తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటేల్ జ్యోతి ప్రజ్వలన చేసి నెహ్రూ మరియు ఎస్ ఆర్ రంగనాథన్ల చిత్రపటానికి పూలమాలవేసి జ్యోతిని వెలిగించి నివాళి అర్పించారు. ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహించిన పసుపులేటి వీరబాబు గ్రంథాలయ వారోత్సవాల సందర్భంగా మొదటి రోజు పిల్లల దినోత్సవం చిన్నారులు ఆటపాటలతో అల్లరించారు ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ గ్రంథాలయాలు తాను చదువుకునే రోజుల్లో ఎంతగానో ఉపయోగపడినవని ఇలాంటి మౌలిక సదుపాయాలు నా చిన్నతనములో లేవని ఈ రోజులు ఇన్ని సదుపాయాలు ఉన్న గ్రంథాలయాలు ప్రతి ఒక్క విద్యార్థిని విద్యార్థులకు జ్ఞానాన్ని సంపాదించుటకు అన్ని విధాలా తోడ్పడుతున్నాయని ఇంటర్నెట్లు వైఫైలు కంటే పుస్తక జ్ఞానం అనేది చాలా ముఖ్యమని పుస్తకాల ద్వారానే విజ్ఞానం దొరుకుతుందని వాటిని మన నిత్యజీవితంలో ఒక అలవాటుగా చేసుకోవాలని చెప్పారు అదేవిధంగా గ్రంథాల మౌలిక సదుపాయాల కోసం అన్ని విధాల సహాయ సహకారాలు అందిస్తానని గ్రంథాలయాల అభివృద్ధికి తన వంతు బాధ్యతను అందిస్తానని తెలియజేశారు ఈ కార్యక్రమంలో ఆఫీస్ ఇంచార్జ్ నవీన్ కుమార్ గ్రంథ పాలకురాలు జి మణిమృదుల, శాఖ గ్రంథ పాలకులు మధుబాబు వాణి జానీ రుక్మిణి పాల్గొన్నారు వివిధ పాఠశాల నుంచి విద్యార్థినీ విద్యార్థులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు ఈరోజు నుంచి ప్రారంభమయ్యే గ్రంథాలయ వారోత్సవాలు 20వ తారీకు వరకు వివిధ కార్యక్రమాలతో జరగనుంది.
Admin
తెలుగు వెలుగు టీవీ