తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : అంగన్వాడి కేంద్రాలను బలోపేతం చేయాలి : 16వ డివిజన్ కార్పొరేటర్ మునగడప పద్మ కొత్తగూడెం అర్బన్ పోషకాహారం విద్య ఆరోగ్యం పట్ల అంగన్వాడి టీచర్లు ఆయాల శ్రమ వెల కట్టలేనిదని 16 వ డివిజన్ కార్పొరేటర్ మునిగడప పద్మ కొనియాడారు. గురువారం 16వ డివిజన్ నెహ్రూ బస్తీ సెంటర్లో జరిగిన పోషణ్ పక్వాడ్ లో భాగంగా ఈనెల తొమ్మిది నుండి ఏప్రిల్ 23 వరకు జరిగే కార్యక్రమంలో మాట్లాడుతూ పోషకాహారం తల్లి, పిల్లలు తీసుకోవడం వల్ల ఆరోగ్యకరమైన సమాజాన్ని మనం నెలకొల్పవచ్చు అన్నారు . అలాగే కార్పొరేట్ శక్తులు విద్యను వ్యాపారం చేసే ఈ రోజుల్లో అంగన్వాడి కేంద్రాల్లో అంగన్వాడీ టీచర్లు పిల్లలను అంగన్వాడి సెంటర్లకు తీసుకెళ్లి వారికి పోషకాహారం, విద్య ,ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహిస్తూ వారిని ఆరోగ్యకరమైన పిల్లలుగా తయారు చేస్తున్న వారి కృషి అమోఘమని ఆమె అన్నారు. అనంతరం సెంటర్లో చిన్నారులకు అన్న ప్రసన,అక్షరాభ్యాస కార్యక్రమాన్ని నిర్వహించారు. పోషక విలువలతో కూడిన పోషకాహార ప్రదర్శన నిర్వహించి పిల్లలను ఆకట్టుకున్నారు. తన కుమారుడికి అక్షరాభ్యాసం నిర్వహించుకున్న తీట్ల దివాకర్ అంగన్వాడి సెంటర్లలోని చిన్నారులకు పలక, బలపాలని పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ఐసిడిఎస్ సూపర్వైజర్ పార్వతి, అంగన్వాడీ టీచర్స్ సరోజ ,డి నీలవేణి, షహనాజ్ ,దేవి, రజిత ,ఆయాలు వెంకటలక్ష్మి ,కౌసల్య, కొమరమ్మ ,తల్లిదండ్రులు తీట్ల దివాకర్, కంచర్ల శ్రావణి ,సంతోషి, ఎస్ కే ఫైజా, జాన్ నవీన్ ,జి రుత్విక్ ,రవి, విన్సీ ,ప్రసన్న ,జి నాగలక్ష్మి , లీల, రమ్య తదితరులు పాల్గొన్నారు.
Admin
తెలుగు వెలుగు టీవీ