Sunday, 19 April 2026 03:14:30 PM
# గిరిజన ప్రాంతాలకు వైద్య సేవల్లో నూతన దిశగా ప్రభుత్వం కీలక ముందడుగు. # భద్రాచలం ఏఎస్పీ విక్రాంత్ కుమార్ సింగ్ ఆధ్వర్యంలో.. జిల్లా పోలీస్ హెడ్ క్వార్టర్స్ నందు Prosecution Review Committee (PRC) సమావేశం నిర్వహించబడింది. # చండ్రుగొండలో మూతపడ్డ పెట్రోల్ బంకులు. # పాలిసెట్ ప్రవేశ పరీక్షకు ఉచిత శిక్షణా తరగతులు – రుద్రంపూర్ ప్రభుత్వ పాలిటెక్నిక్. # ప్రతి ఒక్కరూ ట్రాఫిక్ నియమాలను పాటిస్తూ రోడ్డు ప్రమాదాలను నియంత్రించడంలో బాధ్యతగా వ్యవహరించాలి : డిఎస్పీ ఆదినారాయణ. # 6 నెలలుగా డాక్టర్ లేని ప్రభుత్వ హోమియో వైద్యశాల. # ఆరోగ్య సూత్రాలు పాటించండి శ్రమదానం చేయండి ఆరోగ్యంగా ఉండండి. Dr తుకారాం రాథోడ్ DMHO # బాల్యవివాహాలను అంతం చేద్దాం - ఆడపిల్లలకు బంగారు భవిష్యత్తును అందిద్దాం. # మానవత్వం చాటుకున్న సుజాతనగర్ ఎస్సై రమాదేవి. # సిపిఐ శాఖ సెక్రటరీ కీసరి రాఘవలు"పార్థివ దేహం" నివాళులు ఆర్పించిన సిపిఐ జిల్లా సెక్రటరీ సాబీర్ పాషా. # చిన్న చిన్న నిర్లక్ష్యాలే పెద్ద ప్రమాదాలకు దారితీస్తాయి.ప్రతి ఒక్కరూ కచ్చితంగా రోడ్డు భద్రతా నియమాలను పాటించాలి: ఎస్పీ రోహిత్ రాజు. # అశ్వరావుపేటలో రెండు 33/11 కేవీ విద్యుత్ ఉపకేంద్రాలకు శంకుస్థాపన. రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క మల్లు. # ఘనంగా అంబేద్కర్ 135వ జయంతి వేడుకలు # సమ్మర్ గేమ్స్ కోచింగ్ క్యాంప్ ప్రారంభించిన ఎమ్మెల్యే జారె. # సింగరేణి హెడ్ ఆఫీస్ వద్ద ఘనంగా రాజ్యాంగ నిర్మాత జయంతి. అంబేద్కర్ చిత్రపటానికి పుష్పాంజలి ఘటించిన ప్రముఖులు. # అంగన్వాడీల అభివృద్దె మా లక్ష్యం.వైరా ఎమ్మెల్యే రాందాస్ నాయక్.అంగన్వాడీ టీచర్లకు స్మార్ట్ ఫోన్ల పంపిణీ.దివ్యాంగులకు సహాయ ఉపకరణాల పంపిణీ. వైరా ఎమ్మెల్యే # జీవితం విలువైనది భద్రత మన బాధ్యత. ర్యాలీ ని ఉద్దేశించి మాట్లాడుతున్న 16 వ డివిజన్ కార్పొరేటర్ మునగడప పద్మ. # అశ్వాపురం ప్రభుత్వ జూనియర్ కళాశాల విద్యార్థిని 973 మార్కులతో ఓంకారిణి టాప్. # ఉపముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క పర్యటన ఏర్పాట్లను పరిశీలించిన ఎమ్మెల్యే జారె. # సెన్సస్ పనులను నిర్ణీత గడువులోపు పూర్తి చేయాలి: జిల్లా కలెక్టర్ జిల్లా కలెక్టర్ అంకిత్.

రైతులకు శాపంగా మారిన భూ భారతి చట్టం.. బిజెపి జిల్లా నాయకులు భూక్య రాజేష్ నాయక్.

