరించాలి : డిఎస్పీ ఆదినారాయణ. # 6 నెలలుగా డాక్టర్ లేని ప్రభుత్వ హోమియో వైద్యశాల. # ఆరోగ్య సూత్రాలు పాటించండి శ్రమదానం చేయండి ఆరోగ్యంగా ఉండండి. Dr తుకారాం రాథోడ్ DMHO # బాల్యవివాహాలను అంతం చేద్దాం - ఆడపిల్లలకు బంగారు భవిష్యత్తును అందిద్దాం. # మానవత్వం చాటుకున్న సుజాతనగర్ ఎస్సై రమాదేవి. # సిపిఐ శాఖ సెక్రటరీ కీసరి రాఘవలు"పార్థివ దేహం" నివాళులు ఆర్పించిన సిపిఐ జిల్లా సెక్రటరీ సాబీర్ పాషా. # చిన్న చిన్న నిర్లక్ష్యాలే పెద్ద ప్రమాదాలకు దారితీస్తాయి.ప్రతి ఒక్కరూ కచ్చితంగా రోడ్డు భద్రతా నియమాలను పాటించాలి: ఎస్పీ రోహిత్ రాజు. # అశ్వరావుపేటలో రెండు 33/11 కేవీ విద్యుత్ ఉపకేంద్రాలకు శంకుస్థాపన. రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క మల్లు. # ఘనంగా అంబేద్కర్ 135వ జయంతి వేడుకలు # సమ్మర్ గేమ్స్ కోచింగ్ క్యాంప్ ప్రారంభించిన ఎమ్మెల్యే జారె. # సింగరేణి హెడ్ ఆఫీస్ వద్ద ఘనంగా రాజ్యాంగ నిర్మాత జయంతి. అంబేద్కర్ చిత్రపటానికి పుష్పాంజలి ఘటించిన ప్రముఖులు. # అంగన్వాడీల అభివృద్దె మా లక్ష్యం.వైరా ఎమ్మెల్యే రాందాస్ నాయక్.అంగన్వాడీ టీచర్లకు స్మార్ట్ ఫోన్ల పంపిణీ.దివ్యాంగులకు సహాయ ఉపకరణాల పంపిణీ. వైరా ఎమ్మెల్యే # జీవితం విలువైనది భద్రత మన బాధ్యత. ర్యాలీ ని ఉద్దేశించి మాట్లాడుతున్న 16 వ డివిజన్ కార్పొరేటర్ మునగడప పద్మ. # అశ్వాపురం ప్రభుత్వ జూనియర్ కళాశాల విద్యార్థిని 973 మార్కులతో ఓంకారిణి టాప్. # ఉపముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క పర్యటన ఏర్పాట్లను పరిశీలించిన ఎమ్మెల్యే జారె. # సెన్సస్ పనులను నిర్ణీత గడువులోపు పూర్తి చేయాలి: జిల్లా కలెక్టర్ జిల్లా కలెక్టర్ అంకిత్.

గ్రామీణ మౌలిక వసతుల అభివృద్ధి వేగవంతం చేయాలి: డీఆర్‌డీఓ విద్యా చందన

Date : 17 March 2026 06:14 PM Views : 98

తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొనిజర్ల : ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా చేపట్టిన 99 రోజుల కార్యాచరణలో, ములకలపల్లి మండలం పాతగంగారం గ్రామపంచాయతీ పరిధిలోని జగన్నాధపురం గ్రామాన్ని మంగళవారం జిల్లా గ్రామీణ అభివృద్ధి అధికారి విద్యా చందన సందర్శించి పనులను పర్యవేక్షించారు. ఈ సందర్భంగా గ్రామంలో డ్రైన్‌లు మరియు సోక్‌పిట్‌ల నిర్మాణ పనులకు శ్రీకారం చుట్టి, వాటి పురోగతిని సమీక్షించారు. గ్రామాల్లో పారిశుద్ధ్యాన్ని మెరుగుపరచడం, వర్షపు నీటి నిల్వలను నివారించడం, ఆరోగ్యకరమైన వాతావరణాన్ని కల్పించడం కోసం ఈ పనులు అత్యంత కీలకమని ఆమె అన్నారు . గ్రామీణ ప్రాంతాల్లో మౌలిక వసతుల అభివృద్ధిని వేగవంతం చేయాల్సిన అవసరం ఉందని, సంబంధిత అధికారులు సమన్వయంతో పనిచేసి పనులను నిర్దిష్ట గడువులో పూర్తి చేయాలని ఆదేశించారు. అనంతరం జగన్నాధపురం గ్రామపంచాయతీ పరిధిలోని ఎన్‌పీఏ కలిగిన స్వయం సహాయక సంఘాల సభ్యులతో సమావేశమై వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. సంఘాల ఆర్థిక పరిస్థితులను సమీక్షించి, రుణాల సక్రమ వినియోగం, ఆదాయ వృద్ధి మార్గాలు, ప్రభుత్వ పథకాల సమర్థ వినియోగంపై సభ్యులకు మార్గదర్శకాలు అందించారు. స్వయం సహాయక సంఘాలు మహిళల ఆర్థిక సాధికారతకు బలమైన వేదికలని, ప్రతి సభ్యురాలు బాధ్యతతో వ్యవహరించి సంఘాలను బలోపేతం చేయాలని డీఆర్‌డీఓ విద్యా చందన సూచించారు. గ్రామాభివృద్ధిలో మహిళల పాత్ర అత్యంత కీలకమని ఆమె తెలిపారు. గ్రామాల్లో మౌలిక వసతుల అభివృద్ధి, పారిశుద్ధ్య పరిరక్షణ, మహిళల ఆర్థిక సాధికారత వంటి అంశాలపై ప్రత్యేక దృష్టి సారిస్తూప్రజాపాలన ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యాచరణ కార్యక్రమాన్ని సమర్థవంతంగా అమలు చేస్తున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో సంబంధిత అధికారులు, గ్రామపంచాయతీ ప్రతినిధులు, స్వయం సహాయక సంఘాల సభ్యులు పాల్గొన్నారు.

telugu velugu

Admin

తెలుగు వెలుగు టీవీ

మరిన్ని వార్తలు

Copyright © Telugu Velugu TV 2026. All right Reserved.



Developed By :