తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : సామాజిక సేవా కార్యక్రమాలు, పర్యావరణ పరిరక్షణతో పాటు అనేక సాంఘిక, సామాజిక అంశాలతో ముడిపడిన ఇండియన్ స్కౌట్ అండ్ గైడ్ ఫెలోషిప్(ఐ ఎస్ జీ ఎఫ్) జాతీయ సమ్మేళనంలో ఫిలిం ఫెస్టివల్ విభాగంలో జాతీయ స్థాయిలో తెలంగాణ రాష్ట్రానికి బెస్ట్ ఫిలిం ఫెస్టివల్ అవార్డు లభించింది. సామాజిక సేవా కార్యక్రమాలు, పర్యావరణ పరిరక్షణతో పాటు, నీటి వినియోగం, మానవ వనరుల పరిరక్షణ, అనేక సాంఘిక అంశాలతో ముడిపడిన ఇతి వృత్తానికి ఈ అవార్డు లభించగా, జాతీయ సమ్మేళనంలో తెలంగాణ రాష్ట్రానికి జాతీయ స్థాయిలో ఉత్తమ ఫిలిం ఫెస్టివల్ అవార్డు ను ఐఎస్ జీ ఎఫ్ ఇంటర్నేషనల్ అధ్యక్షురాలు, జస్టిస్ గీతా మిట్టల్, జాతీయ అధ్యక్షులు (వర్కింగ్) జస్టిస్ కపిలేశ్ ఝవేరి చేతుల మీదుగా అందజేశారు.మూడు రోజుల పాటు పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలోని భోల్పూర్ శాంతినికేతన్ పట్టణంలోని భారత్ సేవా ఆశ్రమం లో జరిగిన ఐ ఎస్ జిఎఫ్ జాతీయ సమ్మేళనం విజయవంతంగా ముగిసింది.తెలంగాణ రాష్ట్రానికి లభించిన ఈ ఉత్తమ ఫిలిం ఫెస్టివల్ అవార్డు ను ఐ ఎస్ జీ ఎఫ్ తెలంగాణ రాష్ట్ర కమిటీ ఉపాధ్యక్షులు, సీనియర్ జర్నలిస్ట్ లోగాని శ్రీనివాస్, కో ఆర్డినేటర్ ఖాసీం, భద్రాద్రి జిల్లా అధ్యక్షులు, రిటైర్డ్ సింగరేణి అధికారి పి. రామకృష్ణా రావు, కోశాధికారి సమ్మయ్య, సాంస్కృతిక విభాగం ప్రతినిధి శనగ రామ చందర్ రావు లు గౌరవ అతిధుల చేతుల మీదుగా అందుకున్నారు. ఈ కార్యక్రమంలో ఐ ఎస్ జి ఎఫ్ జాతీయ అధ్యక్షుడు (ఎగ్జిక్యూటివ్ విభాగం ) మ్యాక్ మిక్కీ, సెక్రటరీ జనరల్ సీమా రాఠి, కోశాధికారి, మరియు ఇండియా ప్రతిష్టాత్మక బుల్లెట్ ట్రైన్ ప్రాజెక్టు జనరల్ మేనేజర్ (ఫైనాన్స్ ) పద్మిని పిళ్ళయ్ తదితరులు పాల్గొన్నారు. ఫెలో షిప్ బజార్, క్యాంప్ ఫైర్ ఆకట్టు కున్నాయి.బోల్ పూర్ లోని రవీంద్రనాథ్ ఠాగూర్ నివసించిన ఇల్లు, స్థాపించిన శాంతి నికేతన్, విశ్వ విద్యాలయం, ఎకో పార్క్, రవీంద్ర నాధ్ ఠాగూర్ మ్యూజియం తదితర ప్రాంతాల సందర్శన అన్ని రాష్ట్రాల నుంచి వచ్చిన వారిని ఉత్తేజ పరిచింది.
Admin
తెలుగు వెలుగు టీవీ