తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : ఈనెల 28- 9- 2024 శనివారం రోజున సనాతన హిందూ ధర్మ ఐక్యవేదిక ఆధ్వర్యంలో జరుపనున్న ర్యాలీ నిరసన మహా ప్రదర్శనను జయప్రదం చేయండి. కలియుగ దైవం శ్రీ తిరుమల వెంకటేశ్వర స్వామి వారి వద్ద జరిగిన అపచారాన్ని ఖండిస్తూ ఎంజి రోడ్ లోని గణేష్ టెంపుల్ నుండి విద్యానగర్ కాలనీ శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి వారి దేవాలయం వరకు జరుపబడును హిందువుల మనోభావాలను కించపరిచిన వారిని వారి చేష్టలను ఖండిస్తూ జరుపుకుంటున్న ఈ నిరసన కార్యక్రమంలో కొత్తగూడెం పట్టణం మరియు పరిసర ప్రాంత గ్రామాల నుండి ప్రతి ఇంటి నుండి హిందూ బంధువులందరూ పాల్గొని ఈ నిరసన ప్రదర్శనను జయప్రదం చేయవలసినదిగా కోరుచున్నాము. ఈ సమావేశంలో పాల్గొన్నవారు కొదమసింహం పాండురంగచార్యులు , దారా రమేష్ విశ్వహిందూ పరిషత్ జిల్లా ఉపాధ్యక్షులు.ఇంద్రగంటి శంకర ప్రసాద్ శర్మ , కొడమంచిలి రాధాకృష్ణ శర్మ, పాలడుగు వర్ధన్ రావు , కన్నెగంటి కృష్ణమూర్తి , యెల్దండి పూర్ణచందర్ రావు ,గుంటూరు రామ దేవి, దండిభట్ల రామానుజన్ కుమార్ శర్మ , మెరుగు చింతేశ్వర్ , ఎం కిరణ్ , మదన్ రెడ్డి , గిరిధరాచార్యులు .కొండవీటి దత్తాత్రేయ శర్మ .వాసిరెడ్డి ప్రసాద్.మారుగంటి సాయి గోపాల ఆచార్యులు . ఇతర హిందూ సంఘములు మరియు కుల సంఘముల పెద్దలు ఈ సమావేశంలో పాల్గొన్నారు.
Admin
తెలుగు వెలుగు టీవీ