Saturday, 18 April 2026 06:06:53 PM
# ఆరోగ్య సూత్రాలు పాటించండి శ్రమదానం చేయండి ఆరోగ్యంగా ఉండండి. Dr తుకారాం రాథోడ్ DMHO # బాల్యవివాహాలను అంతం చేద్దాం - ఆడపిల్లలకు బంగారు భవిష్యత్తును అందిద్దాం. # మానవత్వం చాటుకున్న సుజాతనగర్ ఎస్సై రమాదేవి. # సిపిఐ శాఖ సెక్రటరీ కీసరి రాఘవలు"పార్థివ దేహం" నివాళులు ఆర్పించిన సిపిఐ జిల్లా సెక్రటరీ సాబీర్ పాషా. # చిన్న చిన్న నిర్లక్ష్యాలే పెద్ద ప్రమాదాలకు దారితీస్తాయి.ప్రతి ఒక్కరూ కచ్చితంగా రోడ్డు భద్రతా నియమాలను పాటించాలి: ఎస్పీ రోహిత్ రాజు. # అశ్వరావుపేటలో రెండు 33/11 కేవీ విద్యుత్ ఉపకేంద్రాలకు శంకుస్థాపన. రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క మల్లు. # ఘనంగా అంబేద్కర్ 135వ జయంతి వేడుకలు # సమ్మర్ గేమ్స్ కోచింగ్ క్యాంప్ ప్రారంభించిన ఎమ్మెల్యే జారె. # సింగరేణి హెడ్ ఆఫీస్ వద్ద ఘనంగా రాజ్యాంగ నిర్మాత జయంతి. అంబేద్కర్ చిత్రపటానికి పుష్పాంజలి ఘటించిన ప్రముఖులు. # అంగన్వాడీల అభివృద్దె మా లక్ష్యం.వైరా ఎమ్మెల్యే రాందాస్ నాయక్.అంగన్వాడీ టీచర్లకు స్మార్ట్ ఫోన్ల పంపిణీ.దివ్యాంగులకు సహాయ ఉపకరణాల పంపిణీ. వైరా ఎమ్మెల్యే # జీవితం విలువైనది భద్రత మన బాధ్యత. ర్యాలీ ని ఉద్దేశించి మాట్లాడుతున్న 16 వ డివిజన్ కార్పొరేటర్ మునగడప పద్మ. # అశ్వాపురం ప్రభుత్వ జూనియర్ కళాశాల విద్యార్థిని 973 మార్కులతో ఓంకారిణి టాప్. # ఉపముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క పర్యటన ఏర్పాట్లను పరిశీలించిన ఎమ్మెల్యే జారె. # సెన్సస్ పనులను నిర్ణీత గడువులోపు పూర్తి చేయాలి: జిల్లా కలెక్టర్ జిల్లా కలెక్టర్ అంకిత్. # ఐదు గ్రామపంచాయతీల కోసం సమరభేరి - సోమవారం భద్రాచలంలో భారీ సభ - హాజరుకానున్న రేణుకా చౌదరి. # అంగన్వాడి కేంద్రాల అభివృద్ధికి ప్రభుత్వం కట్టుబడి ఉంది. మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి. # 'ఆరోగ్య వారోత్సవాల సందర్భంగా జిల్లా డ్రగ్స్ కంట్రోల్ అడ్మినిస్ట్రేషన్ ఆధ్వర్యంలో అలవాటుగా మారే మందుల దుర్వినియోగంపై సమగ్ర అవగాహన సదస్సు . # అణగారిన వర్గాలకు అక్షరజ్యోతి ఫూలే. జ్యోతిరావు ఫూలే జీవితం ఎందరికో ఆదర్శం. జేబీపీ స్టేట్ వర్కింగ్ ప్రెసిడెంట్ యెర్రా కామేష్. # యువత మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలి : జిల్లా వైద్యశాఖ అధికారి డా. తుకారాం రాథోడ్. # సాదా బైనమా దరఖాస్తుల పరిష్కారానికి వేగవంతమైన చర్యలు తీసుకోవాలి: జిల్లా కలెక్టర్ అంకిత్ .

