Tuesday, 26 May 2026 11:23:40 PM
# సిపిఐ జిల్లా కార్యాలయంలో ఘనంగా గిరిప్రసాద్ 29వ వర్ధంతి. # జర్నలిస్టుల హక్కుల రక్షణకు, సమస్యల పరిష్కారానికి నిరంతరం పోరాడాలి. సిపిఐ రాష్ట్ర కార్యదర్శి, కొత్తగూడెం శాసనసభ్యులు కూనంనేని సాంబశివరావు. # ప్రజావాణికి అధికారులు సకాలంలో హాజరు కావాలి : జిల్లా కలెక్టర్ అంకిత్. # రేషన్ డీలర్ల జిల్లా స్థాయి సమావేశంలో ముఖ్య అతిధిగా పాల్గొన్న ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు. # ఎండ తీవ్రత ప్రాంతాల్లో రోడ్లపై నీళ్లు చల్లాలి. సింగరేణి యాజమాన్యం నిర్లక్ష్య వైఖరి ఎండ తీవ్రత కారణం. 16వ డివిజన్ కార్పొరేటర్ మునిగడప పద్మ డిమాండ్. # దళితుల అభ్యున్నతికి విశేష కృషి చేసిన మహనీయుడు భాగ్యరెడ్డి వర్మ : జిల్లా కలెక్టర్ అంకిత్. # జనగణన హౌస్ లిస్టింగ్‌లో ఖచ్చితత్వానికి ప్రాధాన్యం ఇవ్వాలి - డైరెక్టర్ ఆఫ్ సెన్సస్ భారతి హోలీకేర్. # కాంట్రాక్ట్ కార్మికులకు పెండింగ్ సర్క్యులర్స్ ను విడుదల చేయాలి. ఏఐటీయూసీ కొత్తగూడెం రీజియన్ కార్యదర్శి యర్రగాని కృష్ణయ్య. # ఉద్యోగులు సమయపాలన పాటించాలి. ఐడీఓసీ కార్యాలయంలోని వివిధ శాఖలను ఆకస్మికంగా తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్ అంకిత్. # చండ్రుగొండ మండల కేంద్రం బస్ స్టేషన్ లో ని మరమ్మతు ల పనులను పరిశీలించిన అశ్వరావుపేట నియోజకవర్గ శాసనసభ్యులు జారే ఆదినారాయణ # 23వ డివిజన్లో ముఖ్య కార్యకర్తల సమావేశం. టీపీసీసీ జనరల్ సెక్రటరీ నాగా సీతారాములు పిలుపు. # ప్రజా ఆరోగ్యం పరిరక్షణకు ప్రతి ఒక్కరూ నడుం బిగించాలి. సిపిఐ జిల్లా కార్యదర్శి ఎస్ కె సాబీర్ పాషా. # ఓటర్ల జాబితా సమగ్ర సవరణకు పార్టీ శ్రేణులు సహకరించాలి. సిపిఐ జిల్లా కార్యదర్శి ఎస్ కె సాబీర్ పాషా. # ఉపాధి హామీ నిధులతో చేపట్టిన పనులను వేగవంతం చేయాలి. ఉపాధి హామీ కూలీల సంఖ్యను పెంచాలి : జిల్లా కలెక్టర్ అంకిత్. # రైతులకు ఇబ్బందులు లేకుండా మొక్కజొన్న కొనుగోళ్లు చేపడుతున్నాం - జిల్లా కలెక్టర్ అంకిత్. # కాంగ్రెస్ పార్టీ 21 వ డివిజన్ ముఖ్య కార్యకర్తల సమావేశం. తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి నాగా సీతారాములు పిలుపు. # జిల్లా పోలీస్ హెడ్ క్వార్టర్స్ నందు గల పోలీస్ ఫైరింగ్ రేంజ్ నందు జిల్లాలోని పోలీసు అధికారులు,సిబ్బందికి యాన్యువల్ ఫైరింగ్ ప్రాక్టీస్. # ప్రాణాపాయ స్థితిలో 8 ఏళ్ల బాలుడు. దాతల సహాయం కోసం తల్లిదండ్రుల వేడుకోలు. # చండ్రుగొండ మండలం, దామెరచర్లలో ఆగ్రహించిన అన్నదాత. # ఫిట్ అండ్ యాక్టివ్ తెలంగాణ 2K రన్‌లో ఉత్సాహంగా పాల్గొన్న ఎమ్మెల్యే జారె.