Date : 07 March 2026 08:16 PM Views : 364

తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : భారతీయ జనతా పార్టీ జిల్లా నాయకుడు భూక్య రాజేష్ నాయక్ మాట్లాడుతూ భూభారతి చట్టం రైతుల పాలిట శాపంగా మారిందని రైతులకు వ్యవసాయం చేసుకోవడానికి ఏమాత్రం అవకాశం లేకుండా చేస్తున్నటువంటి రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గారు తీసుకొచ్చిన భూ భారతి చట్టంలో నీ లోపాల వలన ఇప్పటివరకు మండల వ్యాప్తంగా ఏ ఒక్క రైతుకు కూడాను పట్టా పాస్ బుక్కులు పొందలేకాపోయారు . సాదా బై నామ పేరుతో రైతుల ఉసురు తీస్తున్నారు. ఒకపక్క రైతు బంధు రైతు, భరోసా ఎగుడుతూ మరోపక్క రైతులు వ్యవసాయానికి పనికి వచ్చేటటువంటి యూరియాను పొందలేక వ్యవసాయంలో నష్టాలను చవి చూడాల్సి వస్తుంది. పోనీ ఎవరికైనా వారి భూమి అత్యవసరం నిమిత్తం అమ్ముకుందామంటే వారికి పట్టా కూడా లేకుండా పోతున్నాయి. దీనంతటికీ కారణం రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్నటువంటి భూ భారతి చట్టం. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని సుజాతనగర్ మండలాన్ని పైలట్ ప్రాజెక్టుగా ఎంపిక చేసి, కలెక్టర్ స్వయంగా ప్రారంభించి రైతుల దగ్గర నుంచి పట్టాకు సంబంధించిన పాత పహనీలు, జిరాక్స్లు, అన్నియును కూడా తీసుకొని సంవత్సరం నర కాలం గడుస్తున్న ఇంతవరకు ఏ ఒక్కరికి ఒక పట్టా పాస్ బుక్ కూడా మంజూరు చేయలేదు. మండల వ్యాప్తంగా అనేక మంది రైతులు వారి సొంత భూమిలో వ్యవసాయం చేసుకోవడానికి కూడా ఇబ్బంది పడాల్సిన పరిస్థితి ఏర్పడింది. దీనికంటే గతంలో ఉన్నటువంటి ధరణి అయిన కాస్త నయం అనే పరిస్థితికి రైతులు వచ్చారు. పైలెట్ ప్రాజెక్టుగా ఎంపిక చేసిన మండలం పరిస్థితే ఇలా ఉంటే, ఇంకా మిగిలిన మండలాలు వాటి పరిస్థితి ఇంకెలా ఉంటుందో అని ప్రభుత్వం తీరును విమర్శించారు. దీనికి తోడు రైతు భరోసాను అమలు చేయకుండా శాటిలైట్ ద్వారా సర్వే అని చెప్పి, ఫర్టిలైజర్ యాప్ ద్వారా యూరియా బుకింగ్ అనీ రైతులకు తీవ్ర అన్యాయానికి గురిచేస్తున్నారు. పాస్ బుక్కు లేని రైతులు యూరియాను ఎలా ఆన్లైన్ చేసుకుంటారు అని ఎద్దేవా చేశారు. వ్యవసాయ సీజన్ అంతా అయిపోతున్న కూడా ఇంతవరకు రైతులకు రైతుబంధు నిధులు విడుదల చేయలేదు. రైతు లేనిదే రాజ్యం లేదు . అలాంటిది రైతులకు దగా చేస్తున్నటువంటి ఈ రాష్ట్ర ప్రభుత్వం, ఈ జిల్లా మంత్రులు తక్షణమే ఈ యొక్క భూభారతి లో నమోదైనటువంటి పట్టాలను వెంటనే మంజూరు చేసి, వాటికి రైతు భరోసాను అమలు చేయాలని డిమాండ్ చేశారు.

telugu velugu

Admin

తెలుగు వెలుగు టీవీ

మరిన్ని వార్తలు

Copyright © Telugu Velugu TV 2026. All right Reserved.



Developed By :