తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : భద్రాద్రి జిల్లా వ్యాప్తంగా వరుస దొంగతనాలకు పాల్పడుతున్న దుండగులను సుజాతనగర్ పోలీసులు చాకచక్యంగా అరెస్టు చేశారు. వారి వద్ద నుంచి 36 తులాల బంగారం, 102 తులాల వెండి రికవరీ చేశారు. రికవరీ సొత్తు సుమారు రూ.30 లక్షల విలువ ఉంటుందని కొత్తగూడెం DSP అబ్దుల్ రెహమాన్ తెలిపారు. కేసు ఛేదించిన సీసీఎస్ సీఐ రమాకాంత్, క్లూస్ టీం సీఐ అశోక్ కుమార్, వెంకటేశ్వర్లు, ఎస్ఐ రమాదేవిని. ఎస్పీ రోహిత్ రాజ్ అభినందించారు.
Admin
తెలుగు వెలుగు టీవీ