తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొనిజర్ల : ఫారెస్ట్ డెవలప్మెంట్ కార్పొరేషన్, కొత్తగూడెం డివిజన్ కు చెందిన జామాయిల్ తోటల హార్వెస్టింగ్ పనులకు సంబంధించి లంచం డిమాండ్ చేసిన కేసులో అవినీతి నిరోధక శాఖ (ACB) అధికారులు కీలక అరెస్టులు చేశారు. ఫిర్యాదుదారునికి లబించిన టెండరు సంబంధించి, యూనిట్ నెం. 8 నుండి 15 వరకు మొత్తం 32,000 టన్నుల యూకలిప్టస్ చెట్ల నరికివేత పనులకు గాను, ఒక్క టన్నుకు రూ.90 చొప్పున మొత్తం రూ.28,80,000/- లంచంగా డిమాండ్ చేసినట్లు ఆరోపణలు నమోదయ్యాయి. అందులో భాగంగా, పెనగడప గ్రామం శివార్లలోని 9వ యూనిట్ కు సంబంధించిన 3,900 టన్నుల యూకలిప్టస్ చెట్ల నరికివేత పనుల భవిష్యత్తు బిల్లుల ఆమోదం కోసం, టన్నుకు రూ.90/- చొప్పున మొత్తం రూ.3,51,000/- లంచం డిమాండ్ చేసి తీసుకుంటున్న సమయంలో, ప్లాంట్ మేనేజర్ రాజేందర్ మరియు అతనికి సహకరించిన గోపాలకృష్ణ (సీతాయిగూడెం నివాసి)లను ACB అధికారులు 03-01-2026 నాడు రెడ్ హ్యాండెడ్గా అరెస్ట్ చేసి కోర్టుకు రిమాండ్ చేశారు. ఈ కేసులో ప్రధాన నిందితురాలైన డివిజనల్ మేనేజర్ తాటి శ్రీ శ్రావణి అప్పటినుంచి పరారీలో ఉండగా, నమ్మదగిన సమాచారం మేరకు విశాఖపట్నంలోని స్టీల్ ప్లాంట్ వద్ద వుండగా ఆమెను పట్టుకొని, ఈరోజు అరెస్ట్ చేసి కోర్టుకు రిమాండ్ చేయనైనది.
Admin
తెలుగు వెలుగు టీవీ