తెలుగు వెలుగు టీవీ - వార్తలు / భద్రాచలం : భద్రాచలం పట్టణంలో తాళం వేసి ఉన్న ఇంట్లో దొంగతనాలకు పాల్పడుతున్న ఇద్దరు వ్యక్తులను అరెస్టు చేసినట్లు టౌన్ పోలీసులు తెలిపారు. ఆదర్శనగర్ కాలనీలో విక్రమ్, జీవన్ ప్రకాష్ అనే ఇద్దరు దొంగలు తాళం వేసి ఉన్న ఇంట్లో తాళాలను పగలగొట్టి విలువైన వస్తువులను అపహరించారని చెప్పారు. వీరి వద్ద నుంచి 8 తులాల బంగారం, 20 తులాల వెండితో పాటు ఓ సెల్ ఫోన్ను స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేసినట్లు పేర్కొన్నారు.
Admin
తెలుగు వెలుగు టీవీ