Monday, 20 April 2026 01:44:21 PM
# అశ్వారావుపేట నియోజకవర్గ మాజీ MLA,BRS పార్టీ ఇంచార్జ్ మెచ్చా నాగేశ్వరరావు నేడు అశ్వారావుపేట మండలంలో విస్తృతంగా పర్యటించారు. # వైద్య ఖర్చులకు లక్ష రూపాయల ఎల్ఓసి మంజూరు చేసిన ఎమ్మెల్యే జారె. # మహా కుంభాభిషేకానికి రావాల్సిందిగా మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డిని ఆహ్వానించిన ఎమ్మెల్యే జారె. # గిరిజన ప్రాంతాలకు వైద్య సేవల్లో నూతన దిశగా ప్రభుత్వం కీలక ముందడుగు. # భద్రాచలం ఏఎస్పీ విక్రాంత్ కుమార్ సింగ్ ఆధ్వర్యంలో.. జిల్లా పోలీస్ హెడ్ క్వార్టర్స్ నందు Prosecution Review Committee (PRC) సమావేశం నిర్వహించబడింది. # చండ్రుగొండలో మూతపడ్డ పెట్రోల్ బంకులు. # పాలిసెట్ ప్రవేశ పరీక్షకు ఉచిత శిక్షణా తరగతులు – రుద్రంపూర్ ప్రభుత్వ పాలిటెక్నిక్. # ప్రతి ఒక్కరూ ట్రాఫిక్ నియమాలను పాటిస్తూ రోడ్డు ప్రమాదాలను నియంత్రించడంలో బాధ్యతగా వ్యవహరించాలి : డిఎస్పీ ఆదినారాయణ. # 6 నెలలుగా డాక్టర్ లేని ప్రభుత్వ హోమియో వైద్యశాల. # ఆరోగ్య సూత్రాలు పాటించండి శ్రమదానం చేయండి ఆరోగ్యంగా ఉండండి. Dr తుకారాం రాథోడ్ DMHO # బాల్యవివాహాలను అంతం చేద్దాం - ఆడపిల్లలకు బంగారు భవిష్యత్తును అందిద్దాం. # మానవత్వం చాటుకున్న సుజాతనగర్ ఎస్సై రమాదేవి. # సిపిఐ శాఖ సెక్రటరీ కీసరి రాఘవలు"పార్థివ దేహం" నివాళులు ఆర్పించిన సిపిఐ జిల్లా సెక్రటరీ సాబీర్ పాషా. # చిన్న చిన్న నిర్లక్ష్యాలే పెద్ద ప్రమాదాలకు దారితీస్తాయి.ప్రతి ఒక్కరూ కచ్చితంగా రోడ్డు భద్రతా నియమాలను పాటించాలి: ఎస్పీ రోహిత్ రాజు. # అశ్వరావుపేటలో రెండు 33/11 కేవీ విద్యుత్ ఉపకేంద్రాలకు శంకుస్థాపన. రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క మల్లు. # ఘనంగా అంబేద్కర్ 135వ జయంతి వేడుకలు # సమ్మర్ గేమ్స్ కోచింగ్ క్యాంప్ ప్రారంభించిన ఎమ్మెల్యే జారె. # సింగరేణి హెడ్ ఆఫీస్ వద్ద ఘనంగా రాజ్యాంగ నిర్మాత జయంతి. అంబేద్కర్ చిత్రపటానికి పుష్పాంజలి ఘటించిన ప్రముఖులు. # అంగన్వాడీల అభివృద్దె మా లక్ష్యం.వైరా ఎమ్మెల్యే రాందాస్ నాయక్.అంగన్వాడీ టీచర్లకు స్మార్ట్ ఫోన్ల పంపిణీ.దివ్యాంగులకు సహాయ ఉపకరణాల పంపిణీ. వైరా ఎమ్మెల్యే # జీవితం విలువైనది భద్రత మన బాధ్యత. ర్యాలీ ని ఉద్దేశించి మాట్లాడుతున్న 16 వ డివిజన్ కార్పొరేటర్ మునగడప పద్మ.

గ్రీవెన్స్ లో కొన్ని ఫిర్యాదులు.

