తెలుగు వెలుగు టీవీ - వార్తలు / ఇల్లందు : యువత, విద్యార్ధులు చెడు వ్యసనాలకు బానిసలు కాకుండా ఉన్నత లక్ష్యాలు ఏర్పాటు చేసుకుని ముందుకు సాగాలని డి.ఎస్.పి చంద్రభాను అన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నీ స్ఫూర్తిగా తీసుకొని మారకద్రవ్యాలకు నిర్మూలన కార్యక్రమాన్ని స్థానిక ఇల్లందు గ్రంథాలయంలో ఏర్పాటు చేసిన అవగాహన కార్యక్రమానికి ఆయన ముఖ్యాతిధిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా డి.ఎస్.పి చంద్రభాను గారు తో పాటు జిల్లా గ్రంథాలయ చైర్మన్ పసుపులేటి వీరబాబు మాట్లాడుతూ డ్రగ్స్ నిర్మూలన కోసం జరుగుతున్న పోరా టంలో ప్రతీ ఒక్కరూ భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. విద్యా ర్ధుల దృష్టి తమ భవిష్యత్, లలక్ష్యంపై మాత్రమే ఉండాలని, నిషేదిక గంజాయి, డ్రగ్స్, ఇతర మత్తుపదార్థాల వాడకం పట్ల విద్యార్థులు, యువత ఆకర్షితులు కావద్దన్నారు. గంజాయి, డ్రగ్స్ అలవాటు వల్ల శరీరక, మానసిక వ్యాధులు వస్తాయని, మాదకద్రావ్యల నిర్మూలన, గంజాయి రహిత జిల్లా లక్ష్యంగా పోలీస్ శాఖ కృషి చేస్తోందన్నారు.
Admin
తెలుగు వెలుగు టీవీ