తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో మీసేవ సేవలను మరింత పారదర్శకంగా, వేగవంతంగా, ప్రజలకు సులభతరంగా అందించేందుకు ప్రభుత్వం పలు చర్యలు చేపట్టిందని జిల్లా అదనపు కలెక్టర్ వేణుగోపాల్ ఒక ప్రకటనలో తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా ఆదాయ, కుల, నివాస, కుటుంబ సభ్యుల ధృవపత్రాలు, ఇబీసీ , ఓబీసీ తదితర సేవల ధృవీకరణ కోసం ఈ ఎస్ డి అభివృద్ధి చేసిన GPOs & MRIs Verification Mobile Application అమలులో ఉన్నదని తెలిపారు. ఈ యాప్ ద్వారా సంబంధిత అధికారులు మీసేవ దరఖాస్తు వివరాలు, అప్లోడ్ చేసిన పత్రాలను ఆన్లైన్లో పరిశీలించి, అర్హత ఆధారంగా ఆమోదం లేదా తిరస్కరణ నిర్ణయాలు తీసుకునే విధానం అమల్లో ఉన్నదన్నారు. ఈ నేపథ్యంలో మీసేవ దరఖాస్తుల పరిశీలన కోసం ప్రజల నుండి ఎలాంటి భౌతిక పత్రాలను స్వీకరించరాదని స్పష్టం చేశారు. మండల, గ్రామ స్థాయిలో విధులు నిర్వహిస్తున్న అధికారులు కూడా భౌతిక పత్రాలను కోరరాదని సి సి ఎల్ ఏ కార్యాలయం ఇప్పటికే స్పష్టమైన ఆదేశాలు జారీ చేసినట్లు తెలిపారు. ప్రజలు మీసేవ దరఖాస్తులకు సంబంధించిన పత్రాలను ఆన్లైన్లో అప్లోడ్ చేసిన అనంతరం ఎలాంటి భౌతిక పత్రాలను అధికారులకు లేదా సిబ్బందికి అందజేయవద్దని సూచించారు. జిల్లా పరిపాలన ఈ ఆదేశాలను కచ్చితంగా అమలు చేయాలని సంబంధిత అధికారులకు సూచనలు జారీ చేసినట్లు తెలిపారు. ప్రజలకు వేగవంతమైన, పారదర్శకమైన, ఇబ్బందుల్లేని సేవలు అందించడమే ప్రభుత్వ లక్ష్యమని పేర్కొన్నారు. మీసేవ సేవలకు సంబంధించిన సమస్యలు ఎదురైనట్లయితే సంబంధిత మండల అధికారులను లేదా జిల్లా మీసేవ మేనేజర్లను సంప్రదించాలని సూచించారు. సంప్రదించవలసిన ఫోన్ నంబర్లు : కృష్ణమూర్తి – 9133122022 రాకేష్ – 9000420792 ఈ -డిస్ట్రిక్ట్ మేనేజర్ సైదేశ్వర రావు – 7337340825 ను కూడా సంప్రదించవచ్చని తెలిపారు
Admin
తెలుగు వెలుగు టీవీ