తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : యువకులు వ్యసనాలకు దూరంగా ఉండాలని తెలంగాణ రాష్ట్ర పవర్ లిఫ్టింగ్ అసోసియేషన్ ఉపాధ్యక్షులు ఉమ్మళ్ళ మల్లేష్ యాదవ్ అన్నారు. ఈ నెల 2వ తేదీ నుండి 7వ తేదీ వరకు కేరళలో జరిగిన జాతీయ మాస్టర్స్ పవర్ లిఫ్టింగ్ ఛాంపియన్ పోటీలలో 4బంగారు పథకాలు సాధించిన మల్లేష్ యాదవ్ ను పవర్ హౌస్ జిమ్ నిర్వాహకులు, కోచ్ షమీఉద్దీన్ శాలువ, పూలబొకేలతో ఘనంగా సన్మానించారు. ఈ సంధర్భంగా మల్లేష్ మాట్లాడుతూ యువత చెడు వ్యసనాలకు బానిస కాకుండా సక్రమమైన మార్గంలో వెళ్తూ తమ భవిష్యత్తుకు బంగారు బాటలు వేసుకోవాలని, ప్రతీ రోజు క్రమం తప్పకుండా వ్యాయామం చేయడం ద్వారా దృఢంగా, ఆరోగ్యంగా ఉంటారన్నారు.ఎందుకంటే దేశ భవిష్యత్తు యువతి, యువకుల పైనే ఆధారపడి ఉందని,యువత ఆరోగ్యంగా ఉంటేనే దేశం ఆరోగ్యంగా ఉన్నట్టు అని అన్నారు. షమీ ఉద్దీన్ కోచ్ నేషనల్ పవర్ లిఫ్టింగ్ ఛాంపియన్ షిప్ నెగ్గడం,అదేవిధంగా ఎన్నో ఏళ్ళుగా తన శిక్షణలో వందలాది మంది యువతి,యువకులను రాష్ట్ర,జాతీయ క్రీడాకారులుగా తీర్చిదిద్దడంలో ఎనలేని కృషి ఉందని ప్రశంసించారు. ఈ కార్యక్రమంలో న్యాయవాది యెర్రా కామేష్, వై.సుబ్రమణ్యం, ఎలక్ట్రికల్ ఏడి రవి, పాషా, లారెన్స్, పార్థు, అజయ్, తదితరులు పాల్గొన్నారు.
Admin
తెలుగు వెలుగు టీవీ