Sunday, 19 April 2026 01:54:51 PM
# గిరిజన ప్రాంతాలకు వైద్య సేవల్లో నూతన దిశగా ప్రభుత్వం కీలక ముందడుగు. # భద్రాచలం ఏఎస్పీ విక్రాంత్ కుమార్ సింగ్ ఆధ్వర్యంలో.. జిల్లా పోలీస్ హెడ్ క్వార్టర్స్ నందు Prosecution Review Committee (PRC) సమావేశం నిర్వహించబడింది. # చండ్రుగొండలో మూతపడ్డ పెట్రోల్ బంకులు. # పాలిసెట్ ప్రవేశ పరీక్షకు ఉచిత శిక్షణా తరగతులు – రుద్రంపూర్ ప్రభుత్వ పాలిటెక్నిక్. # ప్రతి ఒక్కరూ ట్రాఫిక్ నియమాలను పాటిస్తూ రోడ్డు ప్రమాదాలను నియంత్రించడంలో బాధ్యతగా వ్యవహరించాలి : డిఎస్పీ ఆదినారాయణ. # 6 నెలలుగా డాక్టర్ లేని ప్రభుత్వ హోమియో వైద్యశాల. # ఆరోగ్య సూత్రాలు పాటించండి శ్రమదానం చేయండి ఆరోగ్యంగా ఉండండి. Dr తుకారాం రాథోడ్ DMHO # బాల్యవివాహాలను అంతం చేద్దాం - ఆడపిల్లలకు బంగారు భవిష్యత్తును అందిద్దాం. # మానవత్వం చాటుకున్న సుజాతనగర్ ఎస్సై రమాదేవి. # సిపిఐ శాఖ సెక్రటరీ కీసరి రాఘవలు"పార్థివ దేహం" నివాళులు ఆర్పించిన సిపిఐ జిల్లా సెక్రటరీ సాబీర్ పాషా. # చిన్న చిన్న నిర్లక్ష్యాలే పెద్ద ప్రమాదాలకు దారితీస్తాయి.ప్రతి ఒక్కరూ కచ్చితంగా రోడ్డు భద్రతా నియమాలను పాటించాలి: ఎస్పీ రోహిత్ రాజు. # అశ్వరావుపేటలో రెండు 33/11 కేవీ విద్యుత్ ఉపకేంద్రాలకు శంకుస్థాపన. రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క మల్లు. # ఘనంగా అంబేద్కర్ 135వ జయంతి వేడుకలు # సమ్మర్ గేమ్స్ కోచింగ్ క్యాంప్ ప్రారంభించిన ఎమ్మెల్యే జారె. # సింగరేణి హెడ్ ఆఫీస్ వద్ద ఘనంగా రాజ్యాంగ నిర్మాత జయంతి. అంబేద్కర్ చిత్రపటానికి పుష్పాంజలి ఘటించిన ప్రముఖులు. # అంగన్వాడీల అభివృద్దె మా లక్ష్యం.వైరా ఎమ్మెల్యే రాందాస్ నాయక్.అంగన్వాడీ టీచర్లకు స్మార్ట్ ఫోన్ల పంపిణీ.దివ్యాంగులకు సహాయ ఉపకరణాల పంపిణీ. వైరా ఎమ్మెల్యే # జీవితం విలువైనది భద్రత మన బాధ్యత. ర్యాలీ ని ఉద్దేశించి మాట్లాడుతున్న 16 వ డివిజన్ కార్పొరేటర్ మునగడప పద్మ. # అశ్వాపురం ప్రభుత్వ జూనియర్ కళాశాల విద్యార్థిని 973 మార్కులతో ఓంకారిణి టాప్. # ఉపముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క పర్యటన ఏర్పాట్లను పరిశీలించిన ఎమ్మెల్యే జారె. # సెన్సస్ పనులను నిర్ణీత గడువులోపు పూర్తి చేయాలి: జిల్లా కలెక్టర్ జిల్లా కలెక్టర్ అంకిత్.

ప్రతి వాహనదారుడు తప్పనిసరిగా రోడ్డు భద్రతా నియమాలను పాటించాలి : ఎస్పీ రోహిత్ రాజు ఐపిఎస్