బడిబాట గ్రామ సభలో జిల్లా కలెక్టర్ జితేష్ వి. పాటిల్.

Date : 06 June 2025 05:44 PM Views : 469

తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : పిల్లలను ప్రభుత్వ పాఠశాలలో మాత్రమే చేర్పించి వారికి బంగారు భవిష్యత్తును కల్పించడం మనందరి బాధ్యత అని జిల్లా కలెక్టర్ జితేష్ వి. పాటిల్ అన్నారు. శుక్రవారం బడిబాట కార్యక్రమం ప్రారంభోత్సవంలో భాగంగా కరకగూడెం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో నిర్వహించిన గ్రామసభలో కలెక్టర్ ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలలో అన్ని రకాల వసతులతో నాణ్యమైన విద్యను అందిస్తున్నామని, అనవసరంగా డబ్బులు ఖర్చు చేసి విద్యను కొనుక్కోవలసిన అవసరం తల్లిదండ్రులకు లేదని సూచించారు. కార్పొరేట్ పాఠశాలలకు దీటుగా ప్రభుత్వ పాఠశాలలో అన్ని సౌకర్యాలను కల్పించడానికి ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వ పాఠశాలలో పిల్లను చేర్పించి వాటిని బలోపేతం చేయవలసిన అవసరం ఉందన్నారు. ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులకు ఉచితంగా పాఠ్యపుస్తకాలు, నోట్ పుస్తకాలు, ఏకరూప దుస్తులు, మధ్యాహ్న భోజనం అందిస్తుందన్నారు. ఆంగ్ల మాధ్యమంలో బోధన, ఉచిత వైద్య పరీక్షలు, అత్యున్నత విద్యార్హత కలిగిన ఉపాధ్యాయులతో విద్యాబోధన వంటి అన్ని సౌకర్యాలు కల్పిస్తున్నదని కలెక్టర్ తెలిపారు. ఈ విద్యా సంవత్సరం కరకగూడెంలోని జవహర్ నవోదయ విద్యాలయాన్ని ప్రారంభిస్తున్నామని ఆయన తెలిపారు. ప్రారంభోత్సవానికి సంబంధించి అన్ని రకాల ఏర్పాట్లు పూర్తి అయ్యాయని, వేరువేరు ప్రదేశాల నుండి ఈ విద్యాలయానికి విద్యార్థులు ప్రవేశం పొందుతారు కావున వారిని కూడా మన సొంత పిల్లల్లాగానే ఆదరించి పాఠశాల అభివృద్ధికి కృషి చేయాలని, నవోదయ విద్యాలయం ద్వారా దేశంలోనే అత్యంత నాణ్యమైన విద్యను భద్రాద్రి కొత్తగూడెం జిల్లా విద్యార్థినీ విద్యార్థులకు అందుబాటులోకి రావడం మన జిల్లా అదృష్టమని కలెక్టర్ అన్నారు. జవహర్ నవోదయ విద్యాలయ ఏర్పాటు జరుగుతున్న పనులను పరిశీలించి, జూన్ 12 నాటికల్లా అన్ని రకాల పనులు పూర్తిచేసి పాఠశాల ప్రారంభానికి సిద్ధంగా ఉంచాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో జిల్లా విద్యాశాఖ అధికారి వెంకటేశ్వర చారి, కరకగూడెం తాసిల్దార్,జిల్లా అకాడమిక్ కోఆర్డినేటర్ నాగరాజు శేఖర్, కరకగూడెం మండల విద్యాధికారి మంజుల, విద్యాశాఖ ఇంజనీరింగ్ డీఈ, ఏఈ, మండల సమాఖ్య సభ్యులు మరియు గ్రామస్తులు, విద్యార్థుల తల్లిదండ్రులు పాల్గొన్నారు

telugu velugu

Admin

తెలుగు వెలుగు టీవీ

మరిన్ని వార్తలు

Copyright © Telugu Velugu TV 2026. All right Reserved.



Developed By :