తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : కొత్తగూడెం ఈసీ బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జిల్లా ప్రధాన న్యాయమూర్తి జి. ప్రేమలత పరిచయ కార్యక్రమం బుధవారం లైబ్రరీ హాల్లో ఘనంగా నిర్వహించబడింది.ఈ కార్యక్రమానికి అధ్యక్షులు కిరణ్ కుమార్ ముధలకర్ అధ్యక్షత వహించారు.సీనియర్ మరియు జూనియర్ న్యాయవాదులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. జడ్జిని పుష్పగుచ్ఛం తో సత్కరించారు.అధ్యక్షులు బెంచ్-బార్ సమన్వయం ప్రాముఖ్యతను వివరించారు. జడ్జి తన ప్రసంగంలో వృత్తి నైతికత, కోర్టు క్రమశిక్షణపై దృష్టి సారించారు.బెంచ్ మరియు బార్ మధ్య పరస్పర గౌరవం అవసరమని ఆమె పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో కార్యవర్గ సభ్యులు ఉపాధ్యక్షుడు – I (మహిళలు)షేక్ సాజహాన్ పర్వీన్,ఉపాధ్యక్షుడు కాటూరి సంజీవరావు ప్రధాన కార్యదర్శి (General Secretary), గడిపల్లి మహేష్, జాయింట్ కార్యదర్శి గడదాసు నాగరాజు ,క్రీడా కార్యదర్శి బానోత్ దేవదాస్, క్రీడా కార్యదర్శి – II (మహిళలు) నకరాకంటి ఉమ, మల్లెల ఉషారాణి, సీనియర్ న్యాయవాదులు జివికె మనోహర్, గణేష్ బాబు, పలివేల సాంబశివరావు, నాగిరెడ్డి, పోసాని రాధాకృష్ణ, ఉదయ్ భాస్కర్, రమేష్ కుమార్ మక్కడ్, వేల్పుల సుధాకర్, కసాని రమేష్, జూనియర్, మహిళా న్యాయవాదులు మరియు బార్ సభ్యులు పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.
Admin
తెలుగు వెలుగు టీవీ