తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : సాదా బైనామా, రీ-సర్వే ప్రక్రియలను గడువులోగా పూర్తి చేయాలి.రెవెన్యూ సేవలను ప్రజలకు పారదర్శకంగా అందించాలి.భూధార్ సర్వే, భూభారతి దరఖాస్తుల పరిష్కారాన్ని వేగవంతం చేయాలని, సాదా బైనామా, నాన్-కడాస్ట్రల్ గ్రామాల రీ-సర్వే ప్రక్రియలను నిర్దేశిత గడువులోగా పూర్తి చేయాలని రాష్ట్ర రెవెన్యూ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ డి.ఎస్. లోకేష్ కుమార్ అధికారులను ఆదేశించారు. రెవెన్యూ సేవలను ప్రజలకు పారదర్శకంగా, వేగవంతంగా అందించేందుకు అధికారులు ప్రత్యేక దృష్టి సారించాలని సూచించారు. శుక్రవారం హైదరాబాద్ నుండి పలు జిల్లాల కలెక్టర్లతో భూధార్ సర్వే, భూభారతి, సాదా బైనామా దరఖాస్తుల పరిష్కారం, నాన్-కడాస్ట్రల్ గ్రామాల రీ-సర్వే, నక్షా కార్యక్రమం తదితర అంశాలపై నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్ సమావేశంలో ఆయన సమీక్ష నిర్వహించారు. జిల్లాల వారీగా పురోగతిని పరిశీలిస్తూ పెండింగ్లో ఉన్న అంశాలను త్వరితగతిన పూర్తి చేయాలని ఆదేశించారు.ఈ వీడియో కాన్ఫరెన్స్ సమావేశానికి ఐడీఓసీ కాలనీలోని కలెక్టర్ క్యాంపు కార్యాలయం నుండి జిల్లా కలెక్టర్ అంకిత్ హాజరయ్యారు. జిల్లాలో భూధార్ సర్వే, భూభారతి దరఖాస్తుల పరిష్కారం, రీ-సర్వే, నక్షా కార్యక్రమాల పురోగతిపై వివరాలను రాష్ట్ర అధికారులకు నివేదించారు.ఈ సమావేశంలో ల్యాండ్ సర్వే ఏడీ శ్రీనివాసరావు, మణుగూరు మున్సిపల్ కమిషనర్ ప్రసాద్రావు తదితర అధికారులు పాల్గొన్నారు.
Admin
తెలుగు వెలుగు టీవీ