Date : 30 January 2025 07:34 PM Views : 786

తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : జాతీయ రోడ్డు భద్రతా మాసోత్సవాలలో భాగంగా కొత్తగూడెం సబ్ డివిజన్ పోలీసుల ఆధ్వర్యంలో ప్రకాశం స్టేడియంలో వాహనదారులకు అవగాహనా కార్యక్రమం ఏర్పాటు చేయడమైనది. జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఐపీఎస్ గారి ఆదేశాల మేరకు కొత్తగూడెం డిఎస్పి రెహమాన్ గారి సూచనలతో సబ్ డివిజన్ పోలీసులు వాహనదారులకు,విద్యార్థినీ,విద్యార్థులకు ముఖ్యంగా ఆటోడ్రైవర్లకు జాతీయ రోడ్డు భద్రత మాస ఉత్సవాల సందర్భంగా భారీ కార్యక్రమాన్ని చేపట్టారు.ఈ కార్యక్రమంలో సుమారు 2000 మంది పాల్గొన్నారు.ఎస్పీ గారితో పాటు కొత్తగూడెం డిఎస్పీ రెహమాన్,ఇల్లందు డిఎస్పీ చంద్రభాను,మణుగూరు డిఎస్పీ రవీందర్ రెడ్డి,పాల్వంచ డిఎస్పీ సతీష్ కుమార్,కొత్తగూడెం మున్సిపల్ కమీషనర్ శేషాంజనేయ స్వామి,జిల్లా రవాణాధికారి వెంకట రమణలు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఐపిఎస్ గారు మాట్లాడుతూ ప్రతి ఒక్క వాహనదారుడు రోడ్డు భద్రతా నియమాలను తప్పనిసరిగా పాటించాలని సూచించారు. ముందుగా విద్యార్థులతో కలిసి అక్కడ రోడ్డు భద్రతా నియమాలను సూచిస్తూ ఏర్పాటు చేసిన స్టాల్స్ ను సందర్శించారు.నిర్లక్ష్యంగా వాహనాలు నడపడం ద్వారా దేశంలో నిత్యం రోడ్డు ప్రమాదాలు సంభవించి చాలామంది తమ విలువైన ప్రాణాలను కోల్పోతున్నారని అన్నారు.వాహనదారులందరూ హెల్మెట్,సీట్ బెల్ట్ లు ధరించి వాహనాలను నడపాలని కోరారు.ర్యాష్ డ్రైవింగ్,మద్యం సేవించి వాహనాలు నడపడం,ఓవర్ లోడ్,రాంగ్ రూట్లో ప్రయాణించడం లాంటి తప్పిదాలతో ఎక్కువగా రోడ్డు ప్రమాదాలు సంభవిస్తున్నాయని తెలిపారు.ఈ కార్యక్రమంలో సుమారుగా 500 కు పైగా ఆటో డ్రైవర్లు తమ వాహనాలతో సహా హాజరయ్యారు

వారిని ఉద్దేశించి మాట్లాడుతూ ఆటో డ్రైవర్ సోదరులు కూడా ఖాకీ యూనిఫామ్ ధరించి ఈ కార్యక్రమానికి హాజరవడంతో ప్రకాశం స్టేడియం ప్రాంగణమంతా ఖాకీమయమైందని అన్నారు.ఆటోలు నడుపుకుంటూ జీవనం సాగించే ప్రతి ఒక్కరూ కూడా ప్రభుత్వ ఇన్సూరెన్స్ పథకాలను ఉపయోగించుకోవాలని సూచించారు.పోలీస్ శాఖతో పాటు ప్రజలతో నిరంతరం ప్రత్యక్షంగా సంబంధం కలిగి ఉండేది ఆటో డ్రైవర్లు మాత్రమే అని అన్నారు.పోలీసు వారు సూచించిన నియమాలను పాటించి ఆటో డ్రైవర్లు బాధ్యతగా వ్యవహరించాలని కోరారు.అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడే వ్యక్తులు మరియు అనుమానాస్పదంగా ఎవరైనా కనిపిస్తే వెంటనే పోలీసు వారికి సమాచారం అందించి బాధ్యత గల పౌరులుగా కూడా మెలగాలని కోరారు.అనంతరం జిల్లా వ్యాప్తంగా ఎనిమిది వేల ఆటోలకు సంబంధించి పోలీస్ శాఖ తరపున తయారుచేసిన స్టిక్కర్లను ఎస్పీ ఆవిష్కరించారు.ఆటో డ్రైవర్ల అందరూ కూడా తమ సమాచారంతో కూడిన స్టిక్కర్లను కచ్చితంగా అమర్చుకోవాలని తెలిపారు.ఈ కార్యక్రమంలో పోలీస్ కళాబృందం మరియు జిల్లా పౌరసంబంధాల శాఖ కళాకారుల చేత ట్రాఫిక్ అవగాహనపై పాటల రూపంలో సాంస్కృతిక కార్యక్రమాలను కూడా నిర్వహించడం జరిగింది.అనంతరం ఈ కార్యక్రమాన్ని ఘనంగా ఏర్పాటు చేసిన కొత్తగూడెం డిఎస్పీ రెహమాన్,ట్రాఫిక్ ఎస్ఐలు నరేష్,మదార్ మరియు పట్టణ సీఐలు కరుణాకర్,రమేష్,శివ ప్రసాద్ మరియు జూలూరుపాడు సీఐ ఇంద్రశేనారెడ్డి లను శాలువాలతో ఎస్పీ సత్కరించారు.

telugu velugu

Admin

తెలుగు వెలుగు టీవీ

మరిన్ని వార్తలు

Copyright © Telugu Velugu TV 2026. All right Reserved.



Developed By :