తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : భద్రాద్రి కొత్తగూడెం మార్చి 20 తెలుగు వెలుగు) జూలూరుపాడు మండల పరిధిలో పదవ తరగతి పబ్లిక్ పరీక్షలను రెండు సెంటర్లలో ఏర్పాటు చేసినట్టు ఎంఈఓ బానోత్ జుంకీలాల్ తెలిపారు. మార్చి 21 నుండి ఏప్రిల్ 2 తేదీ వరకు పరీక్ష సమయం ఉదయం 9:30 నుండి 12 :30 నిమిషాల వరకు మండల వ్యాప్తంగా ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్న విద్యార్థులు 304 మంది మరియు ప్రైవేట్ పాఠశాలల యందు చదువుతున్న విద్యార్థుల సంఖ్య 43 మొత్తం కలిపి 347 మంది విద్యార్థులకు పబ్లిక్ పరీక్షలు జరుగుతాయని అన్నారు. పరీక్షా కేంద్రాల వద్ద 100 మీటర్ల దూరం వరకు 144 సెక్షన్ విధించబడుతుందని తెలిపారు. సిట్టింగ్ కేర్, కస్టూడియన్, జాయింట్ కస్టోడియన్ పర్యవేక్షణలో పరీక్షలు నిర్వహింపబడతాయని, పరీక్షా కేంద్రాలలోకి విద్యార్థులు , ఇన్జీలేటర్స్ సెల్ ఫోన్లు, స్మార్ట్ వాచీలు, ఎలాంటి ఎలక్ట్రానిక్ పరికరాలకు అనుమతులు ఉండవని ఎంఈఓ జుంకీలాల్ తెలిపారు
Admin
తెలుగు వెలుగు టీవీ