Date : 28 July 2025 07:17 PM Views : 473

తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొనిజర్ల : ప్రజావాణి కార్యక్రమంలో వచ్చిన ప్రతి దరఖాస్తును క్షుణ్ణంగా పరిశీలించి వాటి పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని అదనపు కలెక్టర్ వేణుగోపాల్ సంబంధిత అధికారులను ఆదేశించారు.సోమవారం ఐడిఓసి కార్యాలయ సమావేశ మందిరంలో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ విద్యా చందనతో కలిసి ప్రజావాణి నిర్వహించి జిల్లాలోని వివిధ ప్రాంతాల నుండి వచ్చిన ప్రజల సమస్యల పరిష్కారానికి సంబంధిత అధికారులకు ఎండార్స్ చేశారుటేకులపల్లి మండలానికి చెందిన వాంకుడోత్ అశోక్ తాను బిఎస్సి అగ్రికల్చర్ పూర్తి చేసి ఉన్నానని జిల్లాలోని ఏటీఎంఏ ( అగ్రికల్చర్ టెక్నాలజీ మేనేజ్మెంట్ ఏజెన్సీ) నందు ఔట్సోర్సింగ్ పరిధిలో ఒక పోస్టుని తనకు ఇప్పించగలరని చేసిన దరఖాస్తును పరిశీలించి తగు చర్యలు నిమిత్తం జిల్లా వ్యవసాయ శాఖ అధికారికి ఎండార్స్ చేశారు.జూలూరుపాడు మండలం సాయిరాం తండా కు చెందిన గుగులోతు వీరు తన కుటుంబ సభ్యులతో కలిసి తాటాకు ఇంటిలో నివాసం ఉంటున్నానని తేదీ. 26/2/2025 న కరెంటు షార్ట్ సర్క్యూట్ కారణంగా తన ఇల్లు పూర్తిగా దగ్ధమై పిల్లల సర్టిఫికెట్స్, భూమి కాగితాలు, నగదు అన్ని దగ్గం అయ్యాయని తాము నివసించడానికి నివాసం లేక ఇబ్బంది పడుతున్నామని డిజాస్టర్ మేనేజ్మెంట్ కింద ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేయగలరని చేసిన దరఖాస్తును పరిశీలించి తగు చర్య నిమిత్తం హౌసింగ్ పీడీ అధికారి గారికి ఎండార్స్ చేశారు.ఇల్లందుకు చెందిన పోకల రాధ తన తల్లి పోకల కోటమ్మ, గతంలో తల్లి పేరు మీద గృహపట్టా మంజూరయ్యిందని, (పట్టా నంబర్: 211). ప్రస్తుతం తన తల్లిదండ్రులు ఇద్దరూ మరణించగా, ఒంటరిగా ఉన్న తనను వారసురాలిగా గుర్తించి, వారసత్వ చట్ట ప్రకారం తమ ఇంటికి సంబంధించి గృహ పట్టాను తన పేరపై మంజూరు చేయవలసిందిగా కోరుతూ చేసిన దరఖాస్తును పరిశీలించి, తగిన చర్యలు నిమిత్తం ఇల్లందు తహసీల్దార్‌కు ఎండార్డ్‌ చేయబడింది.మణుగూరు కు చెందిన బత్తుల రాములు సర్వే నెంబర్ 138/1559 లో ఒక ఎకరం 20 కుంటల భూమి ఉన్నదని దానికి రైతు భరోసా డబ్బులు కూడా వస్తున్నాయని అట్టి పొలం ప్రభుత్వ మెడికల్ కళాశాల ఏర్పాటులో పోతున్నదని తనకు వ్యవసాయమే జీవనాధారంమని, కావున తన భూమిని తనకు ఇప్పించగలరని చేసిన దరఖాస్తును పరిశీలించి తగు చర్య నిమిత్తం మణుగూరు తాసిల్దారు కు ఎండార్స్ చేశారు. జూలూరుపాడు మండలం అనంతారం గ్రామానికి చెందిన గడిగ వెంకటేశ్వర్లు తన కుమారుడు గడిగ జస్వంత్ ఎనిమిదో తరగతి చదువుటకు చుంచుపల్లి బీసీ వెల్ఫేర్ గురుకుల పాఠశాల నందు నందు సీటు ఇప్పించగలరని ఒకవేళ చుంచుపల్లి నందు సీటు రాలేనిచో మరి ఎక్కడైనా సీటు ఇప్పించగలరని చేసిన దరఖాస్తును పరిశీలించి తగు చర్యల నిమిత్తం ఆర్ సి ఓ కి ఎండార్స్ చేశారు.ఈ ప్రజావాణి కార్యక్రమంలో అన్ని శాఖల జిల్లా అధికారులు తదితరులు పాల్గొన్నారు.

telugu velugu

Admin

తెలుగు వెలుగు టీవీ

మరిన్ని వార్తలు

Copyright © Telugu Velugu TV 2026. All right Reserved.



Developed By :