తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొనిజర్ల : స్వర్గీయ బానోతు కిషన్ నాయక్ పెద్దకర్మ కార్యక్రమం పాల్వంచలోని తనుష్ గ్రాండ్ లో శనివారం జరిగింది.ఈ సందర్భంగా పట్టణ ప్రముఖులు సంస్కరణ సభకు హాజరయ్యారు.కిషన్ నాయక్ సేవలను గుర్తు చేసుకున్నారు. విద్యార్థి దశ నుంచి ఉద్యమాలు చేశాడని బంజారా జాతిని జాగృత పరచడానికి పాటలు పాడేవాడని,మంచి రచయిత అని ముగ్గురు పిల్లలను డాక్టర్లను చేసి తన భార్య విజయలక్ష్మిని రాజకీయంగా ప్రోత్సహించాడని కిషన్ మహనీయుడు అంటూ గుర్తు చేసుకుని పలువురు కంటతడి పెట్టుకున్నారు.ఈ కార్యక్రమంలో వైరా ఎమ్మెల్యే రాందాస్ నాయక్,మాజీ ఎంపీ సీతారాం నాయక్,రాష్ట్ర కాంగ్రెస్ నాయకులు కోనేరు సత్యనారాయణ(చిన్ని),కోనేరు పూర్ణ చందర్ రావు ,కొత్వాల శ్రీనివాస్, బిజెపి మాజీ జిల్లా అధ్యక్షులు రంగా కిరణ్, బిజెపి నాయకులు యెల్దండి పూర్ణచందర్ రావు, నంది శశి కుమార్,ఎడవల్లి కృష్ణ, ఏనుగుల అర్జున్ రావు,,బీఆర్ఎస్ నాయకులు కాంపెల్లి కనకేష్,సింధు తపస్వి,,లయన్స్ క్లబ్ కొత్తగూడెం అధ్యక్షులు లగడపాటి రమేష్,యుటిఎఫ్ నాయకులు దస్తగిరి,ఎల్ హెచ్ పి ఎస్ నాయకులు,వైద్యులు,పట్టణ ప్రముఖులు,న్యాయవాదులు, పార్టీలకతీతంగా,ప్రముఖులందరూ హాజరయ్యారు.
Admin
తెలుగు వెలుగు టీవీ