తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : ఏఐటియుసి ప్రధాన కార్యదర్శి కొరిమి రాజ్ కుమార్ వెల్లడి.సింగరేణి లో అనారోగ్యం తో మెడికల్ అన్ ఫిట్ ఐన మైనింగ్ స్టాప్, ట్రేడ్స్ మెన్ లకు ఏఐటియుసి కృషి వల్ల సర్ఫేస్ లో సూటబుల్ జాబ్ ఇచ్చేందుకు సింగరేణి యాజమాన్యం గురువారం ఆదేశాలు జారీ చేసిందని సింగరేణి కాలరీస్ వర్కర్స్ యూనియన్ ఎఐటియుసి ప్రధాన కార్యదర్శి కొరిమి రాజ్ కుమార్ ఒక ప్రకటన లో పేర్కొన్నారు. సింగరేణి లో గతంలో గుర్తింపు సంఘం గా ఉన్న ఏఐటియుసి హయాం లో అనారోగ్యం తో మెడికల్ అన్ ఫిట్ ఐన మైనింగ్ స్టాప్, ట్రేడ్స్ మెన్స్ కు సర్ఫేస్ లో సూటబుల్ జాబ్ ఇచ్చే వారని, కాని 2018 మార్చి నుంచి దానిని నిలిపి వేసి సర్ఫేస్ లో జనరల్ మజ్దూర్, క్యాటగిరి వన్ లో పోస్టింగ్ ఇవ్వడం జరిగిందని, దీని వల్ల సింగరేణి లో చాలా మంది మైనింగ్ స్టాప్, ట్రేడ్స్ మెన్స్ చాలా మానసికంగా, ఆర్థికంగా నష్టపోయారని, దీనికి కారణం అప్పటి గుర్తింపు సంఘం టిబిజికెఎస్ యాజమాన్యం అవలంబించిన కార్మిక వ్యతిరేక విధానాలను అడ్డుకోవడం లో వైఫల్యం చెందినందునే మైనింగ్ స్టాప్, ట్రేడ్స్ మెన్స్ కు తీవ్ర నష్టం వాటిల్లిందని ఆయన పేర్కొన్నారు. ఎన్నో సార్లు వీరి గురించి ఏఐటియుసి అనేక విధాలుగా ఆందోళన కార్యక్రమాలు, పోరాటాలు మరియు మైనింగ్ స్టాప్, ట్రేడ్స్ మెన్స్ చేసిన ఆందోళనల కు ఏఐటియుసి అండగా నిలిచినప్పటికిని టిబిజికేఎస్ సంఘం యాజమాన్యం పై ఒత్తిడి చేయడం లో వైఫల్యం చెందిందని ఆయన పేర్కొన్నారు. సింగరేణి లో 2023 లో జరిగిన గుర్తింపు సంఘం ఎన్నికల్లో మైనింగ్ స్టాప్ కు, ట్రేడ్స్ మెన్ లకు అండర్ గ్రౌండ్ లో అన్ ఫిట్ ఐన వారికి సూటబుల్ జాబ్ ఇప్పిస్తామని ఏఐటియుసి ఇచ్చిన హామీ మేరకు యాజమాన్యం పై ఒత్తిడి చేసి నవంబర్ 28,2024 న జరిగిన డైరెక్టర్ ఫా స్థాయి స్ట్రక్చర్ కమిటీ సమావేశం మరియు మార్చి 7, 2025 న సి అండ్ ఎండి స్థాయి సమావేశం లో పట్టుబట్టి గత ఒప్పందం ను అమలు చేయాలని డిమాండ్ చేయడం జరిగిందని ఆయన పేర్కొన్నారు. యాజమాన్యం దీనిపై అంగీకరించి ఒక కమిటీ వేసి పరిష్కారం చేయడం జరిగిందని ఆయన పేర్కొన్నారు. ఈ కమిటీ ఇచ్చిన నివేదిక ప్రకారం గా అనగా మార్చి 2018 నుండి జూలై 2025 వరకు జరిగిన కార్పొరేట్ మెడికల్ బోర్డు లో అండర్ గ్రౌండ్ లో అన్ ఫిట్ ఐన మైనింగ్ స్టాప్, ట్రేడ్స్ మెన్స్ కు సర్ఫేస్ లో సూటబుల్ జాబ్ ఇచ్చేందుకు యాజమాన్యం గురువారం ఆదేశాలు జారీచేసిందని ఆయన పేర్కొన్నారు, ఇది ఏఐటియుసి సాధించిన ఘనత అని ఆయన పేర్కొన్నారు. ఏఐటియుసి ఎన్నికల్లో ఇచ్చిన హామీలను వరుసగా ఒకటొకటిగా గా అమలు చేసేందుకు కృషి చేస్తుందని ఆయన పేర్కొన్నారు. కొన్ని కార్మిక సంఘాలు ఏఐటియుసి పై అనవసరపు విమర్షలు చేస్తూ కార్మికుల ను తప్పు దోవ పట్టిస్తున్నారని ఆయన పేర్కొన్నారు. అదే విధంగా మిగతా సమస్యల పరిష్కారం కోసం కృషి చేయడం జరుగుతుందని ఆయన తెలిపారు.
Admin
తెలుగు వెలుగు టీవీ