మీసేవ సేవల ధృవీకరణకు భౌతిక పత్రాలు అవసరం లేదు- ఆన్‌లైన్‌లో అప్లోడ్ చేసిన పత్రాలనే పరిశీలించాలి- జిల్లా అదనపు కలెక్టర్ వేణుగోపాల్

Date : 25 May 2026 05:57 PM Views : 19

తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో మీసేవ సేవలను మరింత పారదర్శకంగా, వేగవంతంగా, ప్రజలకు సులభతరంగా అందించేందుకు ప్రభుత్వం పలు చర్యలు చేపట్టిందని జిల్లా అదనపు కలెక్టర్ వేణుగోపాల్ ఒక ప్రకటనలో తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా ఆదాయ, కుల, నివాస, కుటుంబ సభ్యుల ధృవపత్రాలు, ఇబీసీ , ఓబీసీ తదితర సేవల ధృవీకరణ కోసం ఈ ఎస్ డి అభివృద్ధి చేసిన GPOs & MRIs Verification Mobile Application అమలులో ఉన్నదని తెలిపారు. ఈ యాప్ ద్వారా సంబంధిత అధికారులు మీసేవ దరఖాస్తు వివరాలు, అప్లోడ్ చేసిన పత్రాలను ఆన్‌లైన్‌లో పరిశీలించి, అర్హత ఆధారంగా ఆమోదం లేదా తిరస్కరణ నిర్ణయాలు తీసుకునే విధానం అమల్లో ఉన్నదన్నారు. ఈ నేపథ్యంలో మీసేవ దరఖాస్తుల పరిశీలన కోసం ప్రజల నుండి ఎలాంటి భౌతిక పత్రాలను స్వీకరించరాదని స్పష్టం చేశారు. మండల, గ్రామ స్థాయిలో విధులు నిర్వహిస్తున్న అధికారులు కూడా భౌతిక పత్రాలను కోరరాదని సి సి ఎల్ ఏ కార్యాలయం ఇప్పటికే స్పష్టమైన ఆదేశాలు జారీ చేసినట్లు తెలిపారు. ప్రజలు మీసేవ దరఖాస్తులకు సంబంధించిన పత్రాలను ఆన్‌లైన్‌లో అప్లోడ్ చేసిన అనంతరం ఎలాంటి భౌతిక పత్రాలను అధికారులకు లేదా సిబ్బందికి అందజేయవద్దని సూచించారు. జిల్లా పరిపాలన ఈ ఆదేశాలను కచ్చితంగా అమలు చేయాలని సంబంధిత అధికారులకు సూచనలు జారీ చేసినట్లు తెలిపారు. ప్రజలకు వేగవంతమైన, పారదర్శకమైన, ఇబ్బందుల్లేని సేవలు అందించడమే ప్రభుత్వ లక్ష్యమని పేర్కొన్నారు. మీసేవ సేవలకు సంబంధించిన సమస్యలు ఎదురైనట్లయితే సంబంధిత మండల అధికారులను లేదా జిల్లా మీసేవ మేనేజర్లను సంప్రదించాలని సూచించారు. సంప్రదించవలసిన ఫోన్ నంబర్లు : కృష్ణమూర్తి – 9133122022 రాకేష్ – 9000420792 ఈ -డిస్ట్రిక్ట్ మేనేజర్ సైదేశ్వర రావు – 7337340825 ను కూడా సంప్రదించవచ్చని తెలిపారు

telugu velugu

Admin

తెలుగు వెలుగు టీవీ

మరిన్ని వార్తలు

Copyright © Telugu Velugu TV 2026. All right Reserved.



Developed By :